logo

రెండవ రోజు కొనసాగిన చందనం అరగదీత

వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈనెల 23వ తేదీన అప్పన్న స్వామికి రెండవ విడత చందన సమర్పణ జరగనుంది. ఆ మేరకు సింహగిరిపై జరుగుతున్న చందనం అరగదీత కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది.

Published : 20 May 2024 03:41 IST

ఆలయ బేడామండపంలో చందనం అరగదీస్తున్న సిబ్బంది

సింహాచలం, న్యూస్‌టుడే: వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈనెల 23వ తేదీన అప్పన్న స్వామికి రెండవ విడత చందన సమర్పణ జరగనుంది. ఆ మేరకు సింహగిరిపై జరుగుతున్న చందనం అరగదీత కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. ఆలయ బేడామండపంలోని రాతి సానలపై సిబ్బంది చందనం చెక్కలను అరగదీసి శ్రీగంధాన్ని సేకరించారు. 37 కిలోల చందనం సమకూరినట్లు ఆలయ ఏఈవో ఆనంద్‌కుమార్‌ తెలిపారు. శ్రీగంధాన్ని ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ తూకం వేసి భాండాగారంలో భద్రపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని