పటిష్ఠమయ్యేలా.. పనులు జరిగేదెలా?
నాగార్జునసాగర్ ఎడమ కాలువ లైనింగ్ పనులకు నిధులు మంజూరు చేసి చాలాకాలం అవుతున్నా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి.
నేరేడుచర్ల, న్యూస్టుడే: నాగార్జునసాగర్ ఎడమ కాలువ లైనింగ్ పనులకు నిధులు మంజూరు చేసి చాలాకాలం అవుతున్నా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి. ఓ సంస్థ ఈ పనుల టెండర్లు దక్కించుకుంది. తడకమళ్ల నుంచి మునగాల వరకు (70వ కిలోమీటర్ నుంచి 115 వరకు) రూ.29 కోట్లతో లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రూ.30 లక్షల విలువైన పనులు మాత్రమే చేయడం గమనార్హం.
మొదలుకాని పనులు..
గత వానాకాలం, యాసంగి సీజన్లలో సాగర్ డ్యామ్లో నీరు లేనందున నీటి విడుదల జరపలేదు. ఆ సమయంలో లైనింగ్ చేసి ఉంటే ఆటంకం లేకుండా పనులు జరిగేవి. అప్పుడు చేయలేదు. కనీసం ఇప్పటి వరకు ఈ లైనింగ్ పనులు మొదలు పెట్టనేలేదు. ఈ ఏడాది ముందే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుండటం గమనార్హం. సాగర్ ఎడమ కాల్వ లైనింగ్ పనులు, ముక్త్యాల, జాన్పహాడ్ మేజర్ల లైనింగ్ పనులు, కృష్ణానదిపై జాన్పహాడ్ ఎత్తిపోతల పథకం పనులు సైతం ఒకే ప్యాకేజీలో చేపట్టారు. జాన్పహాడ్ మేజర్ పనులు ఇంత వరకు చేయలేదు. ముక్త్యాల బ్రాంచి కెనాల్ పరిధిలోనూ నామమాత్రంగానే జరిగాయి. ఎత్తిపోతల పనులూ అసంపూర్తిగానే ఉన్నాయి.
దెబ్బతిన్న లైనింగ్..
నేరేడుచర్ల మండలంలో మేడారం, ఫత్తేపురం తదితర గ్రామాల పరిధిలో పలుచోట్ల సిమెంట్ లైనింగ్ దెబ్బతింది. కొన్ని చోట్ల గతంలో వేసిన నాపరాళ్ల లైనింగ్ దెబ్బతిని రాళ్లు పూర్తిగా కాల్వలోకి జారిపోయాయి. ఈ ప్యాకేజీలో ఆ లైనింగ్ పనులు సైతం ఉన్నాయి. వచ్చే ఏడాది పనుల గడువు పూర్తి కానుంది. లైనింగ్ దెబ్బతినడం వల్ల కొన్నిచోట్ల కాల్వ భారీగా కోతకు గురవుతోంది. దీంతో కాల్వకు గండ్ల ముప్పు పొంచి ఉంటుంది. ప్రస్తుతం చేపట్టిన పనులు పూర్తయితే కాల్వ మరింత పటిష్ఠమవుతుంది. నీటి వృథా తగ్గుతుంది. గండ్ల ముప్పు ఉండని రాతి ప్రదేశంలో మాత్రం లైనింగ్ ప్రతిపాదించలేదు. అలా ప్రతిపాదించని ఏరియా 20 శాతం దాకా ఉండవచ్చు.
గుత్తేదారు జాప్యం చేస్తున్నారు
- రఘు, డీఈ, సాగర్ ఎడమకాల్వ
సాగర్ ఎడమ కాల్వ లైనింగ్ పనులు చేయడంలో గుత్తేదారు జాప్యం చేస్తున్నారు. రూ.29 కోట్లతో లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా కేవలం రూ.30 లక్షల విలువైన పనులు మాత్రమే చేశారు. ఉన్నతాధికారుల ద్వారా పనులు చేయాలని గుత్తేదారుపై ఒత్తిడి తెస్తున్నాం. కాల్వకు నీటి విడుదల లేని సమయంలో పనులు చేసి ఉంటే బాగుండేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య తెలంగాణ కోసం పనిచేయాలి
[ 26-07-2024]
పిల్లల బంగారు భవిష్యత్, ఆరోగ్య తెలంగాణ కోసం పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర పుడ్ కమీషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస రెడ్డి అన్నారు. -
పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలి
[ 26-07-2024]
ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అంటువ్యాధులకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జండగే ప్రజలను కోరారు. -
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది: భాజపా
[ 26-07-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా భాజపా కిసాన్ మోర్చా సమావేశం ఫకీర్ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. -
సేవాదళ్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్
[ 26-07-2024]
కాంగ్రెస్ పార్టీ సేవాదళ ఆధ్వర్యంలో స్థానిక జగ్జీవన్ రావు చౌరస్తాలో కార్గిల్ విజయ్ దివాస్ 25వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. -
పేదలకు దుప్పట్లు పంపిణీ
[ 26-07-2024]
ప్రవాస భారతీయుడు పడమటి శ్యాంసుందర్ రెడ్డి జన్మదిన వేడుకలను రోటరీ క్లబ్, జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వాహించారు. -
పంటల పరిశీలన
[ 26-07-2024]
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏరువాక కేంద్రం వారు జిల్లాలోని పలు ప్రాంతాలలో ప్రత్తి, కంది, వరి పంటలను పరిశీలించారు. -
బడ్జెట్ కేటాయింపులపై విద్యార్థుల నిరసన
[ 26-07-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. -
విద్యా రంగానికి తీవ్ర అన్యాయం
[ 26-07-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో విద్యా రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చింతల శివ అన్నారు. -
కలెక్టర్ కార్యాలయంలో గిరిజనుల డిమాండ్లపై వినతిపత్రం అందజేత
[ 26-07-2024]
కలెక్టర్ కార్యాలయంలో భాజపా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు అజ్మీర కిషన్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజనుల డిమాండ్లపై వినతి పత్రం అందజేశారు. -
నిధులన్నీ నీళ్లకే..!
[ 26-07-2024]
ఏళ్లుగా నిర్మాణం కొనసాగుతున్న ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఏఎమ్మార్ - ఎస్ఎల్బీసీ)కి మహర్దశ పట్టనుంది. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-2025) ప్రవేశపెట్టిన -
కాల్వలపై నిర్లక్ష్యం.. కనుమరుగైన లక్ష్యం
[ 26-07-2024]
ఏఎమ్మార్పీ కాల్వలు నిర్మించి దశాబ్దన్నర దాటిపోయింది. అప్పటి నుంచి కాల్వలకు మరమ్మతులు మరిచిపోయారు. దీంతో కాల్వలు పొదలతో నిండిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. -
సరిహద్దులో సైనికుడు.. భారత్కు రక్షకుడు
[ 26-07-2024]
భారత సైన్యం సాధించిన విజయాల్లో కార్గిల్ యుద్ధం అతి ముఖ్యమైనది. కశ్మీర్ను ఆక్రమించుకునేందుకు పాకిస్థాన్పై 1999 మే 3న ప్రారంభమైన యుద్ధం 73 రోజుల పాటు సాగింది. -
బడ్జెట్పై ఎవరేమన్నారంటే..!
[ 26-07-2024]
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని తాజా బడ్జెట్తో తేలిపోయింది. ఇది తిరోగమన బడ్జెట్. ఆరు గ్యారంటీలను అటకెక్కించేలా ఉంది. -
పల్లె నుంచే సాగాలి.. పతకాల వేట
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరాలు శుక్రవారం నుంచి ఆరంభమవుతున్నాయి. పారిస్ వేదికగా జరగనున్న ఈ క్రీడా పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 206 దేశాల నుంచి దాదాపు 10 వేల మంది క్రీడా దిగ్గజాలు పాల్గొంటున్నారు. -
నీటికుంటలో పడి బాలుడి మృతి
[ 26-07-2024]
నీటికుంటలో పడి బాలుడు మృతి చెందిన ఘటన నూతనకల్ మండలంలోని బిక్కుమళ్లలో గురువారం జరిగింది. గ్రామస్థులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
గృహ జ్యోతికి ఇంకా ఎన్ని రోజులో..!
[ 26-07-2024]
గృహజ్యోతి పథకానికి కొంత మంది లబ్ధిదారుల దూరంగా ఉంటున్నారు. కొన్ని సమస్యల కారణంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందలేక అష్టకష్టాలు పడుతున్నారు. -
గంజాయిపై ఉక్కుపాదం..!
[ 26-07-2024]
సూర్యాపేట జిల్లాలో గంజాయి వినియోగం, రవాణా చేస్తున్న సుమారు 250 మందిపై పోలీసులు హిస్టరీ షీటర్ (నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా) రికార్డుల్లో పేర్లు నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించారు. -
ఈ ఏడాదే వైద్య కళాశాల ఏర్పాటు
[ 26-07-2024]
యాదాద్రి ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు జాతీయ వైద్యమండలి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఎన్ఎంసీ బృందం పరోక్ష తనిఖీ సందర్భంగా లేవనెత్తిన అభ్యంతరాలు -
కదులుతున్న దస్త్రాలు.. ఆపేందుకు పైరవీలు
[ 26-07-2024]
రాష్ట్రంలో ఆర్జేసీ హోదా కలిగిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయాలకు చెందిన ఉద్యోగులతో పాటు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM