కుళాయివాటా.. జగన్ టాటా
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 1,000 గ్రామాల్లో బిందెడు నీళ్లు దొరకడం లేదు. ఏ పల్లెకు వెళ్లినా బిందెలు పట్టుకొని చకోర పక్షిలా జనం జలం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆగిపోయిన జల్జీవన్
పల్లెల్లో ప్ర‘జల’ కష్టాలు
పత్తికొండ, న్యూస్టుడే
ఇంటింటికి కుళాయి ద్వారా నీటిని ఇవ్వాలన్న ఉద్దేశంతో జల్జీవన్ మిషన్ (జేజేఎం) పథకాన్ని తీసుకొచ్చాం.. 2021-22 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక్క పైసా వినియోగించుకోలేకపోయింది.
- రాజ్యసభలో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పిన మాట ఇది.
స్వచ్ఛమైన జలాలు సరఫరా చేసి ప్రజల దాహార్తి తీర్చడంలో జగన్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.!!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 1,000 గ్రామాల్లో బిందెడు నీళ్లు దొరకడం లేదు. ఏ పల్లెకు వెళ్లినా బిందెలు పట్టుకొని చకోర పక్షిలా జనం జలం కోసం ఎదురుచూస్తున్నారు. కోడుమూరులో నీటి కోసం రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందారు.. ఆస్పరి మండలంలో ఎద్దులబండ్లు కట్టుకొని నీటి కోసం వెళ్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన ఇలాకాలోనూ ‘పానీ’పట్టు యుద్ధాలు జరుగుతున్నాయి. గ్రామీణుల అవస్థలు మనసున్న ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నా... సీఎం జగన్ను కదిలించలేకపోతున్నాయి. ప్ర‘జల’ కష్టాలు తీర్చేందుకు ఉద్దేశించిన జేజేఎం పథకాన్ని వినియోగించుకోలేని అసమర్థత కారణంగా ప్రజలు బలైపోవాల్సిన దుస్థితికి కారకులెవరు? ఉన్న నిధులనూ ఎందుకు వినియోగించుకోలేకపోయారు? అనవసర విషయాల్లో గొంతెత్తి గోల చేసే జిల్లా ఎమ్మెల్యేలు.. అవసరమైన అంశాల్లో ఎందుకు నోరు మెదపలేకపోతున్నారని జనం ప్రశ్నిస్తోంది.
మద్దికెరలోని సాయినగర్ కాలనీలో జల్జీవన్ మిషన్ కింద ఏర్పాటు చేసిన పైపులైన్ ఇది. బురుజుల, మద్దికెర, కొత్తపల్లి తదితర గ్రామాల్లో చేపట్టిన పనులు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయి. స్థానికులకు చుక్క నీరందలేదు. మద్దికెరలో ఇంటింటికీ కుళాయి పేరుతో ఒక్కో దానికి రూ.వెయ్యి వసూలు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.
ప్రజల పథకం
ప్రతి ఇంటికీ నిత్యం 55 లీటర్ల రక్షిత తాగునీటిని అందించాలన్న సంకల్పంతో కేంద్రం 2019లో జల్జీవన్ మిషన్ (జేజేఎం) పథకానికి శ్రీకారం చుట్టింది.
నిధులు దండి
కర్నూలు జిల్లాలో 1,026, నంద్యాలలో 1,124 పనులు చేయాలని ప్రణాళిక రూపొందించారు. మొదటి విడత కర్నూలులో 526 పనులకు రూ.116.69 కోట్లు, నంద్యాలలో 554 పనులకు రూ.177.47 కోట్లు కేటాయించారు.
జగన్ గండి
2024 చివరి నాటికి వంద శాతం పనులు పూర్తి చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా నిధులు వెచ్చించాలి. కేంద్రం తన వాటాను ఎప్పటికప్పుడు కేటాయిస్తున్నా పనులు పూర్తి చేయడంలో జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. పనుల తీరు చూస్తుంటే జగన్ ఏలుబడిలో పదేళ్లయినా పథకం పూర్తయ్యేలా లేదు.
1,080 పనులు.. రూ.294.16 కోట్లు
గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణంతోపాటు పైపులైన్లు, ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయాలన్నది జల్జీవన్ పథకం ఉద్దేశం. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 24, నంద్యాలలో 29 మండలాల్లోని 672 గ్రామాల్లో 4.75 లక్షల మందికి సగటున రోజుకు 50 లీటర్ల నీటిని ఈ పథకం ద్వారా అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,080 పనులు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.294.16 కోట్లు కేటాయించారు. రూ.5 లక్షల్లోపు పనులు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. ఆపై విలువైన పనులను ఆన్లైన్లో టెండరు పిలిచి గుత్తేదారులకు అప్పగించారు.
గుత్తేదారుల వెనుకడుగు
రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నాలుగుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు. నంద్యాల జిల్లాలో రూ.58 కోట్ల విలువైన పనులు జరగ్గా కనీసం 20 శాతం మేర బిల్లులు చెల్లించలేదు. కర్నూలులో రూ.30 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఆర్థిక మంత్రి నియోజకవర్గమైన డోన్లో 173 పనులకు మూడేళ్లలో 11 మాత్రమే చేశారు. 160 పనులు వివిధ దశల్లో ఆగుతూ సాగుతున్నాయి. రెండో విడతలో ఉమ్మడి జిల్లాలో రూ.575.58 కోట్ల పనులు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందో లేదోనన్న సందేహంతో గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు.
తేలిపోయిన నాణ్యత
కర్నూలు జిల్లాలో 203 పనులు పూర్తి చేసినట్లు 197 పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నంద్యాల జిల్లాలో 425 పనులు ప్రారంభించగా.. అందులో 207 వరకు పూర్తయ్యాయి. 137 పనులు పురోగతిలో ఉండగా 15 పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. మిగిలినవి మధ్యలో ఆగిపోయాయి. ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చేందుకు వీలుగా రోడ్లు తవ్వి, పైపులు ఏర్పాటు చేసి కుళాయిలు బిగించే పనులను స్థానిక జల సంఘాలను బినామీలుగా ముందుంచి స్థానిక నాయకులే పనులు చేసి మమ అన్పిస్తున్నారు. వాటిలో నాణ్యత తేటతెల్లమవుతోంది. గుత్తేదారుల ముసుగులో అధికార పార్టీ నాయకులే ఈ పనులను చేసి దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పత్తికొండ, ఆదోని, డోన్, నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో వేసిన పైపులైన్లు ఇప్పటికే దెబ్బతిన్నాయి. కొన్ని గృహాలకు ఏర్పాటు చేసిన కుళాయిలు విరిగిపోయాయి. జల్జీవన్ మిషన్ పథకం పేరుతో రోడ్లను తవ్వేసి వదిలేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
డబ్బా నీళ్లే గతి
‘‘ సురక్షిత నీరు అందక జిల్లాలో 3 లక్షల కుటుంబాలు నిత్యం కొనుగోలు చేస్తున్నాయి. ఒక్కో కుటుంబం రోజూ రూ.20 నుంచి రూ.30 వరకు వెచ్చిస్తోంది. వీరంతా నీటి కోసమే నెలకు రూ.60 లక్షల నుంచి రూ.90 లక్షల మేర ఖర్చు చేస్తున్నారు. ఏడాదికి రూ.10 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. ’’’
బురుజులలో జల్జీవన్ మిషన్ పనులను రెండేళ్ల కింద ప్రారంభించారు. ఇక్కడ ఒక్క ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వలేదు.. గ్రామంలో 600 కుటుంబాలున్నాయి. పత్తికొండ, హోసూరు నుంచి శుద్ధజలం తెప్పించుకుంటున్నారు. ఇందుకు నిత్యం రూ.20 నుంచి రూ.30 వరకు వెచ్చిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు