గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది.
ప్యారిస్, న్యూస్టుడే: పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. ఇళయరాజా 4,500 పాటలు ఉపయోగించుకునేందుకు ఎకో, ఏఐజీ తదితర సంగీత సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ముగిసిన తర్వాత కూడా కాపీరైట్ పొందకుండా తన పాటలు ఉపయోగిస్తున్నారని ఇళయరాజా పిటిషన్ వేశారు. విచారించిన సింగిల్ జడ్జి.. నిర్మాత వద్ద హక్కు పొంది ఇళయరాజా పాటలు ఉపయోగించడానికి సంగీత సంస్థలకు అధికారం ఉందని, పాటలపై వ్యక్తిగతంగా ప్రత్యేక హక్కు ఇళయరాజాకు ఉండదని 2019లో ఉత్తర్వులు ఇచ్చారు. వాటికి వ్యతిరేకంగా ఇళయరాజా అప్పీల్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం ఇళయరాజా పాటలు ఉపయోగించుకునేందుకు సంగీత సంస్థలకు మధ్యంతర నిషేధం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
అనంతరం సినిమా కాపీరైట్ నిర్మాత వద్ద ఉందని, వారితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పాటలు ఉపయోగించడానికి అధికారం ఉందని ఎకో తరఫున అప్పీల్ చేశారు. ఇది బుధవారం విచారణకు వచ్చింది. ఎకో సంస్థ తరఫున హాజరైన లాయరు.. సంగీతం సమకూర్చినందుకు ఇళయరాజాకు నిర్మాత వేతనం ఇవ్వడంతో ఆ హక్కు నిర్మాతకు చేరుతుందని తెలిపారు. నిర్మాత వద్ద హక్కు పొందడంతో పాటలు తమకు సొంతమైనవని పేర్కొన్నారు. అందుకు ఇళయరాజా తరఫున.. సంగీతం సమకూర్చడం అనేది క్రియేటివిటీ పని అని, కాపీరైట్ చట్టం వర్తించదని తెలిపారు. జోక్యం చేసుకున్న న్యాయమూర్తులు.. లిరిక్స్ లేకపోతే పాటలు లేవన్నారు. అలాంటప్పుడు పాటలకు గీతరచయిత హక్కు కోరితే ఏమవుతుందని ప్రశ్నించారు. అనంతరం విచారణ జూన్ రెండో వారానికి వాయిదా వేశారు. పాటల విక్రయం ద్వారా ఇళయరాజా పొందిన మొత్తం ఎవరికి చెందుతుందనేది తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెట్రో రెండో దశ నిర్వహణ ప్రైవేట్కు
[ 26-07-2024]
చెన్నై నగరవ్యాప్తంగా మూడు వేర్వేరు మార్గాల నుంచి మెట్రో రెండోదశ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. -
బాధ్యతను గుర్తిస్తేనే ప్రజాప్రతినిధికి గౌరవం
[ 26-07-2024]
చట్టసభలపై యువతకు గౌరవం పెరిగేలా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. -
సీఎంతో యూఏఈ వాణిజ్యశాఖ మంత్రి భేటీ
[ 26-07-2024]
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాణిజ్యశాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్మరి గురువారం ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అయ్యారు. -
వందేభారత్ రైళ్లకు కోచ్లు సిద్ధం
[ 26-07-2024]
వందేభారత్ రైళ్ల కోచ్లు చెన్నై పెరంబూరులోని ఐసీఎఫ్లో తయారు చేసి పలు మార్గాల్లో నడుపుతున్నారు. -
రాష్ట్రంలో నిఫా వైరస్ ప్రభావం లేదు
[ 26-07-2024]
రాష్ట్రంలో నిఫా వైరస్ ప్రభావంలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ తెలిపారు. -
‘ఎల్ఐకే’ ఫస్ట్లుక్ పోస్టరు విడుదల
[ 26-07-2024]
విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఎల్ఐకే’. -
బంగారం స్వాధీనం
[ 26-07-2024]
అక్రమంగా తరలిస్తున్న బంగారు నాణేలు, ఇ సిగరెట్లను విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM