కాలువలకు గండ్లు.. రైతులకు కడగండ్లు
ఏటా వర్షాభావంతో కరవు దోబూచులాడుతోంది. ప్రకృతిసిద్ధంగా వనరులు అపారంగా ఉన్నా.. సాగుజలం వట్టిమాటే అవుతోంది. ఓ వైపు ఖరీఫ్ ముంచుకొస్తున్నా.. ప్రాజెక్టుల ఆధునికీకరణపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు.
ప్రాజెక్టుల ఆధునికీకరణ, నిర్వహణ దూరం
12వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం
న్యూస్టుడే, పాచిపెంట
గోగాడవలస వద్ద పెద్దగెడ్డ ప్రధాన కాలువ గట్టుకు పడిన గండి ఇలా
ఏటా వర్షాభావంతో కరవు దోబూచులాడుతోంది. ప్రకృతిసిద్ధంగా వనరులు అపారంగా ఉన్నా.. సాగుజలం వట్టిమాటే అవుతోంది. ఓ వైపు ఖరీఫ్ ముంచుకొస్తున్నా.. ప్రాజెక్టుల ఆధునికీకరణపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. పాచిపెంట ప్రాంతంలో పెద్దగెడ్డ జలాశయం ప్రధానకాలువ, కర్రివలస వద్ద వేగావతి ఆనకట్ట కుడి, ఎడమ కాలువలు నిర్వహణకు నోచుకోలేదు. వీటి ద్వారా 12 వేల ఎకరాలకు నీరందాల్సి ఉన్నా.. సగం ఆయకట్టుకూ అందని పరిస్థితి. పటిష్ఠ పనులు చేపట్టక కాలువ గట్లు బలహీనపడ్డాయి. పలుచోట్ల గండ్లు పడ్డాయి. దీంతో రైతులకు కడగండ్లే మిగులుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
- పాచిపెంట మండలంలో కర్రివలస వద్ద వేగావతి ఆనకట్ట ద్వారా 4,500 ఎకరాలకు నీరందాల్సి ఉంది. కుడి, ఎడమ కాలువలకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. మిగ్జాం తుపానుతో గట్లు దెబ్బతిన్నా ఇంతవరకు బాగుచేయలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల గట్లు బలహీన పడుతున్నాయి. అమ్మవలస వద్ద కాలువ గట్టుకు భారీ గండి పడింది. దీంతో కాలువకు నీరు విడుదల చేసినా ఆయకట్టుకు చేరే పరిస్థితి కనిపించడం లేదు.
- పెద్దగెడ్డ జలాశయం ప్రధాన కాలువ ద్వారా 7500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇటీవల వర్షాలకు గట్టు కోతకు గురవ్వగా కొన్నిచోట్ల గండ్లు పడ్డాయి. గోగాడవలసలో 2.5 కి.మీ. వద్ద గట్టుకు గండి పడటమే కాకుండా మట్టిజారి కాలువలోకి చేరింది. దీంతో ప్రవాహానికి అడ్డంకిగా మారిందని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. సాగునీటి వనరుల అభివృద్ధి పనుల గురించి గుత్తేదారుకు నోటీసులు ఇచ్చామని, వెంటనే మిగిలినవి చేపట్టేలా చర్యలు తీసుకుంటామని పెద్దగెడ్డ ప్రాజెక్టు డీఈ కనకారావు ‘న్యూస్టుడే’కు తెలిపారు.
నిధులున్నా సాగని పనులు
పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల పరిధిలోని వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న పెద్దగెడ్డ, వేగావతి సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణకు నిధులున్నా పనులు జరగని పరిస్థితి. రెండున్నర ఏళ్ల కిందట జైకా నిధులు రూ.28.18 కోట్లు మంజూరుకాగా, ఇప్పటికీ కేవలం రూ.3కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. గతేడాది ఖరీఫ్ సాగుకు కాలువలకు నీరు విడుదల చేయడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తర్వాత అడుగులు పడలేదు.
వనరులు అపారం.. అందని జలం
భామిని వద్ద ములగమాను గెడ్డలో తుప్పలు
భామిని, న్యూస్టుడే: ఖరీఫ్ సీజన్కు ముందే జలవనరుల నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉన్నా.. ఈ ఏడాది ఇంతవరకు భామిని మండలంలోని చెరువులు, గెడ్డల్లో పూడికతీత పనులు చేపట్టనేలేదు. భామిని మండలంలో బత్తిలి వద్ద వెర్రిగెడ్డ, వడ్డంగిలో ములగమాను గెడ్డ, కొరమ వద్ద బగ్గామర్రిపాడు గెడ్డ, దిమ్మిడిజోలలో మినీ జలాశయం, భామిని వద్ద కొండలోయగెడ్డ జలాశయంతో పాటు నులకజోడులో కర్ర చెరువు, సతివాడలో పెద్దసాగరం, బైరాగినాయుడు చెరువు తదితర చిన్నతరహా జలవనరుల ఆధునికీకరణ గాలికి వదిలేశారు. వీటి నిర్వహణ పనులపై యంత్రాంగం చొరవ తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
[ 26-07-2024]
బలిజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం మండల ప్రత్యేకాధికారి, జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు రాబర్ట్పాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
విద్యుత్తు కోతతో అవస్థలు
[ 26-07-2024]
బలిజిపేట మండలంలోని చిలకలపల్లి, వంతరాం విద్యుత్తు ఉపకేంద్రాల్లో అయిదు రోజులుగా విధిస్తున్న విద్యుత్తు కోతల వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
రహదారి బురదమయం
[ 26-07-2024]
దశాబ్దాల కిందట రూ.33లక్షల పీఎంజీఎస్వై నిధులతో నిర్మించిన తారురోడ్డు ఎక్కడికక్కడ గోతులతో నిండిపోయింది. -
సైనికుల త్యాగాలు మరువలేం..
[ 26-07-2024]
వీర సైనికుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయ దివస్ ర్యాలీ నిర్వహించారు. -
విజ్ఞాన వికాస కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
[ 26-07-2024]
విజ్ఞాన వికాస కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ కోరారు. -
డబ్బు కొట్టు.. ఇంక్రిమెంట్ పట్టు
[ 26-07-2024]
జిల్లాలో 2020లో సచివాలయ వ్యవస్థ నోటిఫికేషన్లో కొలువులు దక్కించుకుని రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం 2023 ఏప్రిల్లో ప్రొబేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. -
రూ.14 కోట్లు ఎక్కడ?
[ 26-07-2024]
గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి హమాలీ, రవాణా ఛార్జీలు నేటికీ అందలేదు. -
నీరెత్తిపోసేలా.. పంటలు పండేలా..
[ 26-07-2024]
ఉమ్మడి జిల్లాలో మెట్ట భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు.. రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఏపీఎస్ ఐడీసీ ఆధ్వర్యంలో గతంలో ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. -
చితికిల‘బడి’
[ 26-07-2024]
నూతన జాతీయ విద్యావిధానం అమల్లో భాగంగా గత ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.117 ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింది. -
రక్తహీనత.. మన్యం బిడ్డల బలహీనత
[ 26-07-2024]
మన్యం బిడ్డలను రక్తహీనత పీడిస్తోంది.. కొత్త జీవికి రూపమిచ్చే గర్భిణులు.. అప్పుడప్పుడే ఎదుగుతున్న చిన్నారులు సైతం రక్తం లేక ఆసుపత్రుల్లో చేరుతున్నారు. -
చంద్రబాబును కలిసిన అశోక్
[ 26-07-2024]
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
కందిపప్పు, బియ్యానికి బె‘ధర’క్కర్లేదు!
[ 26-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో ఆకాశమే హద్దుగా నిత్యావసర ధరలు ఎగిశాయి. -
ఎట్టకేలకు రోడ్డు మరమ్మతులు
[ 26-07-2024]
బొబ్బిలి- తెర్లాం రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎమ్మెల్యే బేబినాయన సొంత నిధులు వెచ్చించి బాగు చేయిస్తున్నారు. -
మామయ్య మాయాదీవెన
[ 26-07-2024]
‘తల్లిదండ్రులంతా మీ పిల్లలను కళాశాలలకు పంపండి చాలు.. వారికి మేనమామలా అండగా ఉంటా’ అంటూ అయిదేళ్లూ పబ్బం గడిపేశారు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి.. మాయమాటలతో ఏమార్చి విద్యా, వసతి దీవెనల కింద ఇవ్వాల్సిన నిధులను చెల్లించకుండా నిలువునా ముంచేశారు.. -
ప్రాణాలతో చెలగాటం
[ 26-07-2024]
వరుస విద్యుత్తు ప్రమాదాలతో ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. -
కుక్కల దాడిలో ఆరుగురికి గాయాలు
[ 26-07-2024]
జియ్యమ్మవలస మండలంలో కుక్కల దాడుల్లో గాయపడుతున్న బాధితుల సంఖ్య పెరుగతూపోతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ