అమ్మో పిడుగు..!
ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
న్యూస్టుడే-మక్తల్ టౌన్, నారాయణపేట(పాతబస్టాండ్) : ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పొలాలకు వెళ్లే రైతులు, పశువులు పిడుగుల బారినపడి చనిపోతున్నాయి. కొన్నేళ్ల క్రితం ఊట్కూరు మండలం అవుసలోనిపల్లి పిడుగుపాటుకు గురై ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెంది, ఏడుగురు గాయాలపాలైన ఘటన గుర్తుండే ఉంటుంది. ఈనెలలో కూడా ఉమ్మడి జిల్లా పరిధిలో మనుషులు, పశువులు ప్రాణాలు వదిలిన ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో పిడుగుపాటుపై అవగాహన పెంచుకోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ఎలా సంభవిస్తుంది?
మేఘాల నుంచి భూ ఉపరితలాన్ని తాకే శక్తిమంతమైన ప్రవాహం పిడుగు. వాతావరణం చల్లబడినప్పుడు మేఘాలలో ద్రవ, ఘన పదార్థాలు ఉత్పన్నమవుతాయి. వీటికి బలమైన గాలి తోడైనప్పుడు నీరు, మంచు బిందువులు మధ్య రాపిడి ఏర్పడుతుంది. ఫలితంగా మేఘాలలో కొన్ని వేల కోట్ల పాజిటివ్, నెగటివ్ ఛార్జిలు ఏర్పడతాయి. ఇవి ఒకదానికొకటి ఆకర్షించుకున్నప్పుడు అమితమైన విద్యుచ్ఛక్తి, వేడి పుడుతుంది. ఒక పిడుగు సుమారు 30 కోట్ల వోల్టుల విద్యుత్తు శక్తిని కలిగి ఉంటుంది. పిడుగులు చుట్టూ ఉన్న గాలిని రెప్పపాటులో వేడెక్కించి భయంకరమైన శబ్దాన్ని సృష్టిస్తాయి. వర్షం కురిసే సమయంలో కేవలం మేఘాలలోనే కాదు నేలపై ఉండే ఎతైన ప్రదేశాలు, చెట్లు, లోహాలవంటి వాటిపై కూడా పిడుగులు పడుతుంటాయి. ఎతైన చెట్లు, అపార్టుమెంట్లు, విశాల మైదానాలు, భవనాలు, డాబాలు, కరెంటు స్తంభాలు వంటి లోహాలు పిడుగులను ఆకర్షిస్తుంటాయి. పిడుగుపాటుకు గురై గాయపడిన వాళ్లు తర్వాత జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, పక్షవాతం వంటి శారీరక సమస్యలకు గురవుతున్నారు.
ముందే తెలుస్తుంది
ఇప్పుడున్న అధునాతన పరిజ్ఞానం ద్వారా 30 నుంచి 40నిమిషాల ముందే పిడుగు పడే ప్రదేశాన్ని గుర్తించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిది.
పరిహారం
2015లో విడుదల చేసిన జీవో నంబరు 2 ప్రకారం పిడుగుపాటుకు గురై మనిషి మృతి చెందితే రూ.6లక్షలు, పశువులు మృతి చెందితే రూ.30వేలు ఎక్స్గ్రేషియా(పరిహారం) ఇవ్వాలి.
ఇంటికి ఎర్తింగ్ తప్పనిసరి
పిడుగుపడే వాతావరణం ఉందన్నప్పుడు ఇంట్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయాలి. ఆ సమయంలో ఓల్టేజీ వచ్చి విద్యుత్తు ఉపకరణాలు దెబ్బతింటాయి. నివారణకు తప్పనిసరి ప్రతి ఇంటికీ ఎర్తింగ్ చేయించాలి. ప్యూజులకు సరైన రేటింగ్ కలిగిన తీగను ఉపయోగించాలి. విద్యుత్తు బోర్డు నుంచి ప్లగ్ను తొలగిస్తే పూర్తి రక్షణగా ఉంటుంది.
జాగ్రత్తలే రక్ష: ఉరుములు, మెరుపులు ఉండేటప్పుడు చాలామంది బయట తిరగడం ఆపరు. ఎవరికి వారు స్వీయజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వస్తువులకు భద్రత ముఖ్యం. పిడుగుపాటుకు గురైతే తక్షణం ఆస్పత్రికి తరలించాలి.
మల్లికార్జున్, అగ్నిమాపకశాఖ అధికారి, నారాయణపేట.
- వర్షం పడుతున్న సమయంలో ఎత్తయిన చెట్లు, సెల్టవర్లు, స్తంభాలు, కొండల వద్దకు వెళ్లకూడదు. విద్యుత్తు నియంత్రికలకు దూరంగా ఉండాలి.
- కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, గేమ్ సిస్టమ్లు, విద్యుత్తు స్టవ్లు, ఇతర విద్యుత్తు పరికరాలు ఉపయోగించవద్దు. వర్షం కురిసినప్పుడు విద్యుత్తు సరఫరా హెచ్చుతగ్గుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఏం చేయకూడదు?
- గుంపులుగా కాకుండా దూరంగా ఉండాలి. ఉరుములు, మెరుపుల సమయంలో స్నానాలు చేయడం, పాత్రలు కడగటం వంటివి చేయరాదు. ఇనుప కడ్డీలు ఉన్న గొడుగులు వాడరాదు.
- పొలాల్లో పని చేయడం, పశువులను మేపడం, చేపలు పట్టడం వంటివి చేయొద్దు. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. చెరువుకుంటలు, ఈత కొలనులు వంటి బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
- తలదాచుకునేందుకు ఆశ్రయం లేనప్పుడు తనకు తానుగా మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా బంతిలా ముడుచుకొని కూర్చోవాలి. దీని వల్ల విద్యుత్తు ప్రవాహం ముప్పు తక్కువగా ఉంటుంది. చెవులు మూసుకోవడం ద్వారా తరంగాలు లోపలికి వెళ్లకుండా చూసుకోవచ్చు.
- భూమిపై అరికాళ్లు పూర్తిగా ఆనించకుండా వేళ్లపై నిలుచోవాలి. నీటిలో ఉంటే సాధ్యమైనంత వరకు తొందరగా బయటకు రావాలి.
- అటవీ ప్రాంతంలో ఉంటే మరుగజ్జు, చిన్న చెట్ల కింద ఆశ్రయం పొందాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీడు పత్తి పంటలను పరిశీలించిన జపాన్ దేశస్థులు
[ 26-07-2024]
మల్దకల్ మండలం నాగర్ దొడ్డి గ్రామంలో సాగు చేస్తున్న సీడు పత్తి పంటలను జపాన్ దేశస్థులు పరిశీలించారు. -
బియ్యం నేరుగా పాఠశాలలకే అందించాలి
[ 26-07-2024]
ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి బియ్యాన్ని నేరుగా పాఠశాలలకు అందించాలని మండలంలోని ప్రధానోపాధ్యాయులు గురువారం తహసీల్దార్ హరికృష్ణకు వినతిపత్రం అందజేశారు. -
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలి
[ 26-07-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని బీఎస్స్పీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు డిమాండ్ చేశారు. -
పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణంపై జాప్యం తగదు
[ 26-07-2024]
అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో గత సంవత్సర కాలం గడిచినా పెద్దవాగు బ్రిడ్జి పనులు పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అఖిలపక్షం నాయకులు అన్నారు. -
గ్రామాల్లో జ్వర సర్వే
[ 26-07-2024]
మండలంలోని గ్రామాల్లో శుక్రవారం వైద్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించారు. -
సుంకేసుల జలాశయం నుంచి 5,865 క్యూసెక్కుల నీటి విడుదల
[ 26-07-2024]
రాజోలి శివారులోని తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయం నుంచి శుక్రవారం ఉదయం మూడు గేట్లు తెరిచి 5,865 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి అధికారులు విడుదల చేస్తున్నారు. -
నీటి వనరులకు నిధులు
[ 26-07-2024]
పాలమూరులోని నీటి ప్రాజెక్టులకు నిధుల వరద పారింది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి కావాల్సిన నిధుల్ని కేటాయించారు. -
రైతు బీమాపై విస్తృత ప్రచారమేదీ?
[ 26-07-2024]
కష్టకాలంలో రైతు కుటుంబాలకు బాసటగా నిలిచే రైతుబీమాపై అవగాహన కల్పించేందుకు ప్రచారం కొరవడుతోంది. రైతు ఏ కారణంగా మరణించినా కుటుంబం వీధినపడకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
[ 26-07-2024]
పిల్లలమర్రి వృక్షాన్ని దగ్గరి నుంచి చూడాలన్న పర్యాటకుల కోరిక తీరటం మరింత ఆలస్యం కానుంది. అటవీ శాఖ అధికారులు జులై మొదటి వారంలోనే ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. తేదీని కూడా ఖరారు చేశారు. -
ఆబ్కారీలో లీకు వీరులు?
[ 26-07-2024]
రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నార్కోటిక్, డ్రగ్ కంట్రోల్, ఎస్టీఎఫ్, డీఆర్ఐ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. -
జాతీయ సాధన సర్వేకు సమాయత్తం
[ 26-07-2024]
విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయిని తెలుసుకోవడానికి జాతీయస్థాయి సాధన సర్వే (న్యాస్) ఏటా నిర్వహిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం(2024-25)లో న్యాస్ నిర్వహణకు ఉపాధ్యాయుల్ని సమాయత్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. -
ఆత్మనిర్భర్తో చిరు వ్యాపారుల నిబ్బరం
[ 26-07-2024]
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మ నిర్భర్ భారత్ స్వనిధి’ పథకం వీధి వ్యాపారులకు అండగా నిలిచింది. ష్యూరిటీ లేని రుణాలను విడతల వారీగా వీటి మొత్తాలను పెంచుతూ ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందిస్తోంది. -
సాగు ప్రశ్నార్థకం..!
[ 26-07-2024]
చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయరు లోలెవల్ కాలువకు అదును దాటుతున్నా నీరు వదలడం లేదు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైంది. ఆగస్టు నాటికి వరినాట్లు పడాలి. కాగా కుడి లోలెవల్ కాలువ కింద ఇప్పటి వరకూ నీరు వదల్లేదు. -
గజదొంగ అరెస్టు
[ 26-07-2024]
జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ యోగేశ్ గౌతం తెలిపారు. -
అనిశా వలలో సర్వేయర్
[ 26-07-2024]
మక్తల్ మండల సర్వేయర్ రూ.9 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డారు. అనిశా డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ కథనం ప్రకారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి