అప్పు పుడితేనే జీతమట
రైతులకు సేంద్రియ వ్యవసాయం చేరువ చేసేందుకు ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు సిబ్బంది వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయ విభాగంలో వేతన సమస్య
15 నెలలుగా ఎదురుచూస్తున్న సిబ్బంది
సేంద్రియ వ్యవసాయ విభాగం అధికారి షణ్ముఖరాజుకు వినతిపత్రం ఇస్తున్న ఉద్యోగులు (పాతచిత్రం)
రైతులకు సేంద్రియ వ్యవసాయం చేరువ చేసేందుకు ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు సిబ్బంది వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదు. ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 15 నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు అర్ధాకలితో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ బ్యాంకు నుంచైనా అప్పు పుడితేనే చెల్లిస్తామని అధికారులు చెబుతుండటంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
పార్వతీపురం, న్యూస్టుడే : రైతు సాధికారిత సంస్థకు అనుబంధంగా జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ విభాగాలు పనిచేస్తున్నాయి. ప్రాజెక్టు అధికారిగా వ్యవసాయ శాఖ నుంచి ఒక సీనియర్ను నియమించారు. ఆయన ఆధీనంలో కొందరు పరిమిత వేతనంతో పనిచేస్తున్నారు. వీరిలో డివిజన్ స్థాయిలో మాస్టర్ ట్రైనీలు, మండల స్థాయిలో యూనిట్ ఇన్ఛార్జులు, గ్రామాల్లో సీఆర్పీలు, ఐసీఆర్పీలు పని చేస్తారు. వీరి స్థాయిని బట్టి ఎల్1, ఎల్2, ఎల్3లుగా విభజించి వేతనాలు చెల్లిస్తారు. జిల్లాలో 107 యూనిట్ల పరిధిలో గరిష్ఠంగా 3 వేల మంది రైతులకు 450 మంది క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. వీరికి నెలకు రూ.6 వేలు నుంచి రూ.40 వేల వరకు వేతనాలు ఇవ్వాలి. జిల్లాలో ఉద్యోగులందరికీ నెలకు రూ.30 లక్షల వరకు అందాల్సి ఉంది.
ఒక్కోసారి.. ఒక్కో మాట: జీతాల కోసం సిబ్బంది ప్రశ్నిస్తే అధికారులు ఏదో ఒక కథ చెబుతున్నారు. మార్చిలో జీతం ఇస్తారో, ఇవ్వరో చెప్పండంటూ నిలదీస్తే.. ‘దారిద్య్ర నిర్మూలన సంస్థ’ ఆధ్వర్యంలో స్త్రీనిధి నుంచి రుణం తీసుకుంటున్నామని, వచ్చిన వెంటనే చెల్లిస్తామని చెప్పారు. తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడేమో ఎస్బీఐ అప్పు ఇస్తుందని, దీని కోసం ఖాతాలు తెరిపించామని అధికారులు చెప్పడంతో సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. జీతాల కోసం ఇంకెన్ని నెలలు ఎదురుచూడాల్సి వస్తుందోనని వారు వాపోతున్నారు.
రోజువారీ ఖర్చులకూ ఇబ్బందులే
ఈ విభాగంలో కొందరు స్థానికంగా ఉన్న గ్రామాల్లో పని చేస్తున్నారు. మరికొందరు వేర్వేరు గ్రామాలకు వెళ్తున్నారు. ఒక్కొక్కరు రోజుకు 30 కిలోమీటర్ల మేర రాకపోకలు సాగిస్తున్నారు. వీరికి రవాణాకు రోజుకు రూ.150 వరకు ఖర్చు అవుతోంది. వేతనాలు అందకపోవడంతో ఈ ఖర్చులకు సైతం సిబ్బంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. జీతాలు సక్రమంగా రాని ఉద్యోగాలు చేస్తూ భార్యాపిల్లలను ఆకలితో చంపేస్తారా అని కుటుంబ సభ్యుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎలా బతకాలి..
2018 నుంచి పనిచేస్తున్నా. ఇప్పుడు వేరే పని చేసుకోలేక దీనిలోనే కొనసాగుతున్నా. కొన్ని నెలలు చూడండి.. వేతనాలు రాకపోతే మానేయొచ్చని కొందరు సలహా ఇస్తున్నారు. పదిహేను నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకగలం.
- నాగార్జున, సీఆర్పీ, లిడికివలస, పార్వతీపురం మండలం
త్వరలోనే చెల్లింపులు
ఈ నెలాఖరులోపు ఎస్బీఐ నుంచి రుణం తీసుకొని వేతనాలు చెల్లిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఖాతాలు తెరవాలని సూచనలు వచ్చాయి. తొలి అంచెగా ఆరు నెలల వేతనం జమ చేస్తారు. మిగిలినది మరో రెండు నెలల్లో చెల్లిస్తారు.
- షణ్ముఖరాజు, ప్రకృతి వ్యవసాయం జిల్లా పథక అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
[ 26-07-2024]
బలిజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం మండల ప్రత్యేకాధికారి, జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు రాబర్ట్పాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
విద్యుత్తు కోతతో అవస్థలు
[ 26-07-2024]
బలిజిపేట మండలంలోని చిలకలపల్లి, వంతరాం విద్యుత్తు ఉపకేంద్రాల్లో అయిదు రోజులుగా విధిస్తున్న విద్యుత్తు కోతల వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
రహదారి బురదమయం
[ 26-07-2024]
దశాబ్దాల కిందట రూ.33లక్షల పీఎంజీఎస్వై నిధులతో నిర్మించిన తారురోడ్డు ఎక్కడికక్కడ గోతులతో నిండిపోయింది. -
సైనికుల త్యాగాలు మరువలేం..
[ 26-07-2024]
వీర సైనికుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయ దివస్ ర్యాలీ నిర్వహించారు. -
విజ్ఞాన వికాస కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
[ 26-07-2024]
విజ్ఞాన వికాస కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ కోరారు. -
డబ్బు కొట్టు.. ఇంక్రిమెంట్ పట్టు
[ 26-07-2024]
జిల్లాలో 2020లో సచివాలయ వ్యవస్థ నోటిఫికేషన్లో కొలువులు దక్కించుకుని రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం 2023 ఏప్రిల్లో ప్రొబేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. -
రూ.14 కోట్లు ఎక్కడ?
[ 26-07-2024]
గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి హమాలీ, రవాణా ఛార్జీలు నేటికీ అందలేదు. -
నీరెత్తిపోసేలా.. పంటలు పండేలా..
[ 26-07-2024]
ఉమ్మడి జిల్లాలో మెట్ట భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు.. రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఏపీఎస్ ఐడీసీ ఆధ్వర్యంలో గతంలో ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. -
చితికిల‘బడి’
[ 26-07-2024]
నూతన జాతీయ విద్యావిధానం అమల్లో భాగంగా గత ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.117 ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింది. -
రక్తహీనత.. మన్యం బిడ్డల బలహీనత
[ 26-07-2024]
మన్యం బిడ్డలను రక్తహీనత పీడిస్తోంది.. కొత్త జీవికి రూపమిచ్చే గర్భిణులు.. అప్పుడప్పుడే ఎదుగుతున్న చిన్నారులు సైతం రక్తం లేక ఆసుపత్రుల్లో చేరుతున్నారు. -
చంద్రబాబును కలిసిన అశోక్
[ 26-07-2024]
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
కందిపప్పు, బియ్యానికి బె‘ధర’క్కర్లేదు!
[ 26-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో ఆకాశమే హద్దుగా నిత్యావసర ధరలు ఎగిశాయి. -
ఎట్టకేలకు రోడ్డు మరమ్మతులు
[ 26-07-2024]
బొబ్బిలి- తెర్లాం రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎమ్మెల్యే బేబినాయన సొంత నిధులు వెచ్చించి బాగు చేయిస్తున్నారు. -
మామయ్య మాయాదీవెన
[ 26-07-2024]
‘తల్లిదండ్రులంతా మీ పిల్లలను కళాశాలలకు పంపండి చాలు.. వారికి మేనమామలా అండగా ఉంటా’ అంటూ అయిదేళ్లూ పబ్బం గడిపేశారు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి.. మాయమాటలతో ఏమార్చి విద్యా, వసతి దీవెనల కింద ఇవ్వాల్సిన నిధులను చెల్లించకుండా నిలువునా ముంచేశారు.. -
ప్రాణాలతో చెలగాటం
[ 26-07-2024]
వరుస విద్యుత్తు ప్రమాదాలతో ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. -
కుక్కల దాడిలో ఆరుగురికి గాయాలు
[ 26-07-2024]
జియ్యమ్మవలస మండలంలో కుక్కల దాడుల్లో గాయపడుతున్న బాధితుల సంఖ్య పెరుగతూపోతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!