ఇచ్ఛాపురం టు అరకు
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ జాతీయ రహదారుల విస్తరణ జరుగుతోంది. పాచిపెంట మండలంలో గ్రీన్ఫీల్డ్ రహదారి, రాజమహేంద్రవరం నుంచి అరకు మీదుగా విజయనగరాన్ని అనుసంధానం చేసేలా ఎన్హెచ్ 516ఈ రూపుదిద్దుకొంటున్నాయి.
వయా పార్వతీపురం
కొత్తగా జాతీయ రహదారికి ప్రతిపాదనలు
ప్రతిపాదిత రహదారి పటం
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ జాతీయ రహదారుల విస్తరణ జరుగుతోంది. పాచిపెంట మండలంలో గ్రీన్ఫీల్డ్ రహదారి, రాజమహేంద్రవరం నుంచి అరకు మీదుగా విజయనగరాన్ని అనుసంధానం చేసేలా ఎన్హెచ్ 516ఈ రూపుదిద్దుకొంటున్నాయి. వీటితో పాటు అరకు నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారి ఏర్పాటు చేస్తే గిరిజన ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుందనేది ప్రతిపాదన ఉద్దేశం.
నాలుగు ఎన్హెచ్లతో కలయిక..
ఇచ్ఛాపురం, మందస, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరు, బత్తిలి, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్వతీపురం, మక్కువ, సాలూరు, లోతేరు, అరకు వరకు రోడ్డు ప్రతిపాదించారు. ఇది సాలూరు వద్ద విశాఖ-రాయ్పూర్ (ఎన్హెచ్ 26), కొత్తగా నిర్మితమవుతున్న సబ్బవరం-రాయ్పూర్ (ఎన్హెచ్ 130సీడీ), ఇచ్ఛాపురం వద్ద చెన్నై-కోల్కతా (ఎన్హెచ్26), అరకు వద్ద విజయనగరం-రాజమహేంద్రవరం రహదారికి అనుసంధానం అయ్యేలా ప్రణాళిక రూపొందించారు.
ఎకో టూరిజానికి వెన్నుదన్ను
ఈ రహదారి సాకారమైతే 560 కిలోమీటర్ల పొడవున పర్యాటక రంగానికి ఆలవాలంగా నిలుస్తుంది. బీ మందస, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, అరకు, లంబసింగి, మారేడుమిల్లి, రంపచోడవరం, పోలవరం, రాజమహేంద్రవరం వరకు పర్యాటక క్లస్టరుగా మారనుంది. బీ ఇప్పటికే 320 కిలోమీటర్ల మేర జాతీయ, గ్రీన్ఫీల్డ్ రహదారుల పనులు జరుగుతున్న నేపథ్యంలో మరో 240 కిలోమీటర్ల మేర నిర్మిస్తే సరిపోతుంది.
ఉపాధి అవకాశాలు
ఇచ్ఛాపురం నుంచి అరకు వరకు జాతీయ రహదారి ఏర్పాటుకు, ఎకో టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించాం. ఇవి అమలైతే మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. గిరిజన ఉత్పత్తులను ఒడిశా, పశ్చిమబంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని మార్కెట్కు తరలించే అవకాశం కలుగుతుంది.
- నారాయణరావు, మన్యం జిల్లా పర్యాటక శాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్ల విధ్వంసానికి నిదర్శనం
[ 26-07-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో కొండలను పిండి చేసేశారు.. సహజ వనరులను అడ్డగోలుగా దోచుకున్నారు.. అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా కొల్లగొట్టేశారు.. అధికార అండతో నేతలు చెలరేగిపోయారు. -
మూడు రాజధానుల పేరుతో మాయచేశారు
[ 26-07-2024]
‘అమరావతిని రాజధాని చేయాలనే లక్ష్యంతో చంద్రబాబునాయుడు రైతుల్ని ఒప్పించి భూములు సేకరించారు. -
కొత్తవి లేవు.. పాతవి పనికిరావు..!
[ 26-07-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా ఉద్యోగ ప్రకటనలు వెలువరిస్తున్నా అందుకు తగినట్లుగా నిరుద్యోగులకు సదుపాయాల కల్పనలో పౌర గ్రంథాలయశాఖాధికారులు విఫలమవుతున్నారు. -
జిల్లా విద్యాశిక్షణ సంస్థకు మహర్దశ
[ 26-07-2024]
జిల్లా విద్యాశిక్షణ సంస్థ(డైట్) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) కింద ఉపాధ్యాయ విద్య బలోపేతానికి చర్యలు చేపడుతోంది. -
బీపీసీఎల్ ఏర్పాటుకు కసరత్తు
[ 26-07-2024]
జిల్లా అభివృద్ధికి సమగ్ర కసరత్తు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఈనెల 19న టెక్కలిలో ప్రకటించారు. -
41 మంది తహసీల్దార్ల బదిలీ
[ 26-07-2024]
సార్వత్రిక ఎన్నికల ముందు ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన తహసీల్దార్లు తిరిగి సొంత జిల్లాలకు వెళ్తున్నారు. -
వాలంటీరు త్రిపాత్రాభినయం..!
[ 26-07-2024]
‘గ్రామ వాలంటీరును ప్రభుత్వం తరఫున హాకీ శిక్షకుడిగా ఎలా కొనసాగిస్తారు’ అని చాపురం గ్రామానికి చెందిన అల్లు లక్ష్మణరావు ఇటీవల కలెక్టర్ నిర్వహించిన ‘మీకోసం ప్రజా పరిష్కార వేదిక’లో ఫిర్యాధు చేశారు. -
వీరులారా వందనం..!
[ 26-07-2024]
దొడ్డిదారిన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్ సైనికులకు మన దేశ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపింది. ‘ఆపరేషన్ విజయ్’ పేరిట కార్గిల్ నుంచి పాకిస్థాన్ చొరబాటుదారులపై యుద్ధభేరి మోగించింది. -
విద్యార్థినికి తీవ్ర గాయాలు
[ 26-07-2024]
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని తీవ్రంగా గాయపడిన ఘటన శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో గురువారం జరిగింది. -
గజదొంగ అరెస్టు
[ 26-07-2024]
జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ యోగేశ్ గౌతం తెలిపారు. -
సర్వజనాసుపత్రిలో కుని శస్త్రచికిత్స అనంతరం మహిళ మృతి
[ 26-07-2024]
శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న మహిళ కొన్ని గంటల తర్వాత మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్