logo

Visakhapatnam: నవదంపతులు పండగకి వెళ్లొస్తుండగా విషాదం

నవ దంపతులు పండగకి వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వివాహిత మృతి చెందగా.. భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన తగరపువలస జాతీయరహదారిపై సంగివలస మూడుగుళ్ల వద్ద శనివారం జరిగింది.

Updated : 31 Mar 2024 08:37 IST

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
భర్తకు తీవ్ర గాయాలు

చంద్రతేజాదేవి, పైడిరాజు  (పాతచిత్రం)

తగరపువలస, న్యూస్‌టుడే: నవ దంపతులు పండగకి వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వివాహిత మృతి చెందగా.. భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన తగరపువలస జాతీయరహదారిపై సంగివలస మూడుగుళ్ల వద్ద శనివారం జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి గాంధీనగర్‌కి చెందిన చంద్రతేజాదేవి (24)కి సింగనబందకి చెందిన పైడిరాజుతో ఈ ఏడాది ఫిబ్రవరి 18న వివాహమైంది. వీరు నగరంలోని మద్దిలపాలెంలో ఉంటున్నారు. గ్రామదేవత పండగకి స్వగ్రామం సింగనబంద వెళ్లారు. తిరిగి బుల్లెట్‌ బైక్‌తో వస్తుండగా శ్రీకాకుళం వైపు నుంచి విశాఖ వెళ్తున్న లారీ.. బైక్‌ హ్యాండిల్‌ను ఢీకొనడంతో ఇద్దరు రోడ్డుపై తూలిపడ్డారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన పైడిరాజును నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహానికి భీమిలి ప్రభుత్వాసుపత్రిలో శవపంచనామా చేశారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని సీఐ డి.రమేశ్‌ తెలిపారు. పెళ్లయిన కొద్దిరోజులకే ఆమె మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు