పిల్లల్లోనూ రుమటాలజీ, ఆటో ఇమ్యూన్ సమస్యలు
ఇమ్యూన్ డెఫిషియన్సీ లక్షణాలు: పిల్లల్లో జ్వరాలు రావడం సహజమే. అలా కాకుండా రెండు, మూడు వారాలకంటే ఎక్కవగా జ్వరం రావడం, ఏమైనా ఇన్ఫెక్షన్లు సోకడం, అదే పనిగా చెవిలోంచి చీము కారడం, శరీరంలో అక్కడక్కడ చీముగడ్డలు కనిపించడం, కాలేయంలో, బ్రెయిన్, ఊపిరితిత్తుల్లో గడ్డలు కావడం, బరువు పెరగకపోవడం.
రాష్ట్రంలోనే మొదటిసారిగా నిలోఫర్లో ఏఎన్ఏ, ఇమ్యునో ఫ్లోరోసెస్ పరీక్షలు
సాధారణంగా పెద్దవారిలోనే కీళ్లనొప్పులు వస్తాయనుకుంటాం. కానీ, పిల్లల్లోనూ ఆ సమస్య వస్తుందంటున్నారు నిలోఫర్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఫెల్లో ఇన్ ఇమ్యునాలజీ అండ్ రుమటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.కవిత. అయితే, పిల్లల్లో పీడియాట్రిక్ రుమటాలజీ(కీళ్లనొప్పులు), ‘ఆటో ఇమ్యూన్’ (స్వయం ప్రతిరక్షక) వ్యాధులు ఎందుకు, ఎలా వస్తాయో చెప్పడం కష్టమే.. కొన్ని కుటుంబాల్లో జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకకుండా రోగనిరోధక(ఇమ్యూన్) వ్యవస్థ రక్షిస్తుంది. కొన్నిసార్లు ఈ వ్యవస్థే మన అవయవాలు, కణజాలంపై దాడి చేయడాన్ని ‘ఆటో ఇమ్యూన్’ అంటాము. ముఖ్యంగా పిల్లల్లో ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉండటం, ఇమ్యూన్ విధానం సరిగా అభివృద్ధి చెందకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్యతో నిత్యం రెండు మూడు కేసులు వస్తున్నాయని చెబుతున్నారు. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే..
న్యూస్టుడే, రెడ్హిల్స్
ఇమ్యూన్ డెఫిషియన్సీ లక్షణాలు: పిల్లల్లో జ్వరాలు రావడం సహజమే. అలా కాకుండా రెండు, మూడు వారాలకంటే ఎక్కవగా జ్వరం రావడం, ఏమైనా ఇన్ఫెక్షన్లు సోకడం, అదే పనిగా చెవిలోంచి చీము కారడం, శరీరంలో అక్కడక్కడ చీముగడ్డలు కనిపించడం, కాలేయంలో, బ్రెయిన్, ఊపిరితిత్తుల్లో గడ్డలు కావడం, బరువు పెరగకపోవడం. పిల్లలకు వాక్సిన్లు ఇప్పిస్తాం. దానికి ఒకటి, రెండు రోజులు జ్వరం ఉంటుంది. కానీ కొందరికి 15, 20 రోజుల పాటు జ్వరం వస్తూనే ఉంటుంది. అలాంటి పిల్లల్లో ఈ సమస్యపై అనుమానం వ్యక్తం చేయవచ్చు. దగ్గు, జ్వరం ఎక్కువగా రావడం, మందులు వాడాల్సి రావడం వంటి లక్షణాలుంటే ఇమ్యూనో డెఫిషియన్సీ అని గుర్తించి వైద్యులను సంప్రదించాలి.
ఆటో ఇమ్యూన్ లక్షణాలు: పిల్లల్లో ఎదుగుదల బాగానే ఉంటుంది. జ్వరం ఎక్కువగా రెండు, మూడు వారాలు వస్తూనే ఉంటుంది. ఒంటిపై దద్దుర్లు రావడం, బరువు తగ్గడం, వెంట్రుకలు ఊడిపోవడం, నోటిపూత వేధిస్తుంది. ఉదయం వేళ కీళ్లనొప్పులు ఉంటాయి. ఇవి ఎక్కువ రోజులు ఉండటం వంటి లక్షణాలుంటే ‘ఆటో ఇమ్యూన్Â’ సమస్య ఉండవచ్చు. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఇది వరకు దీనికి సరైన చికిత్స లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తొలిసారి నిలోఫర్ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చింది. ఇది వరకు ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రోగులను నిమ్స్కు పంపించేవాళ్లం. కానీ నిలోఫర్లోనే జరిగేలా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉషారాణి అన్ని ఏర్పాట్లు చేశారు.
కిడ్నీ వ్యాధిలా అనిపించినా..
సాధారణంగా పిల్లల్లో కిడ్నీ సమస్యలుంటే నెఫ్రాలాజిస్ట్ చూస్తారు. ఆర్థో ఇమ్యూన్ సమస్యలు కూడా కిడ్నీకి సంబంధించిన వ్యాధిలా బయటపడే అవకాశం ఉంది. రక్తహీనత, గుండె వంటి ఇతరాత్ర సమస్యలుంటాయి. కిడ్నీ సమస్యకైతే 5 నుంచి 7 వారాలు చికిత్స తీసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ, ఆటో ఇమ్యూన్ సమస్య మందులతో తగ్గదు. జీవితాంతం ఉంటుంది. షుగర్, బీపీ తరహాలో జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది.
నిలోఫర్ రెఫరల్ ఆసుపత్రి..
రాష్ట్రంలోని వివిధ జిల్లాలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి కేసులు వస్తుంటాయి. ప్రతి రోజు ఆటో ఇమ్యూన్, రుమటాలజీకి సంబంధించి ఒకటి, రెండు కేసులు వస్తున్నాయి. వీరికి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. ఈ వ్యాధి నిర్ధారణకు సంబంధించి ఖరీదైన ‘యాంటీన్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్(ఏఎన్ఏ)’, ‘ఇమ్యునో ఫ్లోరోసెస్ టెస్ట్’లు మొదటిసారిగా నిలోఫర్ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ సమస్యకు సంబంధించి ఓపీ మాత్రం గురువారం ఉంటుంది. అయితే, ఇన్పేషంట్(ఐపీ) కేసులు రోజు చూస్తారు. చికిత్సకు అవసరమైన ఖరీదైన మందులు కూడా నిలోఫర్లోనే ఇస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
[ 26-07-2024]
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
డివైడర్ దాటి బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
[ 26-07-2024]
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ఓ కారు డివైడర్ దాటి అవతలివైపు మార్గంలో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. -
తాగి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ జులుం
[ 26-07-2024]
మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించాలి కానీ ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్నారు. -
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81