నెలాఖరులోగా మనబడి పనులు పూర్తి చేయాలి
మన ఊరు - మన బడి పనులు ఈ నెలాఖరులోగా పూర్తిచేసి ఎఫ్టీవోలు అప్లోడ్ చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. గురువారం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, డీపీవో సిబ్బందితో మన బడి పనులపై సమీక్షించారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీహర్ష, చిత్రంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్
నారాయణపేట, న్యూస్టుడే : మన ఊరు - మన బడి పనులు ఈ నెలాఖరులోగా పూర్తిచేసి ఎఫ్టీవోలు అప్లోడ్ చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. గురువారం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, డీపీవో సిబ్బందితో మన బడి పనులపై సమీక్షించారు. ఆయుష్మాన్ భారత్కు జిల్లా నుంచి 59 ఆరోగ్య ఉపకేంద్రాలు గుర్తించారని, వాటిలో కేంద్ర పభుత్వం సూచించిన నిబంధనల మేరకు పెయింటింగ్, బొమ్మలు, ఎథనిక్ డిజైన్ లోగో వేసి అందుకు సంబంధించిన ఫొటోలు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే నిధులు విడుదల అవుతాయన్నారు. వాటిని రేపు సాయంత్రంలోగా యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. జిల్లాలో మెటీరియల్ కాంపోనెంట్ కింద మంజూరైన సీసీ రోడ్లను మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలన్నారు. పంచాయతీరాజ్ రోడ్లపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, డీపీవో మురళి, పీఆర్ ఈఈ నరేందర్, డీఈఈ మంగులాల్, ఏఈలు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు అయ్యేలా చూడాలి..
నారాయణపేట : గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు అయ్యేలా చూడాలని కలెక్టర్ శ్రీహర్ష ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మక్తల్, కృష్ణా, మాగనూరు మండలాల్లోని గర్భిణులు రాయచూరు, నారాయణపేట, మహబూబ్నగర్కు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని నివారించడానికి ఏప్రిల్ 1 నుంచి మక్తల్ మండల కేంద్రంలోనే కమ్యూనిటీ హెల్త్సెంటర్లో ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సాధారణ ప్రసవాలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో సిజేరియన్ చేయడానికి సుశిక్షితులైన వైద్యులు, స్టాఫ్నర్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బు వృథా, ఆరోగ్యం పాడు చేసుకోవద్దన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్