logo

కిరాణ దుకాణంలో గంజాయి చాక్లెట్లు, పొడి స్వాధీనం

జగద్గిరిగుట్టలోని కిరాణ దుకాణంపై ఎస్‌ఓటీ, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడి చేసి గంజాయి చాక్లెట్లు, పొడి స్వాధీనం చేసుకున్నారు. సీఐ క్రాంతికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం...

Published : 15 Apr 2024 07:43 IST

స్వాధీనం చేసుకున్న సరకు, మనోజ్‌కుమార్‌

షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: జగద్గిరిగుట్టలోని కిరాణ దుకాణంపై ఎస్‌ఓటీ, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడి చేసి గంజాయి చాక్లెట్లు, పొడి స్వాధీనం చేసుకున్నారు. సీఐ క్రాంతికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలోని అసాన్‌సోల్‌ ప్రాంతానికి చెందిన మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌(54) కొన్నేళ్లుగా జగద్గిరిగుట్ట పరిధి అంజయ్యనగర్‌ రోడ్డు నంబరు-1లో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా కోల్‌కతా నుంచి పెద్దఎత్తున గంజాయి చాక్లెట్లు, పొడి తెప్పించి, విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్‌ ఎస్‌ఓటీ, జగద్గిరిగుట్ట పోలీసులు కలిసి ఆదివారం ఉదయం దుకాణంపై దాడి చేశారు. రూ.2,56,000 విలువైన 26 కిలోల గంజాయి చాక్లెట్లు, రూ.10,000 విలులైన 4 కిలోల గంజాయి పొడి స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతాకు చెందిన మోహన్‌ సరకు సరఫరా చేస్తున్నట్లు నిందితుడు పోలీసులకు చెప్పగా.. అతడి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని