ప్రలోభ పెట్టినా ‘చెవి’లో పువ్వే!.. సహకరించని సొంత పార్టీ నేతలు
ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి పోలింగ్కు ముందు రోజు వరకు ఆ అభ్యర్థి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. విశ్రాంత పోలీసు అధికారులు, పొరుగు జిల్లాల నుంచి రప్పించుకున్న వ్యక్తులతో సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రతి సచివాలయం పరిధిలోనూ ఒకరిని నియమించుకుని వారితో మంత్రాంగం నడిపారు.
పార్లమెంట్ స్థానంలో క్రాస్ ఓటింగ్
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి పోలింగ్కు ముందు రోజు వరకు ఆ అభ్యర్థి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. విశ్రాంత పోలీసు అధికారులు, పొరుగు జిల్లాల నుంచి రప్పించుకున్న వ్యక్తులతో సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రతి సచివాలయం పరిధిలోనూ ఒకరిని నియమించుకుని వారితో మంత్రాంగం నడిపారు. అయినప్పటికీ ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సదరు అభ్యర్థికి ఎన్నికల్లో సొంత పార్టీ శ్రేణులు, నేతలే సహకరించలేదని తెలుస్తోంది. ప్రధానంగా రెండు ప్రధాన పార్టీల మధ్య పోరు సాగింది. ఎన్టీఏ కూటమి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మొదటి నుంచీ జోరు కొనసాగించారు. గత ఎన్నికల్లో ఆయన వైకాపా తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆయన సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచీ ఆ కుటుంబం ఒంగోలును అంటిపెట్టుకునే ఉంది. సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ కూడా రెండు ఎన్నికల్లో పోటీ చేయగా, తర్వాత శ్రీనివాసరెడ్డి బరిలో నిలుస్తూ వస్తున్నారు. జిల్లాలో తనకంటూ సొంత వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. వైకాపాలో తనకు ఎదురవుతున్న అవమానాలు భరించలేక.. ఆత్మాభిమాన్ని చంపుకోలేక ఆ పార్టీని వీడి తెదేపాలో చేరారు. దీంతో ఒంగోలులో అత్యధికులు, కనిగిరి, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో వైకాపా నుంచి పలువురు ఆయన వెంటే పార్టీ మారారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్థానికేతరుడు కావడం.. ఇప్పటివరకు జిల్లాతో ఎలాంటి అనుబంధం లేకపోదు. అయినప్పటికీ సొంత ప్రైవేట్ సైన్యంతో ఓటర్లను ప్రలోభాల్లో ముంచి రాజకీయం చేయాలని వ్యూహరచన చేశారు. ఇది ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా రుచించలేదు. ఆయన్ను నమ్ముకుంటే తమ ఓట్లకూ గండి పడుతుందని భావించారు. దీంతో ఒక ఓటు ఎంపీ మాగుంటకు.. మరొకటి మాకు వేయాలంటూ పరోక్షంగా ప్రచారం చేసుకున్నారు. ఈ పరిణామాలన్నీ క్రాస్ ఓటింగ్కు దారి తీయనున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం