రూ. 9 కోట్లు వాగులో పోశారు..!
అధికారుల్లో చిత్తశుద్ధి, ముందుచూపు కొరవడటంతో తొమ్మిది కోట్ల రూపాయలు నిరుపయోగంగా మారాయి. వందలాది ఎకరాల బీడు భూములు పచ్చని పంటలతో కళకళలాడుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది.
పూడికతో నిండిన ఎత్తిపోతల పథకం బావి
అశ్వారావుపేట, ములకలపల్లి, న్యూస్టుడే: అధికారుల్లో చిత్తశుద్ధి, ముందుచూపు కొరవడటంతో తొమ్మిది కోట్ల రూపాయలు నిరుపయోగంగా మారాయి. వందలాది ఎకరాల బీడు భూములు పచ్చని పంటలతో కళకళలాడుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ములకలపల్లి మండలంలో పాములేరు వాగుపై తిమ్మంపేట వద్ద ఎత్తిపోతల పథకాన్ని రూ.9కోట్లుతో నిర్మించారు. ఈ పథకానికి కోట్లు ఖర్చయినా రైతుల భూములకు సాగునీరందించలేక ఎందుకూ కొరగాకుండా పోయినట్లైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా నీటిపారుదల శాఖాధికారులు ఇప్పుడు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసిన ప్రదేశం ఆకృతి(డిజైన్) సక్రమంగా లేదంటూ సెలవిస్తున్నారు. ఎత్తిపోతల ఏర్పాటు చేసిన ప్రదేశం వాగునుంచి నీరు తోడేందుకు అనువుగా లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
- ములకలపల్లి మండలంలోని తిమ్మంపేట, రాజీవ్నగర్, పుట్టతోగు గ్రామాల్లో సుమారు 900 ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు పాములేరు వాగుపై ఎత్తిపోతల నిర్మాణానికి ప్రభుత్వం 2016లో రూ.9కోట్లు మంజూరు చేయగా 2019లో పనులు పూర్తిచేశారు. నాటి నుంచి ట్రయల్ రన్లోనూ తీవ్ర జాప్యం చేశారు. ఎట్టకేలకు గతేడాది జులైలో ట్రైల్రన్ వేశారు. వర్షాకాలం వరదలొస్తే మినహా మిగిలిన రోజుల్లో ఈ పథకానికి నీరందే పరిస్థితిలేదని నీటిపారుదల అధికారులే తేల్చేశారు. ఆనాడు ఈ పథకాన్ని మంజూరు చేసింది, డిజైన్ చేసిందీ నీటిపారుదల శాఖాధికారులే. నేడు డిజైన్ సక్రమంగా లేదంటూ సెలవిస్తోందీ ఆ అధికారులే. ఇదీ అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. వాగుపై చెక్డ్యాం(అడ్డంగా కట్ట) కట్టాలన్నా భారీ ఖర్చు, పైగా అనువుగా లేని ప్రాంతం కావడంతో తిమ్మంపేట ఎత్తిపోతల నుంచి నీళ్లు ఎత్తిపోయలేని దుస్థితి నెలకొంది. అనువుకాని ప్రాంతంలో రూ.9కోట్లు ఖర్చుచేసి నిర్మించిన ఎత్తిపోతల ఎవరిని ఉద్ధరించేందుకో అధికారులే సెలవియ్యాలి.
గుత్తేదారుకు సొమ్ములు.. రైతులకు ఎదురుచూపులు..
పాములేరు ఎత్తిపోతల నిర్మాణంతో గుత్తేదారు జేబుల్లోకి బిల్లులు వచ్చాయి. రైతుల పొలాల్లోకి మాత్రం నీళ్లు రాలేదు. ఆరేళ్లుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్నా రైతులకు నిరాశ, నిస్పృహలే మిగిలాయి. వాగు మధ్యలో నీటి ప్రవాహం కంటే ఎక్కువ ఎత్తుఉండే విధంగా బావి నిర్మిస్తే అందులోకి వచ్చే నీటిని మోటార్లు ద్వారా తోడొచ్చు అని తన పేరు బయటపెట్టేందుకు ఇష్టపడని ఓ ఇంజినీరింగ్ అధికారి పేర్కొన్నారు.
ఎత్తిపోతల డిజైన్ సక్రమంగా లేదు:
సురేష్, ఐబీ ఈఈ
పాములేరుపై ఎత్తిపోతల పథకం డిజైన్ సక్రమంగా లేదు. వర్షాకాలం మినహా మిగిలిన రోజుల్లో నీటి సేకరణ చేయలేని పరిస్థితి. ఎత్తిపోతల ఏర్పాటు చేసిన ప్రాంతం చెక్డ్యాం కట్టేందుకు అనువుగా లేదు. వరదలు వచ్చినప్పుడే చెరువులను నింపేలా డిజైన్చేశారు. పనులన్నీ పూర్తయ్యాయి. వచ్చే వర్షాకాలం పూర్తిస్థాయిలో మోటార్లు ఆన్చేసి చెరువులకు, వ్యవసాయ క్షేత్రాలకు సాగునీరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసులకు సత్వర పరిష్కారం చూపాలి
[ 26-07-2024]
పోలీసు ఠాణాకు వచ్చిన కేసులకు సత్వర పరిష్కారం కోసం వెంటనే స్పందించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. -
పెద్దవాగు మరమ్మతు పనులు ప్రారంభం
[ 26-07-2024]
మండలంలో పెద్దవాగు ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు నష్ట పోకుండా రూ.3.5 కోట్లతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శుక్రవారం మరమ్మతు పనులను ప్రారంభించారు. -
సీతారామ ప్రాజెక్టు సత్వరమే పూర్తిచేయాలి
[ 26-07-2024]
సీతారామ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతునేని సుదర్శనం అన్నారు. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
[ 26-07-2024]
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాల మేరకు సీసీ, డ్రైనేజ్ నిర్మాణ పనులకు మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ శంకుస్థాపన చేశారు. -
జిల్లాలో పలువురు తహసీల్దార్లు బదిలీ
[ 26-07-2024]
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. -
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
[ 26-07-2024]
చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన కటికల అంజలి (8) అనే చిన్నారి విద్యుదాఘాతంతో మృతి చెందింది. -
అభివృద్ధి మంత్రం.. సంక్షేమ రథం
[ 26-07-2024]
ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క గురువారం ప్రవేశపెట్టిన 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది. -
సామర్థ్యాలకు అనుగుణంగా.. బోధన సాగేలా!
[ 26-07-2024]
విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు దేశంలోనే అతిపెద్ద సర్వే నవంబరు నుంచి నిర్వహించనున్నారు. -
బ్రిగేడియర్ జనరల్గా ఏలూరి శ్రీనివాసరావు
[ 26-07-2024]
ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ దౌత్యవేత్త ఏలూరి శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం లభించింది. -
మెరుపు వేగం.. పతకాలు కైవసం
[ 26-07-2024]
మధ్య తరగతి కుటుంబంలో జన్మించి ఆటే ప్రాణంగా సాధన చేసింది. ఐస్ స్కేటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళుతోంది. -
72 ఏళ్ల యువకుడు..!
[ 26-07-2024]
‘వయసు ఒక నంబరు మాత్రమే’ అని నిరూపిస్తున్నారు భద్రాచలం ఐటీడీఏ ప్రాంతానికి చెందిన గాలి రాంమోహన్రావు ఐటీసీ విశ్రాంత ఉద్యోగి అయిన ఆయన నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని నాలుగు బంగారు పతకాలు సాధించిన శభాష్ అనిపించుకుంటున్నారు. -
రాకాసి గూళ్లు.. చరిత్రకు ఆనవాళ్లు
[ 26-07-2024]
మూడు వేల ఏళ్లనాటి చరిత్రకు ఆనవాళ్లు రాకాసి గూళ్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం నుంచి వేములూరు మార్గంలోని అడవిలో ఇవి సాక్షాత్కరిస్తాయి. -
యువ రైతు ఆత్మహత్య
[ 26-07-2024]
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నపురెడ్డిపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. -
ఈ సీజన్లోనే పెద్దవాగు నుంచి పంటలకు సాగు నీరు
[ 26-07-2024]
పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో రైతులు పండిస్తున్న పంటలకు ఈ సీజన్లోనే సాగునీరు అందించేలా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. -
మునిగిన దుమ్ముగూడెం ఆనకట్ట
[ 26-07-2024]
కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట గోదావరి వరద నీట మునిగింది. ఆనకట్ట పైనుంచి సుమారు రెండు, మూడడుగుల ఎత్తుతో వరద నీరు ప్రవహిస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!