మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
ఆంధ్రా దారులు ఇంత ఘోరమా.. ఈ మాట ఎవరన్నా తల దించుకోవాల్సిందే.. మన దగ్గర రోడ్డుకు ఒడిశా వారు వచ్చి మరమ్మతులు చేస్తుంటే అంత కన్నా.. సిగ్గు ఏముంటుంది. మన పాలకుల చేతగాని తనానికి ఇదే నిదర్శనం.
న్యూస్టుడే, కొమరాడ: ఆంధ్రా దారులు ఇంత ఘోరమా.. ఈ మాట ఎవరన్నా తల దించుకోవాల్సిందే.. మన దగ్గర రోడ్డుకు ఒడిశా వారు వచ్చి మరమ్మతులు చేస్తుంటే అంత కన్నా.. సిగ్గు ఏముంటుంది. మన పాలకుల చేతగాని తనానికి ఇదే నిదర్శనం. ఈ అయిదేళ్లలో ఒకసారి మాత్రమే మరమ్మతులు చేయడం గమనార్హం.
రాష్ట్ర రహదారి-36 విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది.. విశాఖ నుంచి పార్వతీపురం, కొమరాడ మీదుగా ఒడిశా, ఛత్తీస్గఢ్ వరకు ఉన్న ఈ మార్గంలో రోజూ వేల సంఖ్యలో లారీలు ప్రయాణిస్తాయి. ఒడిశా వరకు వందల సంఖ్యలో నాలుగు చక్రాలు, ద్విచక్ర వాహనాలు, బస్సులు వెళ్తాయి. మన్యం పరిధిలో కూనేరు నుంచి పార్వతీపురం వరకు మార్గం గోతులతో నిండిపోయింది. ఎప్పుడు ఏ వాహనం ప్రమాదానికి గురవుతుందో, మరమ్మతులతో ఆగిపోతుందో తెలియని పరిస్థితి. మన పరిధిలో రోడ్డు దాటి ఒడిశాలో అడుగుపెడితే హమ్మయ్య బతికాం అనుకుంటారు. ఇదే మార్గంలో అయిదు కి.మీ పరిధిలో మూడు రైల్వే గేట్లు ఉన్నాయి. ఇక్కడ పై వంతెనల నిర్మాణం గురించి కనీసం పట్టించుకున్న నేతలే కరవయ్యారు.
కొమరాడ శివాలయం వద్ద గోతుల్లో చేరిన నీటిలో చోదకుల పాట్లు
వర్షాకాలంలో నరకమే
వర్షాకాలంలో రోడ్డంతా చెరువును తలపిస్తుంది. గోతుల మధ్యలో లారీలు ఇరుక్కుపోయి గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఆ సమయంలో ట్రాఫిక్ను సరిచేయడానికి, జేసీబీలను తీసుకొచ్చి వాహనాలను బయటకు తీయించడానికి పోలీసులకు తలకు మించిన భారమవుతోంది.
ఈ పాపం సర్కార్దే
- 2017 డిసెంబరు 7న పూడేసుకు చెందిన గర్భిణి ఊర్మిళ ఆటోలో ప్రసవించింది. బిడ్డ సగం వరకు బయటకు వచ్చి అలా ఉండిపోవడంతో పార్వతీపురం ఆసుపత్రికి తరలించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది సూచించారు. అదే ఆటోలో పార్వతీపురం తరలిస్తుండగా అర్తాం రైల్వే గేటు అడ్డుపడింది. అప్పుడు ఆమె ప్రసవవేదనతో బాధపడింది. ప్రాంతీయ ఆసుపత్రికి చేరిన వెంటనే చికిత్స అందించడంతో తల్లి బిడ్డ ఆరోగ్యంగా బయటపడ్డారు.
- పూడేసుకు చెందిన ఓ గర్భిణి భర్తతో ద్విచక్ర వాహనంపై ఏరియా ఆసుపత్రికి వస్తుండగా బంగారంపేట గొయ్యి తప్పించే ప్రయత్నంలో ఇద్దరూ కింద పడిపోయారు. అదే సమయంలో లారీ రావడంతో గర్భిణిపై నుంచి వెళ్లిపోవడంతో చనిపోయింది.
- గతేడాది జనవరి 2న జాకూరు సరుగుగూడ మధ్యలో ట్రక్కర్ బోల్తా పడింది. సంఘటన స్థలంలో ఒకరు చనిపోగా, కొన ఊపిరితో ఉన్న ఇంకొకరిని పార్వతీపురం ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచాడు. అదే రహదారి బాగుంటే ఆసుపత్రికి తీసుకెళ్తే బతికేవాడని బంధువులు అన్నారు.
- జనవరి 23న చోళపదం శివాలయం మలుపు వద్ద లారీ ఆటోను ఢీకొట్టింది. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, జిల్లా ఆసుపత్రికి తీసుకొస్తున్న సమయంలో మరొకరు ప్రాణాలు విడిచారు. గతుకుల రహదారి కావడంతో అత్యవసర వాహనాలు వేగంగా రాలేని పరిస్థితితో చనిపోయాడు.
- ఫిబ్రవరి 17న కొమరాడ వద్ద రెండు లారీలు ఢీకొని ఒక వాహనంలో చోదకుడు ఇరుక్కుపోయాడు. ఆయన్ని బయటకు తీయడానికి పోలీసులు, స్థానికులు విశ్వప్రయత్నం చేయగా చివరికి తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. గోతులే ఈ ప్రమాదానికి కారణం.
- మార్చి 1న అర్తాం వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి గుంతలో దిగి ఒక లారీ బోల్తా పడింది.
ఇక్కడి వారికి చేతకాక..
గతంలో రాయగడ ఒడిశా లారీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కొండబాబు, జానకి రామయ్య ఆధ్వర్యంలో కొమరాడ మండలం ఇందిరానగర్ వద్ద గోతులను నాలుగు లారీలతో రాళ్లు, డస్ట్, మట్టి తీసుకొచ్చి కప్పారు.ఇందుకు రూ.50 వేలు ఖర్చు చేశారు.
- కొమరాడ శివాలయం, జూనియర్ కళాశాల దిగువన, గుమడ వద్ద తెదేపా, సీపీఎం నాయకులు బత్తుల శ్రీను, కొల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో సొంత నిధులతో లారీల్లో డస్ట్ను తీసుకొచ్చి పెద్దపెద్ద గుంతలను కప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
[ 26-07-2024]
బలిజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం మండల ప్రత్యేకాధికారి, జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు రాబర్ట్పాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
విద్యుత్తు కోతతో అవస్థలు
[ 26-07-2024]
బలిజిపేట మండలంలోని చిలకలపల్లి, వంతరాం విద్యుత్తు ఉపకేంద్రాల్లో అయిదు రోజులుగా విధిస్తున్న విద్యుత్తు కోతల వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
రహదారి బురదమయం
[ 26-07-2024]
దశాబ్దాల కిందట రూ.33లక్షల పీఎంజీఎస్వై నిధులతో నిర్మించిన తారురోడ్డు ఎక్కడికక్కడ గోతులతో నిండిపోయింది. -
సైనికుల త్యాగాలు మరువలేం..
[ 26-07-2024]
వీర సైనికుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయ దివస్ ర్యాలీ నిర్వహించారు. -
విజ్ఞాన వికాస కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
[ 26-07-2024]
విజ్ఞాన వికాస కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ కోరారు. -
డబ్బు కొట్టు.. ఇంక్రిమెంట్ పట్టు
[ 26-07-2024]
జిల్లాలో 2020లో సచివాలయ వ్యవస్థ నోటిఫికేషన్లో కొలువులు దక్కించుకుని రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం 2023 ఏప్రిల్లో ప్రొబేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. -
రూ.14 కోట్లు ఎక్కడ?
[ 26-07-2024]
గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి హమాలీ, రవాణా ఛార్జీలు నేటికీ అందలేదు. -
నీరెత్తిపోసేలా.. పంటలు పండేలా..
[ 26-07-2024]
ఉమ్మడి జిల్లాలో మెట్ట భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు.. రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఏపీఎస్ ఐడీసీ ఆధ్వర్యంలో గతంలో ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. -
చితికిల‘బడి’
[ 26-07-2024]
నూతన జాతీయ విద్యావిధానం అమల్లో భాగంగా గత ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.117 ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింది. -
రక్తహీనత.. మన్యం బిడ్డల బలహీనత
[ 26-07-2024]
మన్యం బిడ్డలను రక్తహీనత పీడిస్తోంది.. కొత్త జీవికి రూపమిచ్చే గర్భిణులు.. అప్పుడప్పుడే ఎదుగుతున్న చిన్నారులు సైతం రక్తం లేక ఆసుపత్రుల్లో చేరుతున్నారు. -
చంద్రబాబును కలిసిన అశోక్
[ 26-07-2024]
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
కందిపప్పు, బియ్యానికి బె‘ధర’క్కర్లేదు!
[ 26-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో ఆకాశమే హద్దుగా నిత్యావసర ధరలు ఎగిశాయి. -
ఎట్టకేలకు రోడ్డు మరమ్మతులు
[ 26-07-2024]
బొబ్బిలి- తెర్లాం రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎమ్మెల్యే బేబినాయన సొంత నిధులు వెచ్చించి బాగు చేయిస్తున్నారు. -
మామయ్య మాయాదీవెన
[ 26-07-2024]
‘తల్లిదండ్రులంతా మీ పిల్లలను కళాశాలలకు పంపండి చాలు.. వారికి మేనమామలా అండగా ఉంటా’ అంటూ అయిదేళ్లూ పబ్బం గడిపేశారు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి.. మాయమాటలతో ఏమార్చి విద్యా, వసతి దీవెనల కింద ఇవ్వాల్సిన నిధులను చెల్లించకుండా నిలువునా ముంచేశారు.. -
ప్రాణాలతో చెలగాటం
[ 26-07-2024]
వరుస విద్యుత్తు ప్రమాదాలతో ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. -
కుక్కల దాడిలో ఆరుగురికి గాయాలు
[ 26-07-2024]
జియ్యమ్మవలస మండలంలో కుక్కల దాడుల్లో గాయపడుతున్న బాధితుల సంఖ్య పెరుగతూపోతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!