కేజీహెచ్కు నకిలీ నియామకపత్రాల బెడద
కేజీహెచ్కు నకిలీ నియామక పత్రాల బెడద తప్పడం లేదు. కొద్ది రోజుల క్రితం నకిలీ నియామకపత్రాలతో ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన ఇద్దరిని ఆసుపత్రి వర్గాలు పట్టుకొని వన్టౌన్ పోలీసులకు అప్పగించారు
తాజాగా మరొకటి రాక
వన్టౌన్, న్యూస్టుడే: కేజీహెచ్కు నకిలీ నియామక పత్రాల బెడద తప్పడం లేదు. కొద్ది రోజుల క్రితం నకిలీ నియామకపత్రాలతో ఆసుపత్రిలో చేరేందుకు వచ్చిన ఇద్దరిని ఆసుపత్రి వర్గాలు పట్టుకొని వన్టౌన్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ కొనసాగుతుండగానే శుక్రవారం తపాలాశాఖ ద్వారా మరో నకిలీ ఆర్డరు ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి కార్యాలయానికి చేరింది. ఈ పత్రాన్ని పరిశీలించిన ఆసుపత్రి మేనేజరు శర్మ నకిలీగా గుర్తించి సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయానికి పంపారు. పి.సుధామాధురి అనే మహిళను పొరుగుసేవల కింద కేజీహెచ్ ఎన్బీఎస్యూలో స్టాఫ్ నర్సుగా నియామకం చేసినట్లు ఆర్డరు కాపీలో ఉంది. కేజీహెచ్లో ఎన్ఎస్బీయూ విభాగమే లేదు. స్పెషల్ నియోనెటాల్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ) మాత్రమే ఉంది. పొరుగు సేవల కింద నియమితులయ్యే అభ్యర్థులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కేటాయిస్తే కేజీహెచ్ వైద్యాధికారులు పోస్టింగ్లు ఇస్తారు. ఇందుకు భిన్నంగా సుధామాధురి నియామక ఆర్డరు వచ్చింది. దీంతో కేజీహెచ్ అధికారులు అప్రమత్తమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ అధికారులను సంప్రదించారు. ఆర్డరు కాపీలో ఉన్న సంతకాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులవి కావని నిర్ధారించారు.
ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున నర్సులు, పారామెడికల్ సిబ్బందిని పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగులుగా నియమిస్తున్నారు. ఆయా నియామకాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం పర్యవేక్షిస్తోంది. కొద్దిరోజుల క్రితం కేజీహెచ్ వైద్యాధికారుల సంతకాలను తారుమారు చేసి నకిలీ పత్రాలతో ఉద్యోగాల కోసం వస్తే, ఇప్పుడు జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం పేరుతో రావడం ఆరోగ్యశాఖలో కలకలం రేపుతోంది. కొంత మంది నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.లక్షల్లో అభ్యర్థుల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఇటువంటి వ్యవహారాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, కేజీహెచ్ అధికారులు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసుశాఖ త్వరగా విచారణ జరిపి నకిలీ ఆర్డర్లు సృష్టిస్తున్న వారి గుట్టురట్టు చేయాల్సి ఉంది. పదుల సంఖ్యలో అభ్యర్థులు దళారులను ఆశ్రయించి నష్టపోయినట్లు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్