Kushboo: నటి ఖుష్బూపై ఫిర్యాదు
సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూపై అట్రాసిటీ చట్టం కింద చర్యలు చేపట్టాలని వీసీకే తరఫున పోలీసు కమిషనరు కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల క్రితం సినీ నటి త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే.
![](https://assets.eenadu.net/article_img/241123kushbu-inner.jpg)
ప్యారిస్, న్యూస్టుడే: సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూపై అట్రాసిటీ చట్టం కింద చర్యలు చేపట్టాలని వీసీకే తరఫున పోలీసు కమిషనరు కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల క్రితం సినీ నటి త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఖుష్బూ తన ట్విట్టర్ (ఎక్స్)లో ఓ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘మీలా లోకల్ భాషలో మాట్లాడలేన’ని తెలిపారు. దీనిపై పలు దళిత వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో దళితులు మాట్లాడే భాషను తక్కువగా చేసి కించపరిచారని, ఖుష్బూపై అట్రాసిటీ చట్టం కింద చర్యలు చేపట్టాలని పోలీసు కమిషనరు కార్యాలయంలో వీసీకే నేతలు ఫిర్యాదు చేశారు.
క్షమాపణ చెప్పాలి..
చెన్నై, న్యూస్టుడే: ఎస్సీలను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ట్వీట్ చేశారని, అందుకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రంజన్ కుమార్ తెలిపారు. సత్యమూర్తిభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. త్రిష వ్యవహారంలో చర్యలు చేపట్టాలని ఆసక్తి చూపుతున్న ఖుష్బూ.. మణిపుర్ మహిళలపై అరాచకాల సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు తొలగించి బహిరంగ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. లేదంటే ఖుష్బూ ఇంటిని ముట్టడిస్తామన్నారు.
ఇంటి వద్ద భద్రత
ఖుష్బూ వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున శుక్రవారం సాయంత్రం ఆమె ఇంటిని ముట్టడించి ఆందోళన చేపట్టనున్నట్లు సమాచారం వెలువడింది. దీంతో చెన్నై శాంథోంలోని ఆమె ఇంటి వద్ద ఇన్స్పెక్టరు నేతృత్వంలో ఇద్దరు ఎస్సైలు, 33 మంది మహిళా పోలీసులు భద్రతా విధులు చేపట్టారు. అయితే ముట్టడి వాయిదా పడటంతో ఖుష్బూ ఇంటికి కల్పించిన భద్రతను వెనక్కి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
భద్రతా విధుల్లో పోలీసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెట్రో రెండో దశ నిర్వహణ ప్రైవేట్కు
[ 26-07-2024]
చెన్నై నగరవ్యాప్తంగా మూడు వేర్వేరు మార్గాల నుంచి మెట్రో రెండోదశ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. -
బాధ్యతను గుర్తిస్తేనే ప్రజాప్రతినిధికి గౌరవం
[ 26-07-2024]
చట్టసభలపై యువతకు గౌరవం పెరిగేలా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. -
సీఎంతో యూఏఈ వాణిజ్యశాఖ మంత్రి భేటీ
[ 26-07-2024]
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాణిజ్యశాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్మరి గురువారం ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అయ్యారు. -
వందేభారత్ రైళ్లకు కోచ్లు సిద్ధం
[ 26-07-2024]
వందేభారత్ రైళ్ల కోచ్లు చెన్నై పెరంబూరులోని ఐసీఎఫ్లో తయారు చేసి పలు మార్గాల్లో నడుపుతున్నారు. -
రాష్ట్రంలో నిఫా వైరస్ ప్రభావం లేదు
[ 26-07-2024]
రాష్ట్రంలో నిఫా వైరస్ ప్రభావంలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ తెలిపారు. -
‘ఎల్ఐకే’ ఫస్ట్లుక్ పోస్టరు విడుదల
[ 26-07-2024]
విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఎల్ఐకే’. -
బంగారం స్వాధీనం
[ 26-07-2024]
అక్రమంగా తరలిస్తున్న బంగారు నాణేలు, ఇ సిగరెట్లను విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు