ఫలితాలెలా ఉన్నా సంయమనం పాటించాలి
ఎన్నికల్లో ఫలితాల తరువాత నాయకులు గెలుపోటముల్లో భావోద్వేగాలను నియంత్రించుకుని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి సహకరించాలని వివిధ పార్టీల నేతలకు ఎస్పీ మురళీకృష్ణ సూచించారు.
ఎస్.రాయవరం, న్యూస్టుడే: ఎన్నికల్లో ఫలితాల తరువాత నాయకులు గెలుపోటముల్లో భావోద్వేగాలను నియంత్రించుకుని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి సహకరించాలని వివిధ పార్టీల నేతలకు ఎస్పీ మురళీకృష్ణ సూచించారు. అడ్డురోడ్డులో శుక్రవారం పాయకరావుపేట నియోజకవర్గ రాజకీయ నాయకులకు శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు. రాజకీయ నాయకులు, ప్రజల సహకారంతో జిల్లాలో శాంతియుత వాతావరణంలో పోలింగ్ పూర్తిచేశామని తెలిపారు. లెక్కింపునకు కూడా సహకరించాలని కోరారు. ఫలితాల రోజు ర్యాలీలు, సంబరాలు, బాణసంచా కాల్చడంపై నిషేధం ఉందన్నారు. నాయకులెవరూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని ఆదేశించారు. గ్రామాల్లో నాయకులే ఈమేరకు ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. ఎన్నికల కేసుల్లో ఇరుక్కుంటే ప్రతి ఎన్నికల్లో బైండోవర్ చేయడంతోపాటు ముందుగా వారినే స్టేషన్ తరలిస్తామన్నారు. ఇప్పటికే అనధికార వాహనాలు సీజ్ చేస్తున్నట్లు వివరించారు. లెక్కింపు రోజున అనుమతి పాసులు ఉన్నవారిని లోపలికి అనుమతి ఇస్తారని, మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని తెలిపారు. జిల్లా మొత్తం బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఎస్పీ మోహన్, సీఐలు అప్పన్న, విజయ్కుమార్, ఎస్సై విభీషణరావు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
రావికమతం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఎస్పీ మురళీకృష్ణ సూచించారు. ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడే జూన్ 4, ఆ తరవాత రెండు రోజుల వరకు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు భావోద్వేగాలను నియంత్రించుకోవాలన్నారు. విద్వేషాలు, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ఘర్షణలకు దిగకుండా శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. చోడవరం నియోజకర్గంలోని నాలుగు మండలాలకు చెందిన వైకాపా, తెదేపా, జనసేన, భాజపా, ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో గర్నికంలోని కల్యాణ మండపంలో శుక్రవారం సమావేశమయ్యారు. లెక్కింపు రోజున 144 సెక్షన్, 30 పోలీస్ చట్టం అమలులో ఉంటుందన్నారు. లెక్కింపు ముగిసిన తర్వాత ఊరేగింపులు, ర్యాలీలు చేయకూడదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. డీఎస్పీ అప్పలరాజు, కొత్తకోట, చోడవరం సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాసరావు, ఎస్సైలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశ్వక్రీడా వేడుక కోటి ఆశల్లో విశాఖ
[ 26-07-2024]
ప్రపంచమంతా పారిస్లో శుక్రవారం ఆరంభమయ్యే క్రీడా సంగ్రామం ‘ఒలింపిక్స్’ వైపు చూస్తోంది. -
కోణార్క్ ఎక్స్ప్రెస్కు అదనపు జనరల్ బోగీలు
[ 26-07-2024]
ప్రయాణికుల సౌకర్యార్థం భువనేశ్వర్-ముంబయి-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్కు అదనపు జనరల్ బోగీలను జత చేయనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
చేతికి ఎముకే లేనట్టు.. అంతా కనికట్టు!!
[ 26-07-2024]
విశాఖలో గత వైకాపా ప్రభుత్వ పాలనలో ఇష్టా రాజ్యంగా టీడీఆర్లు జారీ చేశారు. అనుకున్నదే తడవుగా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేసి.. వైకాపా నేతలకు బాండ్లు కట్టబెట్టారు. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
[ 26-07-2024]
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
చురుగ్గా భారత్-యూఎస్ నేవీ విన్యాసాలు
[ 26-07-2024]
భారత్, యూఎస్ నౌకాదళాల మధ్య సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘రింపాక్-2024’ విన్యాసాలు సానుకూలంగా దోహదపడతాయని యూఎస్ కమాండర్, వైస్అడ్మిరల్ జాన్ ఎఫ్జీ వాడె అన్నారు. -
బాలికపై అత్యాచారం కేసులో 20ఏళ్ల జైలు
[ 26-07-2024]
బాలికను బలవంతంగా ఎత్తుకుపోయి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పునిచ్చారు. -
వాహన సామర్థ్యం తనిఖీ ఇక ఆటోమేటిక్..
[ 26-07-2024]
వాహన సామర్థ్యాన్ని గుర్తించే ఆటోమేటెడ్ ఫిట్నెస్ కేంద్రం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. -
వీఎంఆర్డీఏ.. ప్రక్షాళన జరిగేనా!
[ 26-07-2024]
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నగరాభివృద్ధిని మెట్రోపాలిటన్ స్థాయికి పరుగులు పెట్టించాల్సిన బాధ్యత విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ)పై ఉంది. -
వంట.. తంటా!
[ 26-07-2024]
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. -
వంతెన నిర్మించాలంటూ జలదీక్ష
[ 26-07-2024]
సరియా గెడ్డపై వంతెన నిర్మించాలని డిమాండు చేస్తూ వాలాబు పంచాయతీ బొర్రచింత గిరిజనులు వాగులో దిగి గురువారం ఆందోళన చేపట్టారు. -
ఆరోగ్యకేంద్రం స్థలం ఆక్రమణకు యత్నం
[ 26-07-2024]
రెవెన్యూ అండ చూసుకుని ప్రైవేటు వ్యక్తులు పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థలాన్ని ఆక్రమించడానికి తెగించడం స్థానికులను విస్తుపోయేలా చేసింది. -
విస్సన్నపేట భూముల్లో అక్రమాలపై చర్యలేవి?
[ 26-07-2024]
విస్సన్నపేట భూములపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి నిబంధనలు అతిక్రమించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా, జనసేన నాయకులు గురువారం డిమాండ్ చేశారు. -
సింహాద్రి ఎన్టీపీసీకి రాజభాష గౌరవ్ సమ్మాన్ అవార్డు
[ 26-07-2024]
పరవాడలోని సింహాద్రి ఎన్టీపీసీకి 2023-24 సంవత్సరానికి గాను రాజభాష గౌరవ్ సమ్మాన్ ద్వితీయ అవార్డు వరించింది. -
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్కు అంతరాయం
[ 26-07-2024]
భారీ లోడ్తో వెళ్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోవడంతో గురువారం 16వ నంబరు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు