వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. నీటి వనరుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి పంటల వివరాలు సేకరించారు. ఏ రకమైన పంటలు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారనే అంచనాతో జాబితా సిద్ధం చేశారు.
జిల్లాలో 2,77,723 ఎకరాల్లో పంటల అంచనా
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. నీటి వనరుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి పంటల వివరాలు సేకరించారు. ఏ రకమైన పంటలు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారనే అంచనాతో జాబితా సిద్ధం చేశారు. జిల్లాలో నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో ఎప్పటిమాదిరిగానే ఈసారి కూడా వరి పంటకు పెద్దపీట వేశారు. గతేడాది కంటే సాగు విస్తీర్ణం స్వల్పంగా పెంచుతూ ప్రతిపాదించారు. రైతులకు అవసరమైన విత్తనాలు సమకూరుస్తూనే ఉద్యాన పంటలైన ఆయిల్పామ్, మామిడి, కూరగాయల సాగును అధికారులు ప్రోత్సహిస్తున్నారు. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా పర్యవేక్షిస్తున్నారు.
ఇసుక మేటలతో తగ్గనున్న విస్తీర్ణం
గోదావరి, మానేరు, హుస్సేన్మియా, మానేరు పరీవాహక ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో వరి సాగవుతోంది. గడిచిన మూడేళ్ల సాగు గణాంకాలు పరిశీలిస్తే విస్తీర్ణం స్వల్పంగా పెరుగుతోంది. 2022-23లో 1,93,200 ఎకరాలు, 2023-24లో 2,77,003 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 2,77,723 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. ఆయకట్టు ప్రాంతం కావడంతో పప్పుదినుసుల సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవలి కాలంలో కొందరు ఆయిల్సామ్ సాగుకు ముందుకొస్తున్నారు. జిల్లాలో 2,500 ఎకరాల్లో మొక్కలు నాటుతారని అంచనా వేశారు. గతేడాది భారీ వర్షాలకు గోదావరి, మానేరు పరీవాహక ప్రాంతంలోని పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో ఈసారి సాగు విస్తీర్ణం కొద్దిగా తగ్గనుందని భావిస్తున్నారు.
కృత్రిమ కొరత లేకుండా..
జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరి, పత్తి, ఇతర పంటల విత్తనాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. రాయితీ విత్తనాలను కూడా సమకూరుస్తున్నారు. ఇప్పటికే 24,384 మెట్రిక్ టన్నుల డీఏపీ, యూరియా, కాంప్లెక్స్ పొటాష్, ఇతర ఎరువులు నిల్వ ఉన్నాయి. వీటితో పాటు 32,082 మెట్రిక్ టన్నుల యూరియా, 8,280 మెట్రిక్ టన్నుల డీఏపీ, 24,579 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 6,889 మెట్రిక్ టన్నుల పొటాష్ అవసరమవుతాయి. సీజన్లో కీలక సమయంలో కొందరు డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుండటంతో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నకిలీ ఉత్పాదకాలపై నిఘా
జిల్లాలో వాతావరణ పరిస్థితులకనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించాం. చీడపీడలు, తెగుళ్లు నివారణకు రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. నకిలీ ఎరువులు, విత్తనాల విక్రయంపై నిఘా పెంచి టాస్క్ఫోర్స్ కమిటీలతో తనిఖీ చేయనున్నాం. నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు.
-ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి