జగనన్నా.. పేదలంటే ఎందుకంత పగ..!
ఉపాధి కూలీలు ఎండలకు అల్లాడిపోతున్నారు. పని ప్రదేశాల్లో కనీస వసతులు లేక తల్లడిల్లుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ సొమ్మ పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలపై చిన్న చూపు చూస్తోంది.
పని ప్రాంతంలో వసతులు కరవు
ఎండలకు తాళలేక పోతున్న కూలీలు
కంభం, అర్థవీడు, త్రిపురాంతకం, న్యూస్టుడే
కాకర్ల గ్రామంలో ఉపాధి పని వద్ద సృహ తప్పి పడిపోయిన మహిళకు సపర్యలు చేస్తున్న తోటి కూలీలు
ఉపాధి కూలీలు ఎండలకు అల్లాడిపోతున్నారు. పని ప్రదేశాల్లో కనీస వసతులు లేక తల్లడిల్లుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ సొమ్మ పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలపై చిన్న చూపు చూస్తోంది. పని ప్రదేశాల్లో ప్రథమ చికిత్స పెట్టెలు కానీ..నీడ వసతి కానీ కల్పించ లేక పోయింది. పేరుకు ప్రజల ప్రభుత్వమని..నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలంటూ ప్రతి సభలో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప...పనికి వెళ్లేది పేదలన్న సంగతి జగనన్న మరిచారు.
వేసవి వచ్చిందంటే గ్రామాల్లో పనులు ఉండవు. ఉపాధి హామీ పనులే ఆధారం. ప్రస్తుతం రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఉపాధి పనులు చేసే కూలీలకు పని ప్రదేశంలో కనీస వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భోజనం చేసి, కొంత సమయం సేద తీరేందుకు నీడ కరవవుతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స పెట్టెలు అందుబాటులో లేవు. తాగేందుకు మంచినీరు సైతం ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లమల్ల అటవీ పరిధి గ్రామాల్లో సగటున పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైనే ఉండటంతో ఉపాధి హామీ పని ప్రమాదాలకు నెలవుగా మారాయి.
అప్పుడు అలా..: తెలుగుదేశం హయాంలో పట్టాలు సరఫరా చేశారు. ప్రథమ చికిత్స పెట్టెలు అందుబాటులో పెట్టారు. కూలీలకు మజ్జిగ ఇచ్చారు. గడ్డపార సరఫరా చేశారు. కూలీలే నీళ్లు తెచ్చుకున్నందుకు ఒక్కో వ్యక్తికి రూ.5, తట్టకు రూ.3 అందజేశారు. వేసవి అలవెన్స్ కింద ఫిబ్రవరి నెలకు రూ.20, మార్చి 25, ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం చొప్పున అలవెన్స్ ఇచ్చే వారు. మేట్లకు అలవెన్స్ ఇచ్చేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పట్టాలు, నీళ్లు, మజ్జిగ, ప్రథమ చికిత్స పెట్టెలు, గడ్డపార వంటివి ఇవ్వలేదు.
వేతనం జమకాలేదు
త్రిపురాంతకం మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి పనులకు సంబంధించి పనికి తగిన వేతనం జమకాలేదని ఉపాధి కూలీలు శుక్రవారం స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మండల కేంద్రానికి చెందిన ఓ గ్రూపు వారం రోజులు పనికి వెళ్లారని అయితే వారికి కేవలం రూ.220లు మాత్రమే జమ అయ్యాయని ఏపీవో సుజాతను కలిసి తమ సమస్యను వివరించారు.
ఇదీ పరిస్థితి
పశ్చిమ ప్రకాశం రాచర్ల మండలం అనుములపల్లిలో గురువారం ఉపాధి పనికి వెళ్లిన ఆంజనేయులు గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. అర్థవీడు మండలం కాకర్ల గ్రామంలోనూ బాలమ్మ అనే మహిళ ఉపాధి పని చేస్తుండగా ఎండకు తాళలేక సృహ తప్పి పడిపోయింది. పని ప్రదేశంలో ఎటువంటి ప్రథమ చికిత్స వసతులు లేకపోవడంతో హుటాహుటిన కంభం ప్రభుత్వ వైద్యశాలకు ఆటోలో తరలించారు.
జిల్లాలో పని చేస్తున్న కుటుంబాలు : 3.06 లక్షలు
పని చేస్తున్న కూలీలు : 5.36 లక్షలు
ప్రభుత్వం ఇచ్చిన జాబ్ కార్డులు : 4.35 లక్షలు
నీడ కరవు
తెలుగుదేశం హయాంలో ఉపాధి హామీ పథకంలో మెరుగైన వసతులు ఉండేవి. వైకాపా వచ్చిన తర్వాత పని ప్రదేశంలో కనీసం నీడ కరవైంది. గతంలో నీడ కోసం పట్టాలు ఇచ్చేవారు. వాటి కింద కూర్చొని భోజనాలు చేసి, కొంత సమయం సేద తీరేవాళ్లం. పనిచేసే సమయంలో దెబ్బలు తగలితే ప్రథమ చికిత్స పెట్టెలు మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద ఉండేవి, ఈ అయిదేళ్లలో వాటి ఊసే లేదు. అప్పట్లో మంచినీరుకు సైతం డబ్బులు ఇచ్చే వారు. ఎండలు ఎక్కువగా ఉండే మజ్జిగ ఇచ్చేవారు, ఇతర అలవెన్సులు ఉండేవి. వైకాపా పాలనలో అన్నీ తీసేశారు. పని చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
నందిగం శేషగిరిరావు, ఉపాధి కూలీ, కలగొట్ల, బేస్తవారపేట మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టాలి
[ 26-07-2024]
ప్రతి గ్రామంలో సంపూర్ణంగా పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ఒంగోలు డివిజన్ పంచాయతీల అధికారి పద్మ ఆదేశించారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట దొంగల హల్చల్
[ 26-07-2024]
మార్కాపురంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. స్థానిక గడియార స్తంభం వద్ద ఉన్న పూల దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. -
అంజి.. అందినంత గుంజి
[ 26-07-2024]
ఉన్నత చదువులు.. పరిశోధనలకు నిలయం కావాల్సిన చోటును అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చారు. విద్యార్థుల కలలు.. వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన వారు బాధ్యత విస్మరించారు. అభివృద్ధి ఊసే మరిచి జేబులు నింపుకొనేందుకు తహతహలాడారు. -
అవినీతితో చేసుకోవాలట ఒప్పందం
[ 26-07-2024]
వలసలు అరికట్టేందుకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. మార్కాపురంలో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కార్యాలయంలో పని చేస్తున్న కొందరు అధికారులు ప్రతి పనిలో జేబులు నింపుకొంటున్నారు. ఇదే అదునుగా కిందిస్థాయి సిబ్బంది కూడా చెలరేగిపోతున్నారు. -
సమస్యల పరిష్కారానికే క్షేత్రస్థాయి పర్యటన
[ 26-07-2024]
జిల్లాలోని గిరిజన గూడేల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిచేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో ఆమె గురువారం పర్యటించారు. -
మహిళల భద్రతకు పెద్దపీట
[ 26-07-2024]
‘మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తాం. వేధింపులకు పాల్పడితే ఎవరినీ వదలం. బాధితులకు అన్ని విధాలా రక్షణ కల్పించి అండగా నిలుస్తాం. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం’ అని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. -
ఎప్పుడు దిగునో విమానం
[ 26-07-2024]
దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రన్వేలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో సంకల్పించింది. జాతీయ రహదారిపై మూడు కిలో మీటర్లకంటే ఎక్కువ దూరం ఎలాంటి వంతెనలు, అంతగా మలుపులు లేని.. వాహనాల మళ్లింపునకు ఇతర మార్గాలున్న ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసింది. -
పోటీకి పనికిరాని పుస్తకాలు
[ 26-07-2024]
ఎన్నికల హామీ మేరకు తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో గ్రంథాలయాలకు నిరుద్యోగ యువత నుంచి తాకిడి పెరిగింది. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రకటనలు వస్తాయనే ఆశతో ఇతర పోటీ పరీక్షలకూ పలువురు సన్నద్ధమవుతున్నారు. -
అసమాన శక్తి.. నర నరాన దేశభక్తి
[ 26-07-2024]
ఎందరో ముద్దుబిడ్డల్ని దేశానికి అందించిన పౌరుషాల గడ్డ ప్రకాశం. ఎముకలు కొరికే చలిలోనూ శత్రు సైన్యాలను చీల్చి చెండాడుతూ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన యోధులు ఎందరో ! అత్యున్నత శౌర్యచక్ర మొదలు పలు పురస్కారాలందుకుని వారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. -
ప్రకాశం ప్రగతితోనే రాష్ట్ర వికాసం
[ 26-07-2024]
వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం ప్రాంతాన్ని చేర్చడంతో ఇక్కడ ప్రగతి వికసిస్తుందని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆ కుటుంబం ఉపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చింది.. ఏడాది కిందట అనారోగ్యంతో కుటుంబ పెద్ద మృతిచెందగా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.. తీవ్ర మనో వేదనతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM