logo

నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

ఇటుక బట్టీ వద్ద నీటి తొట్టిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. కుటుంబసభ్యులు పోలీసుల కథనం ప్రకారం..

Updated : 20 Apr 2024 06:16 IST

మేడిపల్లి, న్యూస్‌టుడే: ఇటుక బట్టీ వద్ద నీటి తొట్టిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. కుటుంబసభ్యులు పోలీసుల కథనం ప్రకారం..ఒడిశా రాష్ట్రం బేళా గ్రామానికి చెందిన బైగని సాంబర్‌ అనే మహిళ భర్త రెండేళ్ల కిందట మృతి చెందగా నాలుగు నెలల కిందట ఇద్దరు చిన్నారులతో కలిసి మేడిపల్లిలోని ఇటుక బట్టీలో కూలీ పనికి వచ్చింది. గురువారం రాత్రి ఏడేళ్ల కుమారుడు పరమేశ్వర్‌ ఇటుక బట్టీ సమీపంలోని నీటి తొట్టి వద్ద స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ ఇలియాజ్‌ అహ్మద్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు