అడ్డగోలుగా ఇసుక రవాణా
అధికారుల చర్యలు లేకపోవడంతో ఇసుకాసురులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. గతంలో రాత్రి వేళల్లోనే అక్రమ రవాణా చేస్తుండగా.. ప్రస్తుతం పట్టపగలే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎన్నికల విధుల్లో అధికారులు ఉంటారని భావించి అక్రమానికి ఒడిగట్టారు.
జిల్లెలమూడి వద్ద పాలేరులో పొక్లెయిన్తో తవ్వకాలు
న్యూస్టుడే, కందుకూరు పట్టణం : అధికారుల చర్యలు లేకపోవడంతో ఇసుకాసురులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. గతంలో రాత్రి వేళల్లోనే అక్రమ రవాణా చేస్తుండగా.. ప్రస్తుతం పట్టపగలే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎన్నికల విధుల్లో అధికారులు ఉంటారని భావించి అక్రమానికి ఒడిగట్టారు. అనుమతుల్లేకుండానే నిత్యం ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. ఇదంతా పోలీసు, సెబ్ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
జిల్లెలమూడి కేంద్రంగా.. కందుకూరు మండలం జిల్లెలమూడి సమీపంలో పాలేరు వద్ద భారీగా ఇసుక నిల్వలు ఉన్నాయి. గతంలో ఇక్కడ ఇసుక రీచ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినా.. చుట్టుపక్కల ఎనిమిది గ్రామాలకు తాగునీటి సమస్య ఏర్పడుతుందని భావించి అనుమతులు రద్దు చేశారు. ఇదే అదనుగా కొంతమంది అక్రమార్కులు విచ్చలవిడిగా తవ్వి తరలిస్తున్నారు. జేసీబీ సాయంతో ప్రతిరోజూ 30 ట్రాక్టర్లలో అక్రమ రవాణా చేస్తున్నారు. గతంలో రాత్రిళ్లు అక్రమ రవాణాకు పాల్పడుతుండగా.. కొద్దిరోజులుగా పట్ట పగలే తరలిస్తున్నారు. ఒక్క ట్రాక్టర్ను కూడా పట్టుకున్న దాఖలాలు లేవు.
మన్నేరు పొడవునా.. నియోజకవర్గంలో మన్నేరు కీలకమైంది. లింగసముద్రం మండలంలో ప్రారంభమై వలేటివారిపాలెం, గుడ్లూరు, కందుకూరు, ఉలవపాడు మండలాల్లోని పలు గ్రామాల సమీపంగా వెళుతోంది. మన్నేరు పరివాహక ప్రాంతంలో ఎక్కడా ఇసుక రీచ్లకు అనుమతులు లేవు. అయినా తరలిస్తున్నారు. కందుకూరు మండలం పాలూరు, శ్రీరంగరాజపురం, వెంకన్నపాలెం, ఉలవపాడు మండలం భీమవరం, కుమ్మరిపాలెం, మన్నేటికోట ప్రాంతాల నుంచి, లింగసముద్రం మండలం వీఆర్ కోట, అన్నెబోయినపల్లి, అంగిరేకులపాడు ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రతిరోజూ 50కి పైగా ట్రాక్టర్లలో తరలిపోతోంది.
చర్యలు తీసుకుంటాం
ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బందిని పంపి జిల్లెలమూడిలో తవ్వకాలు జరగకుండా చూస్తాం. అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు చేపడతాం.
డి.వెంకటేశ్వర్లు, సెబ్ సీఐ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తమిళనాడు నుంచి వచ్చి వేటాడుతున్న వారిని తక్షణమే అడ్డుకోవాలి: మంత్రి కొల్లు రవీంద్ర
[ 26-07-2024]
తమిళనాడు నుంచి నెల్లూరు జిల్లా పరిధిలోని తీర ప్రాంతాలకు వచ్చి వేటాడుతున్న వారిని తక్షణమే అడ్డుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ను ఆదేశించారు. -
బిట్రగుంట సమీపంలో మళ్లీ పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-07-2024]
బిట్రగుంట స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. -
కదిలింది దస్త్రం.. తీసేనా అస్త్రం
[ 26-07-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న అయిదేళ్లు.. నాటి ప్రజాప్రతినిధుల అండతో నెల్లూరు రూరల్ మండలంలోని కొందరు రెవెన్యూ సిబ్బంది రెచ్చిపోయారు. -
ఎర్రచందనం రక్షణకు ప్రత్యేక రేంజ్
[ 26-07-2024]
సోమశిలలో ప్రత్యేక రేంజ్ ఏర్పాటుకు అటవీశాఖ కసరత్తు చేస్తోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధంపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం.. అందుకు ప్రతిబంధకాలు, చేపట్టాల్సిన చర్యలు, కార్యక్రమాలపై అధికారుల నుంచి నివేదిక కోరింది. -
కదలని బండి.. ప్రజాధనానికి గండి
[ 26-07-2024]
నెల్లూరు నగర పరిశుభ్రతే లక్ష్యంగా గత ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద ఇచ్చిన ఆటోల్లో సగానికి పైగా పడకేయగా.. అంతకుముందు స్వచ్ఛాంధ్ర మిషన్ కింద ఇచ్చిన ఖరీదైన యంత్రాలు మూలనపడ్డాయి. -
తొలగించినా.. అదే ముసుగు
[ 26-07-2024]
ఒప్పంద వాచర్ల కదలికలపై అనుమానంతో నిఘాపెట్టి వారిపై చర్యలు తీసుకున్నా.. అక్రమాల దందా ఆగలేదు. అక్రమార్కులతో చేతులు కలిపి.. వారే ఎర్రచందనాన్ని సురక్షితంగా అడవిని దాటిస్తూ.. పట్టుబడ్డారు. -
నేల తల్లికి జీవం
[ 26-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా సాగిన భూసార పరీక్షల్లో.. మళ్లీ కదలిక వచ్చింది. రైతులకు ఎంతో ప్రయోజనకరమైన వీటిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొదించింది. -
నగరపాలక సంస్థలో పోలీసుల సోదాలు
[ 26-07-2024]
నగరపాలక సంస్థలో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
దేశమాత రక్షకులు.. దేవిశెట్టిపల్లి బిడ్డలు
[ 26-07-2024]
అదో కుగ్రామం.. మారుమూల పల్లె. అందరిలోనూ దేశభక్తి. దేశమాత రక్షణకు పాటుపడాలన్న తపన. -
అతివకు.. ఉపాధి బాట
[ 26-07-2024]
ప్రస్తుతం పుట్టినరోజు వేడుకల నుంచి ప్రతి శుభకార్యానికి మహిళలు అలంకరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. -
నాకు లేని సంతోషం అన్నకెందుకు..!
[ 26-07-2024]
నాకు దూరమైన కుటుంబ బంధం.. గౌరవం అన్నకూ దక్కకూడదు. ఇష్టంలేని పెళ్లి చేసి నా గొంతు కోశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత