Hyderabad: హైదరాబాద్ సీసీఎస్లో ఏం జరుగుతోంది!
ఎన్నో సంచలన కేసులను ఛేదించిన నగర సీసీఎస్ వివాదాల కేంద్రంగా మారింది. ఇక్కడ పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులపై అవినీతి ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
సాహితీ బాధితుల ఆందోళనతో ఉన్నతాధికారులు అప్రమత్తం
ఆరోపణలకు గురైన పోలీసు సిబ్బందిపై అంతర్గత విచారణ
ఈనాడు, హైదరాబాద్
ఎన్నో సంచలన కేసులను ఛేదించిన నగర సీసీఎస్ వివాదాల కేంద్రంగా మారింది. ఇక్కడ పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులపై అవినీతి ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ప్రతిష్ఠ దెబ్బతినకముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సీసీఎస్ను పూర్తి స్థాయి ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రీ లాంచింగ్ ముసుగులో పలు రియల్ సంస్థలు పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాయి. వాటిలో సాహితీ ఇన్ఫ్రా సాగించిన మోసాల చిట్టాలో వేలాది మంది బాధితులున్నారు. నాలుగేళ్ల కిందట మొదలైన సాహితీ మోసాలపై 2022లో నగర సీసీఎస్లో కేసు నమోదైంది. ఈ వ్యవధిలో నగరంలో ముగ్గురు పోలీసు కమిషనర్లు మారారు. సీసీఎస్లో ముగ్గురు డీసీపీలు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన ప్రతి సీపీ, డీసీపీ సాహితీ కేసు పురోగతిని సమీక్షించారు. వీలైనంత త్వరితగతిన బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన ఏసీపీ ఉమామహేశ్వరరావు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఆదాయాన్ని మించి ఆస్తులున్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. అంత కీలకమైన కేసులో ఏసీపీ వెనుక ఉన్న పోలీసు అధికారులు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసులో పురోగతి లేదని గుర్తించిన ఒకరు దర్యాప్తు అధికారి.. ఉమామహేశ్వరరావును మార్చాలని సిఫార్సు చేశారు. సాహితీ కేసులో స్వాధీనం చేసుకున్న నగదు కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలంటూ వచ్చిన ప్రతిపాదనను సీసీఎస్ సమీక్ష సమావేశంలో పోలీసు ఉన్నతాధికారి ఒకరు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా తీసుకున్న నిర్ణయంలా పైకి కనిపించినా, దీని వెనుక దాగిన అంతరార్థం గుర్తించి.. ఆ ప్రతిపాదన అమలు చేయకుండా ఆదేశాలు జారీచేశారు. ఇదే తరహాలో ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఆర్ధిక నేరస్తులను కాపాడేందుకు చేసిన చీకటి వ్యవహారాలు కూడా బయటపడుతున్నాయి. మోసగాళ్ల బారినపడి రూ.కోట్లు నష్టపోయిన బాధితులు ఒక్కొక్కరుగా ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. కేసుల నమోదు, దర్యాప్తు సమయంలో తమను వేధింపులకు గురిచేసిన వారిపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించినట్టు సమాచారం. అక్కడినుంచి వచ్చిన నివేదిక ఆధారంగా సీసీఎస్లో ఏసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకూ బదిలీలు తప్పవని తెలుస్తోంది.
గ్రేటర్ మెట్రోజోన్ లైన్స్ డివిజన్ల పునర్విభజన కమిటీ నియామకం
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: గ్రేటర్ మెట్రోజోన్ పరిధిలోని లైన్స్ విభాగం నిర్వహణతో పాటు సమస్యలను వేగవంతంగా గుర్తించి పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు కన్స్ట్రక్షన్ కమిటీని నియమిస్తూ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ యుషారఫ్ ఫరూకి శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా మెట్రోజోన్ సీజీఎం కె.నర్సింహ స్వామి, రంగారెడ్డి జోన్ సీజీఎం పి.ఆనంద్, మేడ్చల్ జోన్ సీజీఎం సాయిబాబా, స్కాడా ఎస్ఈ, సైబర్ సిటీ ఎస్ఈ వెంకన్న ఉన్నారు. వీరు జూన్ 3వ తేదీ నాటికి అధ్యయనం పూర్తిచేసి నివేదికను దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ సీజీఎండీకి అందజేయాల్సి ఉంది. సబ్ ఇంజినీర్లు, సెక్షన్ అధికారుల విధులు, బాధ్యతల్లో మార్పులు తేచ్చే అవకాశాలపై ఆపరేషన్ , మెయింటేనెన్స్ (ఓఅండ్ఎం) కన్స్ట్రక్షన్ ఆఫ్ కమిటీని నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా కమర్షియల్, ఓఅండ్ఎం, పర్చేజెస్ అండ్ మెటల్ మేనేజ్మెంట్ (పీఅండ్ఎంఎం), ఫైనాన్స్ డైరెక్టర్లు, బంజారాహిల్స్, సైబర్సిటీ ఎస్ఈలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సబ్ ఇంజినీర్లు సాంకేతిక పరమైన సమస్యల పరిష్కారంలో మార్పులు తీసుకురానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
మంచి దొంగ!
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
అతివేగం.. తీసింది ఇద్దరి ప్రాణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ పిల్మ్సిటీలో ప్రెండిషిప్ వీక్
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?