logo

ఐటీ.. తెదేపా కూటమికి బలిమి

బెంగళూరుకు చెందిన తెదేపా ఐటీ ఫోరం సభ్యులు ఎన్డీఏ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి మద్దతు తెలిపారు. లక్ష్మితో పాటు ఆమె భర్త లలిత్‌సాగర్‌తో శుక్రవారం పట్టణంలో చేపట్టిన ప్రచారంలో పాల్గొన్నారు.

Published : 13 Apr 2024 02:18 IST

దర్శిలో గొట్టిపాటి లక్ష్మికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న బెంగళూరు ఐటీ ఫోరం సభ్యులు, యువత

బెంగళూరుకు చెందిన తెదేపా ఐటీ ఫోరం సభ్యులు ఎన్డీఏ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి మద్దతు తెలిపారు. లక్ష్మితో పాటు ఆమె భర్త లలిత్‌సాగర్‌తో శుక్రవారం పట్టణంలో చేపట్టిన ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ప్రస్తుతం బెంగళూరులో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా ఓ ఫోరంగా ఏర్పడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం తెదేపాకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి, రాజధాని అమరావతి నిర్మాణం, కల్తీ మద్యం నిషేధం, యువతకు ఉద్యోగావకాశాలు వంటివి నెరవేరాలంటే తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడే సీఎం అవ్వాలని వారు ఆకాంక్షించారు.

న్యూస్‌టుడే, దర్శి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని