అనుమతిపోతోంది..
అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) ఛార్జీలు నగరంలోని పేదలకు గుదిబండగా మారాయి.
బస్తీవాసులకు గుదిబండలా మారిన ఎల్ఆర్ఎస్
అనుమతికి వెళ్తే 100 గజాలకు రూ.10లక్షల రుసుము
‘ఓపెన్ స్పేస్’ ఛార్జీల పేరుతో ఆర్థిక భారం
ఈనాడు, హైదరాబాద్: అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) ఛార్జీలు నగరంలోని పేదలకు గుదిబండగా మారాయి. సాధారణ ప్రజలు అనుమతి తీసుకుని ఇంటిని నిర్మించుకునే పరిస్థితి లేదు. 150 గజాల స్థలానికి ఇంటి నిర్మాణ అనుమతి కావాలంటే రూ.10లక్షల రుసుము చెల్లించాల్సి వస్తోంది. వంద గజాల స్థలమైనా సరే.. కనిష్ఠంగా రూ.5లక్షల ఛార్జీ పడుతోంది. జీ+1 భవనానికి రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల మేర చెల్లించాలంటే పేదలు హడలెత్తిపోతున్నారు. ఆ భయంతో 99 శాతం మంది బస్తీవాసులు అనుమతి లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నారు. కిక్కిరిసిపోయిన బస్తీల్లో, పాత కాలం ఊళ్లలో చేపట్టే నిర్మాణాలకు ఎల్ఆర్ఎస్ రుసుము వసూలు చేయడమేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఖాళీ స్థలాలను అభివృద్ధి చేస్తామంటూ.. ప్రభుత్వం వసూలు చేస్తోన్న ‘ఓపెన్ ల్యాండ్ ఛార్జెస్’ నిధులను ఇప్పటి వరకు ఎక్కడా ఖర్చు చేయలేదని, ఆ పేరుతో పేదలపై ఆర్థిక భారం మోపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నరకం చూస్తోన్న పేదలు.. ఫిల్మ్నగర్ బస్తీకి చెందిన ఓ వ్యక్తి రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన 166గజాల స్థలంలో ఇల్లు కట్టుకుందామని జీహెచ్ఎంసీని ఆశ్రయించగా.. రూ.8లక్షల ఎల్ఆర్ఎస్ రుసుము కట్టమన్నారు. పాత యజమాని 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నందున రుసుము తక్కువ పడిందని.. లేదంటే రూ.12 లక్షల ఛార్జీ ఉండేదని అధికారులు చెప్పడంతో.. ఇంటి నిర్మాణ అనుమతి ఆలోచన విరమించుకోవడం గమనార్హం. ఇలా ఎంతోమంది కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థలంలో ఇంటిని కట్టుకోలేకపోతున్నారు. మరికొందరు అనుమతి లేకుండానే పని కానిచ్చేస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ ఉద్దేశమేంటి?: అధికారిక లేఅవుట్లో పది శాతం స్థలాన్ని ఖాళీగా వదలాల్సి ఉంటుంది. అనధికారిక లేఅవుట్లలో ఖాళీ స్థలం ఉండదు. దీంతో జనావాసాల్లో సౌకర్యాలు సరిగా ఉండవని, అలాంటి లేఅవుట్లలోని ఇళ్ల స్థలాల నుంచి 0.14శాతం ఓపెన్ ల్యాండ్ ఛార్జీలను వసూలు చేస్తారు. ఆ డబ్బుతో కొంత ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి అనధికార లేఅవుట్లోని కాలనీకి కేటాయించాలన్నది ముఖ్యోద్దేశం. కానీ.. జీహెచ్ఎంసీ ప్రణాళిక విభాగం ఎల్ఆర్ఎస్ను ఆదాయ వనరుగానే చూస్తోంది. ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ పథకం కింద రూ.100కోట్లకుపైగా రుసుము వసులు చేయగా, అందులో ఒక్క రూపాయిని కూడా ఉద్దేశించిన లక్ష్యం కోసం వెచ్చించలేదు.
మినహాయింపులు ఉండాల్సిందే..
జీహెచ్ఎంసీ పరిధిలో అధికారికంగా 1,500 మురికివాడలు ఉన్నాయి. మరో వెయ్యికిపైగా పాత కాలం కాలనీలు, శివారు గ్రామాలు ఉన్నాయి. కొన్ని బస్తీల్లో 50 గజాలు, 60గజాల స్థలాల్లో ఐదారంతస్తుల భవనాలుంటాయి. అద్దెల కోసమో, అన్నదమ్ముల వాటాగానో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. ఆయా పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా.. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని నగరం మొత్తానికి వర్తింపజేసిందనే విమర్శలొస్తున్నాయి. జన సాంద్రత అధికంగా ఉన్న చోట, అరకొరగా మిగిలిన ఖాళీ స్థలాలకు, పాత ఇళ్లను కూల్చి కొత్తగా నిర్మించే ఇళ్లకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని వర్తింపజేయడంలో ఉద్దేశమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఖైరతాబాద్ చింతల బస్తీలో లేదా సికింద్రాబాద్ అడ్డగుట్టలో, జూబ్లిహిల్స్లోని షేక్పేట బస్తీలో, లేదంటే పాతబస్తీలోని గల్లీల్లో కట్టే ఇళ్లకు ఎల్ఆర్ఎస్ రుసుము ఏ లెక్కన వసూలు చేస్తారని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
మంచి దొంగ!
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
అతివేగం.. తీసింది ఇద్దరి ప్రాణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ పిల్మ్సిటీలో ప్రెండిషిప్ వీక్
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?