పాడికి ప్రోత్సాహం కొరవడి
వ్యవసాయంపై ఆధారపడే రైతులు అదనపు ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాన్ని మెరుగుపర్చుకొనేందుకు పాడి పరిశ్రమను ఎంచుకుంటారు. ప్రస్తుతం పాడి పశువులను పెంచుకునే రైతులు ఎలాంటి ప్రోత్సాహకాలు లేక, రావాల్సిన పాల బిల్లులు సకాలంలో అందక ఇబ్బందిపడుతున్నారు.
నాలుగేళ్లుగా చెల్లించని ప్రభుత్వం
మెదక్ టౌన్, న్యూస్టుడే: వ్యవసాయంపై ఆధారపడే రైతులు అదనపు ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాన్ని మెరుగుపర్చుకొనేందుకు పాడి పరిశ్రమను ఎంచుకుంటారు. ప్రస్తుతం పాడి పశువులను పెంచుకునే రైతులు ఎలాంటి ప్రోత్సాహకాలు లేక, రావాల్సిన పాల బిల్లులు సకాలంలో అందక ఇబ్బందిపడుతున్నారు. పాడి రైతులకు ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ప్రతి లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం ప్రకటించింది. విజయ పాల కేంద్రాల్లో పాలు విక్రయించే రైతులకు ఇవ్వాల్సి ఉండగా.. 2020 మార్చి వరకు ఇచ్చిన ఆ తర్వాత పెండింగ్లో పెట్టింది. నాలుగేళ్లుగా ఈ ప్రోత్సాహం కోసం రైతులు ఎదురుచూస్తూనే ఉన్నారు.
తగ్గుతున్న పాల సేకరణ
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 బీఎంసీల ద్వారా ప్రతి రోజు 1700 మంది రైతుల నుంచి 3500 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. ఇలా పాలు పోస్తున్న రైతులకు గత 2020 ఏప్రిల్ నుంచి సుమారు రూ.కోటి ప్రోత్సాహకం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ విసుగు చెందిన రైతులు విజయ డెయిరీకి కాకుండా ప్రైవేట్ సంస్థలకు పాలు పోస్తున్నారు. ప్రైవేటులో ధర అధికంగా ఉన్నప్పటికీ సకాలంలో డబ్బులు ఇవ్వరని ప్రభుత్వ రంగ డెయిరీల వైపు రైతులు మొగ్గుచూపారు. కానీ ప్రభుత్వ డెయిరీలో సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పాటు ప్రోత్సాహం సైతం లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా విజయ డెయిరీలకు వచ్చే పాలు రోజు రోజుకు తగ్గుతోంది. గత భారాస ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు పేరుకుపోగా.. ప్రోత్సాహకాన్ని రూ.5కు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పాడి రైతులకు హామీ ఇచ్చింది. పాత బకాయిలు, పెంచి ఇస్తామన్న ప్రోత్సాహకం తమకు మంజూరు చేయాలని పాడి రైతులు కోరుతున్నారు.
పాల బిల్లు ఆలస్యమే....
పాల కేంద్రాల్లో రోజూ వారిగా పాలు విక్రయించుకునే రైతులకు వారు పోసే పాలలో వెన్నశాతం ప్రకారం ధర చెల్లిస్తుంటారు. పాలలో వెన్నశాతం 5.0 వస్తే లీటరుకు రూ.40.45, గరిష్ఠంగా 10.0 శాతం వస్తే లీటరుకు రూ.80.10 వరకు చెల్లిస్తారు. ఇలా రోజు కేంద్రాలకు పాలు పోసే రైతులకు ప్రతి 15 రోజులకు ఒకసారి డబ్బులు చెల్లించాలి. కానీ గత 2-3 నెలల నుంచి సకాలంలో డబ్బులు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
-శ్రీనివాస్, విజయ డెయిరీ డీడీ
పాడి రైతులకు లీటరుపై అదనంగా ఇస్తామన్న రూ.4 గత నాలుగేళ్లుగా రావడం లేదు. మెదక్ జిల్లాకు సంబంధించి రూ.కోటి వరకు రావాల్సి ఉంది. ప్రస్తుతం వేసవికాలం కావడంతో పాటు పాడి రైతులు ప్రైవేట్ డెయిరీల వైపు మొగ్గు చూపడంతో పాల సేకరణ తగ్గుతోంది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు గ్యారంటీలకు ‘భట్టి’ భరోసా
[ 26-07-2024]
ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు గట్టి భరోసా ఇచ్చింది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. అతివలకు అండగా నిలవనుంది. పేదలకు సొంతగూడు కల్పించేలా నిధులు కేటాయించింది. -
పథకాలకు ‘భట్టి’ పద్దు.. సంక్షేమ పొద్దు
[ 26-07-2024]
ఆరు గ్యారంటీలు.. ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. ప్రజాపాలన, ప్రగతికి పెద్దపీట వేసింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి తొలి పద్దు.. -
సంక్షేమ పథం.. హలధారికి అందలం
[ 26-07-2024]
అన్నదాతలు మురిసేలా.. మహిళా సాధికారతకు బాటలు పడేలా.. యువత ఉపాధికి అవకాశాలు మెరుగయ్యేలా.. బడ్జెట్లో అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని జిల్లాప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బడ్జెట్పై నేతల స్పందన..
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆరు గ్యారంటీల ఊసే లేదని భాజపా జిల్లా అధ్యక్షురాలు సి.గోదావరి అంజిరెడ్డి విమర్శించారు. జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంటూ సంగారెడ్డి పట్టణ ప్రధాన రహదారిపై రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. -
ఆగస్టులో ఆటలకు సై
[ 26-07-2024]
విద్యార్థి దశ నుంచే ఆటలపై ఆసక్తి పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) పోటీలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. -
చేదోడుగా ఉంటారనుకుంటే.. చేజారిపోయారా
[ 26-07-2024]
వారంతా ఇరవై ఏళ్లకు పైబడిన యువకులు. విధులకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఎదిగిన బిడ్డలు కుటుంబాలకు చేదోడుగా ఉంటారని భావించిన తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చారు. -
సంచికి దూరం.. సృజనాత్మకతకు దోహదం
[ 26-07-2024]
చదువు భారంగా మారొద్దు.. భావితరానికి బాటలు వేయాలి. కిలోల కొద్దీ బరువుతో కూడిన సంచులు.. విద్యార్థిని ఒకింత ఆందోళనకు గురిచేస్తుంటాయి. శారీరక ఎదుగుదలపై కొంత ప్రభావం చూపుతుంది. -
తప్పుడు పత్రాలు సృష్టించిన ఆరుగురిపై కేసు
[ 26-07-2024]
తప్పుడు పత్రాలు సృష్టించి స్థలాన్ని కాజేయాలని చూసిన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట వన్టౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. -
విధులకు వెళుతూ అనంతలోకాలకు..
[ 26-07-2024]
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం తున్కిల్లతండా శివారులో సంగారెడ్డి-నాందేడ్ జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. -
రైలు ప్రయాణికుడికి తప్పిన ప్రాణాపాయం
[ 26-07-2024]
కదులుతున్న రైల్లోకి పరుగెత్తుతూ ఎక్కబోయి పట్టు తప్పి దానికింద పడిపోబోయాడు ఓ ప్రయాణికుడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే రక్షణ దళం పోలీసు వెంటనే స్పందించి అతడిని రక్షించి ఆపద్బాంధవుడిగా మారాడు. -
స్వామి సరే.. అమ్మవార్ల మాటేమిటి!
[ 26-07-2024]
భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లన్న గర్భగుడిలో స్వామికి ఇరువైపులా బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలు కొలువై ఉన్నారు. ఏటా రూ.18 కోట్లకు పైగా వార్షిక ఆదాయం సమకూరుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!