నకిలీ చెలా‘మనీ’.. ముఠా అరెస్టు
నకిలీ నోట్లు ముద్రించి బహిరంగ మార్కెట్లో చెలామణి చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసుల బృందం అరెస్టు చేసింది.
స్వాధీనం చేసుకున్న రూ.500 నకిలీ నోట్ల కట్టలు
బేగంబజార్, న్యూస్టుడే: నకిలీ నోట్లు ముద్రించి బహిరంగ మార్కెట్లో చెలామణి చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసుల బృందం అరెస్టు చేసింది. వారి నుంచి రూ.36,35,500 నకిలీ రూ.500 నోట్లు, అసలైన నగదు రూ.28వేలు, 8 చరవాణులు, ద్విచక్రవాహనం, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేశారు. వారిని తదుపరి విచారణ నిమిత్తం బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ నగర టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకు చెందిన పి.మురళీకృష్ణ(38) పాతనేరస్థుడు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని తిరుమల థియేటర్ సమీపంలో నివాసముంటున్నాడు. కిచెన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. అతనిపై నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేయడంపై గుంటూరు, తెనాలి, కావలి తదితర ఠాణాల్లో 3 కేసులు నమోదయ్యాయి. అతనికి గతేడాది తమిళనాడులోని కర్రూరు ప్రాంతానికి చెందిన గృహాలంకరణ సామగ్రి విక్రయించే ఖాదర్ మైదేన్(30)తో పరిచయం ఏర్పడింది. పటాన్చెరు వద్ద అద్దె గదిలో ఉంటున్నాడు. అతనితో కలిసి కంప్యూటర్, ప్రింటర్లు, ఇతర ముడిసరకు సాయంతో రూ.500 నకిలీ నోట్లు ముద్రిస్తున్నాడు. అతని సాయంతో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ వ్యాపారాలు చేస్తున్న హితేశ్(30), దశరథ్కుమార్(27) రాజస్థాన్లోని జాలార్ గ్రామవాసులు. గుజరాత్కు చెందిన మాలి రాజురాం(25) జుమ్మేరాత్బజార్లో అద్దెకుంటున్నాడు. బేగంబజార్ ఫీల్ఖానాకు చెందిన టైలరింగ్ సామగ్రి విక్రయించే ప్రవీణ్కుమార్(29)లతో కలిసి వీరంతా బహిరంగ మార్కెట్లో కొంతకాలంగా రూ.500 నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నారు. టాస్క్ఫోర్స్, ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బేగంబజార్ పోలీసులతో కలిసి మంగళవారం బేగంబజార్ ఫీల్ఖానాలోని వీరి స్థావరంపై దాడి చేశారు. ప్రజలు రిజర్వు బ్యాంకు ముద్రించే నోట్లను గుర్తించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్