అందని పుస్తకం.. దక్కని ఫలితం
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కేవలం 183 మంది రెగ్యులర్ అధ్యాపకులే బోధిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రిన్సిపల్ పోస్టులే లేవు.
ఇంటర్ విద్య అంతా మిథ్య
కర్నూలు విద్య, న్యూస్టుడే
అతిథి అధ్యాపకులే దిక్కు
- ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కేవలం 183 మంది రెగ్యులర్ అధ్యాపకులే బోధిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రిన్సిపల్ పోస్టులే లేవు. సీనియర్ అధ్యాపకులే ఆ బాధ్యతలు చూస్తున్నారు. వీరి ఆధ్వర్యంలోనే ఒప్పంద అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నారు.
- పోస్టులు మంజూరు కాని చోట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఉండదనే భావనతో ఒప్పంద అధ్యాపకులు పని చేసేందుకు ఇష్టపడటం లేదు. రెండు జిల్లాల్లో 223 మంది ఒప్పంద అధ్యాపకులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. వీరికి వేతనాలు సరిగ్గా అందడం లేదు.
- చాలాచోట్ల అతిథి అధ్యాపకులే బోధిస్తున్నారు. వీరికి గంటకు రూ.150 చొప్పున నెలకు రూ.10 వేలకు మించకుండా వేతనాలు చెల్లించాలనే నిబంధన ఉంది. వీరు జూన్ నుంచి పాఠాలు చెబుతున్నా వేతనాలు మాత్రం సరిగ్గా అందడం లేదు.
17 కళాశాలల్లో 20 శాతం లోపే ఉత్తీర్ణత
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు వెనుకబడ్డాయి. పాఠ్య పుస్తకాలు, అధ్యాపకుల కొరత, కళాశాలల్లో మౌలిక వసతుల లేమి బోధనంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. 17 కాలేజీల్లో 20 శాతం లోపే ఉత్తీర్ణత సాధించారు. కౌతాళంలో 73 మందికి 24, నాగులదిన్నెలో 70 మందికి 9, డోన్లో 58 మందికి 18 మంది, ఆలూరులో 82 మందికి 36 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆయా కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం ఇలానే ఉంది.
ఇక్కడా అంతంతే
ఒకేషనల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి ఏడాది .. కర్నూలు జిల్లాలో 718 మందికిగాను 414, నంద్యాలలో 394 మందికి 229 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో ఏడాది.. కర్నూలు జిల్లాలో 594 మందికి 388 మంది, నంద్యాల జిల్లాలో 314 మందికిగాను 208 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆదర్శ పాఠశాలల్లో.. మంత్రాలయంలో 68 మందికి 17 మంది, మద్దికెరలో 60 మంది ఆరుగురే పాసయ్యారు.
ఆశయం: ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను ఒడిసి పట్టుకోలేకపోతే పాశ్చాత్య దేశాల పిల్లల మాదిరిగా మన పిల్లలు సమాధానాలు చెప్పగలిగే స్థితిలో ఉండరు. పిల్లలను ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. ఐటీ నిపుణులు, కంపెనీ ప్రతినిధులుగా నిలబెట్టాలన్నది మా ఆశయం.
- జులై 20న సీఎం జగన్ ప్రకటన.
ఫలితం: సంజామల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ముగ్గురు విద్యార్థులు ఉండగా ఇద్దరు పరీక్షలకు హాజరయ్యారు.. వారిద్దరూ ఫెయిలయ్యారు. 17 మంది ప్రథమ సంవత్సరం చదువుతుండగా 10 మంది పరీక్షలు రాశారు. ఇద్దరు ఉత్తీర్ణులయ్యారు. చిప్పగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 67 మంది విద్యార్థులకు ఒక్కరు, ద్వితీయ సంవత్సరంలో 54 మందికి నలుగురే ఉత్తీర్ణత సాధించారు.
లక్ష్యం దాటని కేజీబీవీలు
- ఉమ్మడి జిల్లాలో 55 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు ఉన్నాయి. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభించారు. ఆయా కళాశాలల్లో పూర్తిగా అతిథి అధ్యాపకులతోనే బోధిస్తున్నారు. వీరికి వేతనాలు సరిగ్గా రాకపోవడంతో బోధనపై ప్రభావం చూపింది. గతేడాది చిప్పగిరి, కౌతాళం, హాలహర్వి కేజీబీవీల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. ఈసారీ ఫలితాలు మెరుగుపడలేదు.
- ద్వితీయ సంవత్సరం ఫలితాలను పరిశీలిస్తే గోనెగండ్లలో నలుగురికి ముగ్గురు, కౌతాళంలో 9 మందికి నలుగురు, వెల్దుర్తిలో 19 మందికి ఏడుగురు, ఎమ్మిగనూరులో 16 మందికి నలుగురు, ఓర్వకల్లులో 11 మందికి ఇద్దరు, హాలహర్విలో ఏడుగురికి ఒకరు, పెద్దకడబూరులోని ఏడుగురికి ఒకరు పాసయ్యారు.
భోజనం పెట్టని జగన్
తెదేపా ప్రభుత్వ హయాంలో జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారు. ఇది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. వైకాపా ప్రభుత్వం రాగానే దీన్ని రద్దు చేసింది. ఉమ్మడి జిల్లాలో రూ.70 లక్షలు ఖర్చయ్యే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీని సైతం నిలిపివేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులపై ఆర్థిక భారం మోపింది. ఈ రెండు అంశాలు పేద విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో రెండేళ్లుగా ఇంటర్ ఫలితాలు పడిపోయాయి. మరోవైపు ఉమ్మడి జిల్లాలో మూడు ప్రాంతాల్లో హైస్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టింది. పదో తరగతి పూర్తయిన వారు ఇక్కడే కొనసాగుతుండటంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గాయి.
- ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ప్రిన్సిపల్స్ లేని కళాశాలలు : 12
- జూనియర్ కళాశాలలు : 43
- కేజీబీవీలు : 55
- రెగ్యులర్ అధ్యాపకులు : 183
- ఒప్పంద అధ్యాపకులు : 223
- అతిథి అధ్యాపకులు : 70
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు