సామాజికవర్గాల ఓట్లపై గురి
వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలతో విస్తరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం అన్ని సామాజిక వర్గాలకు వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ఓటర్లు ఎప్పటికప్పుడు తీర్పులో వైవిధ్యాన్ని చూపుతూనే ఉన్నారు.
‘దక్షిణం’పై పట్టుకు అభ్యర్థుల వ్యూహాలు
వన్టౌన్, న్యూస్టుడే: వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలతో విస్తరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం అన్ని సామాజిక వర్గాలకు వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ఓటర్లు ఎప్పటికప్పుడు తీర్పులో వైవిధ్యాన్ని చూపుతూనే ఉన్నారు. ఈ ప్రాంతం 1951లో విశాఖ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండేది. కొన్నాళ్లకు విశాఖ-1 అసెంబ్లీ నియోజకవర్గంలోకి వెళ్లింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణ నియోజకవర్గంగా మారింది. ఇక్కడ మత్స్యకారులు, ముస్లింలు, బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు, కాపులు, యాదవ, ఎస్సీ, రెల్లి తదితర సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. ఏ ఒక్క సామాజిక వర్గం ఇక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేసేంత స్థాయిలో లేరు. అయినా సాధారణ ఎన్నికల్లో ప్రతి సామాజికవర్గ ఓట్లు కీలకమే. అందుకే పార్టీల అభ్యర్థుÄలు ఏ సామాజిక వర్గాన్ని తక్కువ అంచనా వేయకుండా ప్రతి ఒక్కర్ని దరిచేర్చుకొనే ప్రయత్నంలో ఉన్నారు.
వ్యూహాత్మకంగా వంశీకృష్ణ బరిలోకి..
రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు ఇప్పుడు సామాజికవర్గ ఓట్లపై గురిపెట్టారు. ఎత్తుకుపైఎత్తులు వేస్తూ ముందుకెళుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ సార్లు బ్రాహ్మణ, మత్స్యకార అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. వ్యూహాత్మకంగా కూటమి ఆయన్ను ఎన్నికల బరిలో నిలిపింది. ఆయన తన సామాజికవర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని కలుపుకుంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు. తెదేపా, భాజపా నేతలు తమ వంతు సహకారం అందిస్తున్నారు.
వాసుపల్లికి పెరుగుతున్న వ్యతిరేకత
అధికార వైకాపా తరఫున మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్కుమార్ మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇప్పటికే ఆయన మూడు సార్లు ఇక్కడ పోటీ చేసి రెండుసార్లు గెలుపొందారు. ఒకసారి ఓడిపోయారు. ప్రస్తుతం వాసుపల్లికి తన సొంత సామాజికవర్గం నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. ఇటీవల మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేతలు వాసుపల్లికి టికెట్ ఇవ్వొద్దంటూ సమావేశాలు నిర్వహించారు. పార్టీ పరంగా పలువురు కార్పొరేటర్లు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ వారిని కలుస్తూ తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పోలింగ్కు నెల రోజులు గడువు ఉన్నందున ఈలోపు అన్ని వర్గాల ఆదరణ పొందితే విజయతీరాలకు చేరుకోవచ్చని కూటమి నేతలు భావిస్తున్నారు. ఆ దిశగా వ్యూహాలకు పదును పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశ్వక్రీడా వేడుక కోటి ఆశల్లో విశాఖ
[ 26-07-2024]
ప్రపంచమంతా పారిస్లో శుక్రవారం ఆరంభమయ్యే క్రీడా సంగ్రామం ‘ఒలింపిక్స్’ వైపు చూస్తోంది. -
కోణార్క్ ఎక్స్ప్రెస్కు అదనపు జనరల్ బోగీలు
[ 26-07-2024]
ప్రయాణికుల సౌకర్యార్థం భువనేశ్వర్-ముంబయి-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్కు అదనపు జనరల్ బోగీలను జత చేయనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
చేతికి ఎముకే లేనట్టు.. అంతా కనికట్టు!!
[ 26-07-2024]
విశాఖలో గత వైకాపా ప్రభుత్వ పాలనలో ఇష్టా రాజ్యంగా టీడీఆర్లు జారీ చేశారు. అనుకున్నదే తడవుగా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేసి.. వైకాపా నేతలకు బాండ్లు కట్టబెట్టారు. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
[ 26-07-2024]
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
చురుగ్గా భారత్-యూఎస్ నేవీ విన్యాసాలు
[ 26-07-2024]
భారత్, యూఎస్ నౌకాదళాల మధ్య సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘రింపాక్-2024’ విన్యాసాలు సానుకూలంగా దోహదపడతాయని యూఎస్ కమాండర్, వైస్అడ్మిరల్ జాన్ ఎఫ్జీ వాడె అన్నారు. -
బాలికపై అత్యాచారం కేసులో 20ఏళ్ల జైలు
[ 26-07-2024]
బాలికను బలవంతంగా ఎత్తుకుపోయి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పునిచ్చారు. -
వాహన సామర్థ్యం తనిఖీ ఇక ఆటోమేటిక్..
[ 26-07-2024]
వాహన సామర్థ్యాన్ని గుర్తించే ఆటోమేటెడ్ ఫిట్నెస్ కేంద్రం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. -
వీఎంఆర్డీఏ.. ప్రక్షాళన జరిగేనా!
[ 26-07-2024]
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నగరాభివృద్ధిని మెట్రోపాలిటన్ స్థాయికి పరుగులు పెట్టించాల్సిన బాధ్యత విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ)పై ఉంది. -
వంట.. తంటా!
[ 26-07-2024]
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. -
వంతెన నిర్మించాలంటూ జలదీక్ష
[ 26-07-2024]
సరియా గెడ్డపై వంతెన నిర్మించాలని డిమాండు చేస్తూ వాలాబు పంచాయతీ బొర్రచింత గిరిజనులు వాగులో దిగి గురువారం ఆందోళన చేపట్టారు. -
ఆరోగ్యకేంద్రం స్థలం ఆక్రమణకు యత్నం
[ 26-07-2024]
రెవెన్యూ అండ చూసుకుని ప్రైవేటు వ్యక్తులు పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థలాన్ని ఆక్రమించడానికి తెగించడం స్థానికులను విస్తుపోయేలా చేసింది. -
విస్సన్నపేట భూముల్లో అక్రమాలపై చర్యలేవి?
[ 26-07-2024]
విస్సన్నపేట భూములపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి నిబంధనలు అతిక్రమించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా, జనసేన నాయకులు గురువారం డిమాండ్ చేశారు. -
సింహాద్రి ఎన్టీపీసీకి రాజభాష గౌరవ్ సమ్మాన్ అవార్డు
[ 26-07-2024]
పరవాడలోని సింహాద్రి ఎన్టీపీసీకి 2023-24 సంవత్సరానికి గాను రాజభాష గౌరవ్ సమ్మాన్ ద్వితీయ అవార్డు వరించింది. -
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్కు అంతరాయం
[ 26-07-2024]
భారీ లోడ్తో వెళ్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోవడంతో గురువారం 16వ నంబరు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!