నన్నే తప్పిస్తారా.. తేల్చుకుంటా!
పోలీసు శాఖలో అత్యంత కీలకం స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ). జిల్లాలో చోటుచేసుకుంటున్న ఘటనలు.. పోలీస్ స్టేషన్లలో ఏం జరుగుతోందనే సమాచారం ఎప్పటికప్పుడు ఈ విభాగం ద్వారానే జిల్లా పోలీస్ బాస్కు చేరుతాయి.
నిఘా వైఫల్యంపై ఎస్పీ ఆగ్రహం
తాలూకా ఎస్బీ హెచ్సీకి ఉద్వాసన
సిమ్ కార్డు ఇవ్వకుండా ధిక్కారస్వరం
న్యూస్టుడే, ఒంగోలు నేరవిభాగం : పోలీసు శాఖలో అత్యంత కీలకం స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ). జిల్లాలో చోటుచేసుకుంటున్న ఘటనలు.. పోలీస్ స్టేషన్లలో ఏం జరుగుతోందనే సమాచారం ఎప్పటికప్పుడు ఈ విభాగం ద్వారానే జిల్లా పోలీస్ బాస్కు చేరుతాయి. క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఏఎస్సై లేదంటే హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తుంటారు. అయినప్పటికీ క్షేత్రస్థాయి పోలీసింగ్లోని లోపాలు, వాస్తవ పరిస్థితులు ఉన్నతస్థాయికి చేరటం లేదు. అవి రాష్ట్ర వ్యాప్త సంచలనాలుగా మారుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఇటీవల ఈ తరహాలో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్బీలో కొందరు సిబ్బంది తీరుపై ఎస్పీ మలికా గార్గ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒంగోలు తాలూకా పరిధిలో ఎస్బీ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న వెంగళరెడ్డిని తక్షణం విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వెనువెంటనే ఆ స్థానంలో మరొకరిని నియమించారు. అయితే ఎస్పీ ఆదేశాలను వెంగళరెడ్డి ధిక్కరించారు. తనకు శాఖాపరంగా కేటాయించిన అధికారిక సిమ్ను అధికారులకు అప్పగించలేదు. తన తొలగింపు విషయాన్ని నాయకులు వద్ద తేల్చుకుంటానంటూ నిరసన స్వరం వినిపించారు. ఈ పరిణామం ఇప్పుడు జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
తెలియదు.. గుర్తించలేదు.. చెప్పలేదు...
* ఒంగోలు శివారులో నేరగాళ్లు కొందరు జూన్ 19న ఘర్షణ పడ్డారు. ఓ గిరిజన యువకుడి పట్ల పైశాచికంగా వ్యవహరించారు. వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో మద్యం తాగుదామని తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడిచేశారు. అంతటితో ఆగకుండా నోట్లో మూత్రం పోశారు. ఈ మొత్తం తతంగాన్ని వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈ వైనాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇంత జరుగుతున్నా ఈ విషయాన్ని ఎస్బీ గుర్తించలేకపోయింది.
* ఒంగోలులో బీసీ వర్గానికి చెందిన పదిహేనేళ్ల బాలిక అదృశ్యమైంది. ఆమె అదృశ్యంపై కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినా ఆచూకీ కోసం పెద్దగా ప్రయత్నించలేదు. పదిహేను రోజులపాటు ఆమెను తన ఇంట్లోనే ఉంచుకున్న యువకుడు చివరకు తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలే వరకు పోలీసులు గుర్తించలేకపోయారు. ఈ కేసులో ఏం జరుగుతుందనే విషయాన్ని సైతం ఎస్బీ సిబ్బంది ఉన్నతాధికారులకు నివేదించలేదు.
* మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు కుండా భాస్కర్రెడ్డి వద్ద పీఏగా పనిచేసిన ఓ వ్యక్తిని ఆర్థిక అవకతవకల ఆరోపణలపై మద్దిపాడులో పోలీసులు నిర్బంధించి విచారించారు. అనంతరం అతన్ని ఒంగోలు తాలూకా స్టేషన్కు తీసుకొచ్చి విశాఖకు తరలించే ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తి కుటుంబీకులు, బంధువులు ప్రతిఘటించారు. అర్ధరాత్రి వేళ పోలీసు స్టేషన్ ఎదుట పెట్రోల్ సీసాలతో ఆందోళన చేశారు. అక్కడ ఏం జరిగిందనే విషయం తెల్లారిన తర్వాత పత్రికల్లో వార్తలు చూస్తే తప్ప ఉన్నతాధికారులకు తెలియకుంది.
* కర్రపెత్తనం పైనే మక్కువ...: ఎస్బీలో పోస్టింగ్ కొందరికి ఒక క్రేజ్గా మారింది. యూనిఫాం వేయాల్సిన పనిలేదు. బందోబస్తులు, రాత్రి విధులుండవు. ప్రతి విషయాన్నీ నేరుగా జిల్లా ఉన్నతాధికారులతో నివేదించగల సౌలభ్యం ఉంటుంది. దీంతో సహజంగానే ఎస్హెచ్వోలు ఎస్బీ సిబ్బంది పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ప్రత్యేక గౌరవమూ దక్కుతుంది. ఇదే అదనుగా కొందరు ఎస్బీ సిబ్బంది స్టేషన్లలో క్షేత్రస్థాయి సిబ్బందిపై కర్రపెత్తనం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అసలు పనిని పక్కనబెట్టి డాబూదర్పం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు సైతం కొందరు ఎదుర్కొంటున్నారు. ఎస్బీ విధుల్లో పాస్పోర్టు పరిశీలన ప్రధానం. ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. చివరకు ఈ విధులను సైతం కొందరు ఇతరులకు కాంట్రాక్టుకు అప్పగిస్తూ తమ వ్యక్తిగత పనులను చక్కబెట్టుకుంటున్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
* హెడ్ కానిస్టేబుల్పై వేటు...: జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్లు తీవ్రంగా పరిగణించాయి. ఉన్నతాధికారులకు సైతం ఈ పరిణామాలు ఇబ్బందిగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో ఎస్బీలో కొందరు సిబ్బంది పనితీరుపై జిల్లా ఎస్పీ మలికా గార్గ్ తీవ్రస్థాయిలో ఆగ్రహించినట్లు సమాచారం. ప్రత్యేకించి ఒంగోలు తాలూకా పరిధిలో ముందస్తు సమాచార సేకరణలో విఫలమైన హెడ్ కానిస్టేబుల్ వెంగళరెడ్డిని విధుల నుంచి తప్పించారు. ఆయన తక్షణం చీమకుర్తి స్టేషన్లో రిపోర్టు చేయాలని ఆదేశించి ఆ స్థానంలో వేరొకరికి బాధ్యతలు అప్పగించారు. ఎస్పీ ఆదేశించినప్పటికీ హెడ్ కానిస్టేబుల్ వెంగళరెడ్డి తన అధికారిక సిమ్ కార్డును అధికారులకు అప్పగించలేదు. తనను బాధ్యతల నుంచి ఎలా తప్పిస్తారని, ఈ విషయాన్ని నాయకుల వద్దే తేల్చుకుంటానని చెబుతున్నట్టు సమాచారం. అప్పటి వరకు సిమ్కార్డు అప్పగించే ప్రసక్తే లేదని భీష్మించినట్లు తెలిసింది. ఈ పరిణామాలు చర్చకు దారి తీశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టాలి
[ 26-07-2024]
ప్రతి గ్రామంలో సంపూర్ణంగా పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఒంగోలు డివిజన్ పంచాయతీల అధికారి పద్మ ఆదేశించారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట దొంగల హల్చల్
[ 26-07-2024]
మార్కాపురంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక గడియార స్తంభం వద్ద ఉన్న పూల దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. -
అంజి.. అందినంత గుంజి
[ 26-07-2024]
ఉన్నత చదువులు.. పరిశోధనలకు నిలయం కావాల్సిన చోటును అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చారు. విద్యార్థుల కలలు.. వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన వారు బాధ్యత విస్మరించారు. అభివృద్ధి ఊసే మరిచి జేబులు నింపుకొనేందుకు తహతహలాడారు. -
అవినీతితో చేసుకోవాలట ఒప్పందం
[ 26-07-2024]
వలసలు అరికట్టేందుకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. మార్కాపురంలో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కార్యాలయంలో పని చేస్తున్న కొందరు అధికారులు ప్రతి పనిలో జేబులు నింపుకొంటున్నారు. ఇదే అదునుగా కిందిస్థాయి సిబ్బంది కూడా చెలరేగిపోతున్నారు. -
సమస్యల పరిష్కారానికే క్షేత్రస్థాయి పర్యటన
[ 26-07-2024]
జిల్లాలోని గిరిజన గూడేల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిచేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో ఆమె గురువారం పర్యటించారు. -
మహిళల భద్రతకు పెద్దపీట
[ 26-07-2024]
‘మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తాం. వేధింపులకు పాల్పడితే ఎవరినీ వదలం. బాధితులకు అన్ని విధాలా రక్షణ కల్పించి అండగా నిలుస్తాం. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం’ అని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. -
ఎప్పుడు దిగునో విమానం
[ 26-07-2024]
దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రన్వేలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో సంకల్పించింది. జాతీయ రహదారిపై మూడు కిలో మీటర్లకంటే ఎక్కువ దూరం ఎలాంటి వంతెనలు, అంతగా మలుపులు లేని.. వాహనాల మళ్లింపునకు ఇతర మార్గాలున్న ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసింది. -
పోటీకి పనికిరాని పుస్తకాలు
[ 26-07-2024]
ఎన్నికల హామీ మేరకు తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో గ్రంథాలయాలకు నిరుద్యోగ యువత నుంచి తాకిడి పెరిగింది. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రకటనలు వస్తాయనే ఆశతో ఇతర పోటీ పరీక్షలకూ పలువురు సన్నద్ధమవుతున్నారు. -
అసమాన శక్తి.. నర నరాన దేశభక్తి
[ 26-07-2024]
ఎందరో ముద్దుబిడ్డల్ని దేశానికి అందించిన పౌరుషాల గడ్డ ప్రకాశం. ఎముకలు కొరికే చలిలోనూ శత్రు సైన్యాలను చీల్చి చెండాడుతూ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన యోధులు ఎందరో ! అత్యున్నత శౌర్యచక్ర మొదలు పలు పురస్కారాలందుకుని వారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. -
ప్రకాశం ప్రగతితోనే రాష్ట్ర వికాసం
[ 26-07-2024]
వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం ప్రాంతాన్ని చేర్చడంతో ఇక్కడ ప్రగతి వికసిస్తుందని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆ కుటుంబం ఉపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చింది.. ఏడాది కిందట అనారోగ్యంతో కుటుంబ పెద్ద మృతిచెందగా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.. తీవ్ర మనో వేదనతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన