logo

kavali: పిల్లల సంరక్షణ అందరి బాధ్యత

పిల్లల సంరక్షణ మనందరి బాధ్యత అని కావలి న్యాయస్థానాల లోక్ అదాలత్ సభ్యుడు ఎం. మాలకొండ రెడ్డి పేర్కొన్నారు.

Published : 25 May 2024 16:16 IST

కావలి: పిల్లల సంరక్షణ మనందరి బాధ్యత అని కావలి న్యాయస్థానాల లోక్ అదాలత్ సభ్యుడు ఎం. మాలకొండ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కావలి మండలం ఆముదాలదిన్నె గిరిజన కాలనీలో అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం నిర్వహించారు. న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎం మాలకొండ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారులను అక్రమ రవాణా చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. సంబంధించిన చట్టాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. సీనియర్ న్యాయవాది లీగల్ అడ్వకేట్ ఐ. సాయిప్రసాద్, యానాది సంఘాల మహాకూటమి ఉపాధ్యక్షుడు జయంపు కనకయ్య, స్థానిక సచివాలయం పంచాయతీ సెక్రెటరీ పి. నరేంద్ర, కాలనీవాసులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని