నేను బతికే ఉన్నా..!
నేను ఒతికే ఉన్నానన్న విషయాన్ని ఇప్పటికైనా అధికారులు, సమాజం గుర్తించాలని ఓ ఎనభై ఏళ్ల వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
చట్టపరమైన వారసత్వం కోసం ఓ వృద్ధురాలి ఆరాటం
రెండు వారాలుగా తహసీల్దారు కార్యాలయం వద్ద బైఠాయింపు
తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్వతి
రాయగడ పట్టణం, న్యూస్టుడే: నేను ఒతికే ఉన్నానన్న విషయాన్ని ఇప్పటికైనా అధికారులు, సమాజం గుర్తించాలని ఓ ఎనభై ఏళ్ల వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త చనిపోయి దాదాపు నాలుగు దశాబ్దాలు కావస్తున్నా ఇంతవరకు చట్టపరమైన వారసత్వం (లీగల్ హైర్) దక్కకపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో తనకు న్యాయం దక్కేంతవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు రెండు వారాలుగా ఆ పండుటాకు మౌనపోరాటం చేస్తోంది. వివరాల్లోకి వెళితే... స్థానిక పిట్టలవీధికి చెందిన కె.పార్వతి పట్నాయక్ (80) భర్త శంకరరావు పట్నాయక్ 1985లో మరణించారు. ఆ నాటి నుంచి పార్వతికి ఎలాంటి చట్టపరమైన వారసత్వం దక్కలేదు. గతంలోనూ ఎన్నోసార్లు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎలాంటి ఫలితం లభించలేదని ఆమె వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా కార్యాలయం ముందు బైఠాయించాల్సి వచ్చిందని పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం దొరికేంతవరకు కదిలేది లేదని ఆమె భీష్మించుక్కూర్చున్నారు. తుదిశ్వాస విడిచేలోగా చట్టపరమైన వారసత్వం లభించాలని పార్వతి నిట్టూరుస్తున్నారు.
ఏమీ దక్కలేదు: ఈ విషయమై పార్వతి మాట్లాడుతూ భర్త మరణాంతరం తనకు ఏమీ దక్కలేదన్నారు. తనకు మురళీప్రసాద్ పట్నాయక్, గోవింద్ పట్నాయక్ పేర్లతో ఇద్దరు కొడుకులు ఉన్నారని వెల్లడించారు. తల్లి దీనావస్థ చూసి మురళీ ప్రసాద్ ఆమెతో మధ్య మధ్యలో నీళ్లు, ఇతర పానీయాలు తాగిస్తున్నారు. ఈ సందర్భంగా మురళీ ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ పదిహేను రోజులుగా తన తల్లి న్యాయం కోసం పోరాడుతోందన్నారు. ఈ విషయమై విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరించాలని తహసీల్దార్కు, సబ్కలెక్టర్ దిశానిర్దేశం చేసినట్లు లేఖ పంపారని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
[ 26-07-2024]
కే సింగ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. -
రాయగడ రైల్వేకు రూ.70 కోట్లు
[ 26-07-2024]
రాయగడ రైల్వే డివిజన్ కోసం రూ.70 కోట్లను కేటాయిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
వరద నీటిలో వరి నాట్లు వేస్తూ నిరసన
[ 26-07-2024]
కోరాపుట్ జిల్లా కుంద్ర సమితి దంగరపొన్సి పంచాయతీ భోజహండి రహదారిపై వరదనీటిలో వరి నాట్లు వేసి ప్రజలు నిరసన తెలిపారు. -
జీతాలను పెంచాలని మంత్రికి వినతి
[ 26-07-2024]
జయపురం సమితి పంఫనికి సుమోతి పంచాయతీకి చెందిన సమితి సభ్యుడు బాబుగౌడ్ నేతృత్వంలో శుక్రవారం భువనేశ్వర్లో నిరసన తెలిపారు. -
భాజపా నేత కన్నుమూత
[ 26-07-2024]
భాజపా నేత రాజా రావు (49) అనుమానస్పద స్థితిలో గురువారం మృతి చెందారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. తప్పిన ప్రమాదం
[ 26-07-2024]
తురదేశ్శర నుంచి అనుగుల్ జిందాల్ జైతెహ్మగారానికి వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. -
17 వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ
[ 26-07-2024]
రాష్ట్రంలో 17 వేల మందికి పైగా గ్రామీణ నిరుద్యోగ యువతకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. -
రూ.2.65 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్
[ 26-07-2024]
భాజపా ప్రభుత్వం తొలిసారిగా గురువారం రాత్రి శాసనసభలో 2024 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టింది. ఆర్థికశాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి రూ.2.65 లక్షల కోట్లతో బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టారు. -
ఆర్థికాభివృద్ధి రేటు 8.5
[ 26-07-2024]
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని, 2023-24 ఆర్థికాభివృద్ధి రేటు 8.5 శాతంగా ఉందని ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. గతేడాది (2022-23) ఆర్థికాభివృద్ధి రేటు 7.9 శాతంగా నమోదైందని వివరించింది. -
అమ్మా... అని పిలిచేవారే లేకుండా పోయారు
[ 26-07-2024]
అమ్మా...! చూడు చెల్లి కొడుతోంది..చూడమ్మా అక్క రిమోట్ ఇవ్వడం లేదు..తమ్ముడు హోంవర్కు చేయడం లేదమ్మా... ఇలాంటి ఫిర్యాదులు అన్ని ఇళ్లలో వినిపిస్తుంటాయి. -
పోలవరంతో రాష్ట్రానికి నష్టం
[ 26-07-2024]
శాసనసభ శూన్య గంట (జీరో అవర్)లో గురువారం ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సభాపక్షం (సీఎల్పీ) నేత రామచంద్ర కడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు వల్ల దక్షిణ ఒడిశా జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, గ్రామాలు మునిగిపోతాయన్నారు. -
విజిలెన్స్ వలలో చిక్కిన ప్రధాన ఇంజినీరు
[ 26-07-2024]
బొలంగీర్ జిల్లా కేంద్రం పరిధిలోని లోయర్ సుక్తేల్ నీటి పారుదల ప్రాజెక్టు ప్రధాన ఇంజినీరు సునీల్రౌత్ విజిలెన్స్ వలకు చిక్కారు. ఆదాయానికి మించి పదిరెట్లు ఆస్తులు సంపాదించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. బొలంగీర్ జిల్లా కేంద్రం పరిధిలోని లోయర్ సుక్తేల్ నీటి పారుదల ప్రాజెక్టు ప్రధాన ఇంజినీరు సునీల్రౌత్ విజిలెన్స్ వలకు చిక్కారు. ఆదాయానికి మించి పదిరెట్లు ఆస్తులు సంపాదించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. -
రూ.30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
[ 26-07-2024]
మోహన పోలీసులు రూ.30 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహన ఠాణా పరిధిలో గురువారం సాయంత్రం ఎస్.ఐ. సౌమ్యరంజన్ బోరాల్ తన బృందంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో సికులిపొదర్ ప్రాంతంలో కారు, ద్విచక్ర వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించగా గంజాయి లభ్యమైంది. -
కేంద్రపడలో నక్కల బెడద
[ 26-07-2024]
కేంద్రపడ జిల్లా మర్సఘాయ్ సమితిలోని పలు గ్రామాల్లో గత కొద్ది రోజులుగా నక్కల బెడద ఎక్కువవుతోంది. ఇప్పటికే వీటి దాడిలో 25 మందికిపైగా గాయపడగా, బుధవారం ఓ మహిళ మృతి చెందింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి