Metro Rail: పైలెట్ లేకున్నా.. పట్టాలపై పరుగులు
డ్రైవర్ రహిత మెట్రో రైలు సంచారం ఏడాది లోగా ప్రారంభించనున్నారు. అందుకు తగ్గిన ఏర్పాట్లలో బీఎంఆర్సీఎల్ అధికారులు నిమగ్నమయ్యారు.
పైలెట్ రహిత మెట్రో రైలు సిద్ధం
బెంగళూరు (యశ్వంతపుర): డ్రైవర్ రహిత మెట్రో రైలు సంచారం ఏడాది లోగా ప్రారంభించనున్నారు. అందుకు తగ్గిన ఏర్పాట్లలో బీఎంఆర్సీఎల్ అధికారులు నిమగ్నమయ్యారు. అలాంటి రైళ్లు దిల్లీ, ముంబయిలో సంచరిస్తున్నాయి. డ్రైవర్ రహిత రైళ్లను బీఈఎంఎల్ సిద్ధం చేసి అందించింది. నగరంలో అలాంటి రైళ్ల సంచారానికి ఆరుబోగీలతో కూడిన మెట్రో రైలును సిద్ధం చేయాలని బీఎంఆర్సీఎల్, బెమల్కు సూచించడంతో పాటు ఒప్పందం చేసుకున్నారు. మెట్రో రెండో విడత కారిడార్ ఆర్వీ రోడ్డు- బొమ్మనహళ్లి మధ్య 18 కిలోమీటర్ల మార్గంలో డ్రైవర్ రహిత మెట్రో రైలు సంచారాన్ని ప్రవేశపెట్టాలని తీర్మానించారు. ఆ మార్గంలో 99 శాతం నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఏడాది ఆఖరి కల్లా ఆ మార్గంలో డ్రైవర్ రహిత మెట్రో రైలు సంచరించే విధంగా పథకాలను సిద్ధం చేశారు. డ్రైవర్ రహిత మెట్రో రైలు సంచారం ప్రతిపాదనలో ఉందని, అందుకు సంబంధించిన రైలు బోగీలను కూడా కొనుగోలు చేస్తున్నామని, కొంత సమయం పడుతుందని బీఎంఆర్సీఎల్ అధికార ప్రతినిధి యశ్వంత్ చౌహన్ తెలిపారు. ఆ రైలు సంచారం ప్రారంభమైతే కొద్ది రోజులు అటెండర్ ఉంటారని, అనంతరం అటెండర్ ఉండబోరన్నారు. ఆ మార్గంలో విజయవంతమైతే గులాబీ, ఆకుపచ్చ మార్గాల్లో డ్రైవర్ రహిత మెట్రో సంచారాన్ని ప్రారంభించే ఆలోచన ఉందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సభాపర్వం.. ఇంతటితో సమాప్తం
[ 26-07-2024]
ఓ వైపు భారీ వర్షాలతో రాష్ట్రం తల్లడిల్లుతోంది. పంట నష్టం ఎంతో ఇంకా లెక్కతేలలేదు. మరో వైపు డెంగీ, నిఫా వైరస్ అలజడి సృష్టిస్తోంది -
చుట్టుముట్టిన అతివృష్టి
[ 26-07-2024]
తీరప్రాంత జిల్లాలు, మల్నాడు విభాగంలో అతివృష్టి ప్రజలను వణికిస్తోంది. ఈ ప్రాంతాల్లో అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. -
పసిపాపనూ చిదిమేశారు
[ 26-07-2024]
సభ్య సమాజం తలదించుకునేలా ఏడాదిన్నర ఆడబిడ్డపై లైంగిక దౌర్జన్యం దిగ్భ్రాంతి కలిగించింది. కర్ణాటకలోని కలబురగి జిల్లా ఆళంద తాలూకాలోని ఒక గ్రామంలో బుధవారం రాత్రి తల్లి పక్కన పడుకున్న బిడ్డను తీసుకువెళ్లిన నిందితుడు లైంగిక దౌర్జన్యానికి గాయపడ్డాడు. -
అన్నదాతల ఆత్మహత్యల మాటేంటి?
[ 26-07-2024]
ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు పరిహారం, కరవు, వరద సాయం, సకాలంలో విత్తనాలు, ఎరువుల వితరణ, అన్నదాతలు వ్యతిరేకిస్తున్న చట్టాలను రద్దు చేయాలని కోరుతూ బెంగళూరు ఫ్రీడంపార్కులో రైతులు గురువారం ధర్నాకు దిగారు. -
దర్శన్కు జైలు భోజనమే
[ 26-07-2024]
ఇంటి నుంచి భోజనం, పరుపు, పుస్తకాలు తెప్పించుకునేందుకు అనుమతించాలని కోరుతూ నటుడు దర్శన్ వేసుకున్న అర్జీని 24వ ఏసీఎంఎం న్యాయస్థానం తోసిపుచ్చింది. -
శిరూరును ఎంతకీ వీడని విషాదం
[ 26-07-2024]
అంకోలా తాలూకా శిరూరు వద్ద జాతీయ రహదారిపై గుట్ట కూలిన ఘటనలో కనిపించకుండా పోయిన కేరళకు చెందిన లారీ డ్రైవరు అర్జున్, మరో ఇద్దరు స్థానికుల కోసం గాలింపు ప్రక్రియ గురువారం కొనసాగింది
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి