logo

త్వరలో వైకాపా ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డుకట్ట

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెదేపాదే అధికారమని, మంత్రాలయం నియోజకవర్గానికి తిక్కారెడ్డే కాబోయే రథసారథి అని, వైకాపా ఎమ్మెల్యే ఆగడాలకు త్వరలో అడ్డుకట్ట పడుతుందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ అన్నారు.

Published : 04 Dec 2023 03:57 IST

తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌

మాట్లాడుతున్న తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌, పక్కన తిక్కారెడ్డి

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెదేపాదే అధికారమని, మంత్రాలయం నియోజకవర్గానికి తిక్కారెడ్డే కాబోయే రథసారథి అని, వైకాపా ఎమ్మెల్యే ఆగడాలకు త్వరలో అడ్డుకట్ట పడుతుందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ఓ హోటల్‌లో మంత్రాలయం తెదేపా బాధ్యుడు తిక్కారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పన్నాగ వెంకటేశప్ప స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య నాయకులు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు.  మంత్రాలయం ఎమ్మెల్యే ఎంత రౌడీయిజం చేసినా అతని ఆటలు ఇక సాగవన్నారు.   వైకాపా ప్రభుత్వం ఇసుక, మద్యం, భూకబ్జాలు తదితర వాటి ద్వారా రూ.లక్షల కోట్లు దండుకుంటున్నారన్నారు. మూడు నెలల్లో పసుపు సునామీ రాబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దకడబూరు బసలదొడ్డి ఈరన్న, కోసిగి జ్ఞానేష్‌, అడివప్పగౌడు, వెంకటపతిరాజు, భరద్వాజశెట్టి మాధవరం కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని