అట్టహాసంగా శ్రీభరత్ నామినేషన్
తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత ఎం.శ్రీభరత్ సోమవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు.
మండు టెండలో భారీ ర్యాలీ
తరలివచ్చిన కూటమి నేతలు, శ్రేణులు
కలెక్టరేట్ వద్ద ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, కూటమి నాయకులు
వన్టౌన్, ఎంవీపీకాలనీ, న్యూస్టుడే: తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత ఎం.శ్రీభరత్ సోమవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. మండుటెండలో భారీ ర్యాలీగా కలెక్టరేట్కు తరలివచ్చిన ఆయన రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. ఉదయం 10గంటల సమయంలో ఎంవీపీకాలనీలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. శ్రీభరత్ తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. సతీమణి తేజస్విని, కుమారుడు ఆర్యవీర్ వెంట రాగా ర్యాలీగా ముందుకు సాగారు. ఎంవీపీ రైతుబజార్, మద్దిలపాలెం, గురుద్వారా, డాబాగార్డెన్స్, జగదాంబ కూడలి, కేజీహెచ్ మీదుగా కలెక్టరేట్కు చేరుకున్నారు.
ర్యాలీలో మాట్లాడుతున్న తేజస్విని
ర్యాలీలో దారి పొడవునా ఎక్కడికక్కడ ప్రజలు శ్రీభరత్కు ఘనంగా ఆహ్వానం పలికారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో నగరంలోని పలు ప్రాంతాలు జన జాతరను తలపింపజేశాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. తూర్పు, గాజువాక, పశ్చిమ, భీమిలి, ఎస్.కోట, ఉత్తరం, దక్షిణం కూటమి అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గణబాబు, గంటా శ్రీనివాసరావు, కోళ్ల లలితకుమారి, పి.విష్ణుకుమార్రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, ఇతర నేతలు గండి బాబ్జీ, కోన తాతారావు, రవీంద్రరెడ్డి, పీవీఎన్ మాధవ్, పసుపులేటి ఉషాకిరణ్, ప్రశాంతి, తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో శ్రీభరత్ సతీమణి తేజస్విని ప్రజలకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు.
ప్రశాంత వాతావరణానికి తూట్లు: శ్రీభరత్
నామినేషన్ అనంతరం శ్రీభరత్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అరాచక పాలనలో విశాఖలో ప్రశాంత వాతావరణానికి తూట్లు పడ్డాయన్నారు. నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. విశాఖ లాంటి నగరం నుంచి యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి రావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పోలవరం నుంచి సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని తరలిస్తామని చెప్పారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
ఎంవీపీ రోడ్లో వాహనాలపై ర్యాలీగా వచ్చిన అభిమానులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం