మధుర ఫలం.. సమస్యలతో సతమతం
మధుర ఫలమైన మామిడిని పండిస్తున్న రైతులకు చేదుఫలితాలే మిగులుతున్నాయి. మన మామిడికాయలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండున్నా ఏటికేడు పెరుగుతున్న చీడపీడలకు తోడుగా కాయల విక్రయంలోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనందున అసంపూర్తిగానే మామిడిసాగును కొనసాగిస్తున్నారు.
ధరాఘాతం, వేలం అమలుకాక అన్నదాతలకు ఆర్థిక నష్టం
జగిత్యాల చల్గల్ మండీలో కాయలు
న్యూస్టుడే, జగిత్యాల ధరూర్క్యాంపు: మధుర ఫలమైన మామిడిని పండిస్తున్న రైతులకు చేదుఫలితాలే మిగులుతున్నాయి. మన మామిడికాయలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండున్నా ఏటికేడు పెరుగుతున్న చీడపీడలకు తోడుగా కాయల విక్రయంలోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనందున అసంపూర్తిగానే మామిడిసాగును కొనసాగిస్తున్నారు. ఇటీవల కొందరు మామిడి చెట్లను నరికివేసి ఇతర పంటలకు మళ్లుతున్నారు.
పరిష్కరించాల్సిన సమస్యలు
- దిల్లీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల మామిడి కొనుగోలుదారులు జగిత్యాలకు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోకపోవటం. జగిత్యాల బ్రాండ్పేరిట ఎగుమతి చేస్తామని, ఉద్యానశాఖ, అపెడ, ఎఫ్పీవోలు, మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వహామీ అమలుగాకపోవటం. ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తుండగా వీటి అమలుపై దృష్టిసారించాలి.
- ఈ సంవత్సరం మామిడి పూత బాగావచ్చినా పూత, కాతను నిలుపుకునేలా రైతులకు అవగాహన కల్పించకపోవటం, చీడపీడలతో కాయలపై మంగు ఏర్పడకుండా శాస్త్రవేత్తలు, అధికారులు నివారణను తెలపకపోవటంతో తెంపిన కాయలకు ఆశించిన ధర రావటంలేదు. దీనికిగాను కనీసం వచ్చేసీజనుకైనా ముందస్తు చర్యలను రైతులకు తెలపాలి. స్థానికంగా ధరలు తగ్గినపుడు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనువుగా మామిడి కొనుగోలు కేంద్రాల్లో దేశవ్యాప్త మామిడి మార్కెట్ల ధరలను ప్రదర్శించాలి. కాయల గ్రేడింగ్, ప్యాకింగ్ తదుపరి కిసాన్ రైలు ద్వారా దిల్లీ కేంద్రంగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతిని పెంచటం ధరల్లో స్థిరత్వాన్ని తేనుంది.
- సాధారణంగా మే 20 వరకు కనీసం 40 వేల మెట్రిక్ టన్నుల కాయలు తరలాల్సి ఉండగా ఇప్పటివరకు జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, మేడిపల్లి, రాయికల్లలో కేవలం 18 వేల టన్నుల కాయలను మాత్రమే కొనుగోలు చేయటం కాపుతగ్గటాన్ని, ఇతర ప్రాంతాలకు కాయలు తరలటాన్ని ఉదహరిస్తోంది. పలువురు రైతులు స్థానికంగా ధరలు లభించక నాగ్పూర్, నిజామాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు కాయలను తీసుకెళ్లి విక్రయిస్తున్నారు.
- జగిత్యాల మామిడి మండీ పాతస్థలంలో 4 భారీషెడ్లుండగా వాలంతరి నుంచి అదనంగా తీసుకున్న 10 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. సదుపాయాలు ఏర్పడగా నిబంధనల మేరకు రైతుల నుంచి కొనుగోలు కమీషన్ తీసుకున్న వ్యాపారులు తప్పనిసరిగా వేలం పద్ధతినే కాయలను కొనాలి. వేలాన్ని అనుసరిస్తే ఎక్కువమంది వ్యాపారులు పోటీపడి ధరలు పెరుగుతాయి. కానీ ఈ సీజన్లో కొందరు వ్యాపారులు మాత్రమే వేలం ద్వారా కాయలను కొంటుండగా వ్యాపారులందరూ వేలం పద్ధతినే కాయలను కొనేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.
మాది జగిత్యాల మండలం చల్గల్. స్థానికంగా ధరలు తక్కువగా ఉండడంతో తోటలోని మామిడి కాయలను ఇతర రాష్ట్రాల వ్యాపారులకు నేరుగా విక్రయించా. జిల్లాకు చెందిన చాలా మంది రైతులు ఇతర ప్రాంతాల వ్యాపారులకు కాయలను నేరుగా విక్రయిస్తున్నారు.
మల్లయ్య, రైతు
నా తోటలోని మామిడి కాయలను విక్రయానికి తేగా కాయలు అతిపెద్దగా ఉన్నాయంటూ(ఓవర్సైజ్) ధరను భారీగా తగ్గించారు. తరుగు, చిన్నకాయలు, మంగు తదితరాల పేరిట కోతలు, ధరాఘాతంతో రైతులు, తోటల గుత్తేదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
రాంరెడ్డి, కొడిమ్యాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగుకు బాసట.. స్వావలంబన బాట
[ 26-07-2024]
సాగుకు ప్రాధాన్యం ఇస్తూ.. సంక్షేమంపై దృష్టి పెడుతూ సాగిన రాష్ట్ర పద్దులో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు ప్రత్యేక కేటాయింపులు మాత్రం లేవు.. -
పాఠశాలల్లో చరవాణుల వినియోగానికి తెరపడేనా..!
[ 26-07-2024]
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పనివేళల్లో చరవాణులు వాడుతూ బోధన చేయడం లేదని పలువురు జిల్లా ఉన్నతాధికారులు వారి సందర్శన సమయంలో గుర్తించారు. -
ఊతమిస్తే కదా.. పతకాల ఊసు
[ 26-07-2024]
రెండు వందలకుపైగా దేశాలు 11వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్న అతిపెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్ శుక్రవారం ప్రారంభం కాబోతోంది. ఇందులో మన దేశ క్రీడాకారులు ఎన్ని పతకాలు సాధిస్తారో త్వరలోనే తేలనుంది. -
వంతు వచ్చేవరకు..ఉగ్గబట్టుకోవాల్సిందే..!
[ 26-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు గత ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టగా ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతోంది. నిధుల కొరతతో చాలా పాఠశాలల్లో అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 26-07-2024]
చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
[ 26-07-2024]
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
ముసుగేసిన వ్యాపారాలు
[ 26-07-2024]
ఆషాఢానికి తోడు నాలుగు రోజులుగా పడుతున్న వర్షం కారణంగా ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడలోని చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. -
జనన ధ్రువపత్రాలకు అగచాట్లు
[ 26-07-2024]
పురపాలక కార్యాలయంలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ నెల రోజులుగా నిలిచిపోవడంతో దరఖాస్తులు పేరుకుపోయాయి. -
ఎంపిక సరే.. ప్రోత్సాహకమేదీ?
[ 26-07-2024]
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతోపాటు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్(ఎన్క్వాస్) ద్వారా ఎంపిక చేసిన ఆసుపత్రులకు కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!