దిల్లీ X కోల్కతా.. ఎవరిదో పైచేయి..!
ఐపీఎల్-2024లో భాగంగా ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం దిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. గతనెల 31న జరిగిన మ్యాచ్లో చెన్నైపై విజయం సాధించిన దిల్లీ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతుండగా, కోల్కతా ఎలాగైనా గెలిచేందుకు సర్వశక్తులను ఒడ్డనుంది.
దిల్లీ ఆటగాళ్లు; పిచ్ను పరిశీలిస్తున్న సౌరభ్ గంగూలీ
విశాఖ క్రీడలు, న్యూస్టుడే: ఐపీఎల్-2024లో భాగంగా ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం దిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. గతనెల 31న జరిగిన మ్యాచ్లో చెన్నైపై విజయం సాధించిన దిల్లీ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతుండగా, కోల్కతా ఎలాగైనా గెలిచేందుకు సర్వశక్తులను ఒడ్డనుంది. మంగళవారం ఆ జట్టు ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు మనీష్పాండే, రింకూసింగ్, రసెల్, మిచెల్ స్టార్క్, లోకల్ బాయ్ కె.ఎస్.భరత్ రాణించాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. దిల్లీ క్యాపిటల్స్ జట్టులో నాయకుడు రిషబ్పంత్, డేవిడ్ వార్నర్, పృథ్విషా, అక్షర్పటేల్ ఫామ్లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. చెన్నై మ్యాచ్కు స్టేడియం కిక్కిరిసి పోగా, టికెట్లు దొరక్క అభిమానులు నిరుత్సాహ పడ్డారు. బుధవారం నాటి మ్యాచ్ టికెట్లకు ఆ స్థాయిలో డిమాండ్ లేకపోవడం గమనార్హం.
నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఎం.వి.పి.కాలనీ, న్యూస్టుడే : మ్యాచ్ సందర్భంగా స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ రాత్రి 7 నుంచి 11.30 గంటల వరకు జరుగనుంది. దీంతో నగరంలో పలు చోట్ల వాహనాలను దారి మళ్లించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
[ 26-07-2024]
డేటింగ్ యాప్ ద్వారా విశాఖలో ఓ యువకుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. సుమారు రూ.28లక్షలకు పైగా నగదు వివిధ రూపాల్లో కొట్టేశారు. -
విశ్వక్రీడా వేడుక కోటి ఆశల్లో విశాఖ
[ 26-07-2024]
ప్రపంచమంతా పారిస్లో శుక్రవారం ఆరంభమయ్యే క్రీడా సంగ్రామం ‘ఒలింపిక్స్’ వైపు చూస్తోంది. -
కోణార్క్ ఎక్స్ప్రెస్కు అదనపు జనరల్ బోగీలు
[ 26-07-2024]
ప్రయాణికుల సౌకర్యార్థం భువనేశ్వర్-ముంబయి-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్కు అదనపు జనరల్ బోగీలను జత చేయనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
చేతికి ఎముకే లేనట్టు.. అంతా కనికట్టు!!
[ 26-07-2024]
విశాఖలో గత వైకాపా ప్రభుత్వ పాలనలో ఇష్టా రాజ్యంగా టీడీఆర్లు జారీ చేశారు. అనుకున్నదే తడవుగా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేసి.. వైకాపా నేతలకు బాండ్లు కట్టబెట్టారు. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
[ 26-07-2024]
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
చురుగ్గా భారత్-యూఎస్ నేవీ విన్యాసాలు
[ 26-07-2024]
భారత్, యూఎస్ నౌకాదళాల మధ్య సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘రింపాక్-2024’ విన్యాసాలు సానుకూలంగా దోహదపడతాయని యూఎస్ కమాండర్, వైస్అడ్మిరల్ జాన్ ఎఫ్జీ వాడె అన్నారు. -
బాలికపై అత్యాచారం కేసులో 20ఏళ్ల జైలు
[ 26-07-2024]
బాలికను బలవంతంగా ఎత్తుకుపోయి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పునిచ్చారు. -
వాహన సామర్థ్యం తనిఖీ ఇక ఆటోమేటిక్..
[ 26-07-2024]
వాహన సామర్థ్యాన్ని గుర్తించే ఆటోమేటెడ్ ఫిట్నెస్ కేంద్రం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. -
వీఎంఆర్డీఏ.. ప్రక్షాళన జరిగేనా!
[ 26-07-2024]
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నగరాభివృద్ధిని మెట్రోపాలిటన్ స్థాయికి పరుగులు పెట్టించాల్సిన బాధ్యత విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ)పై ఉంది. -
వంట.. తంటా!
[ 26-07-2024]
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. -
వంతెన నిర్మించాలంటూ జలదీక్ష
[ 26-07-2024]
సరియా గెడ్డపై వంతెన నిర్మించాలని డిమాండు చేస్తూ వాలాబు పంచాయతీ బొర్రచింత గిరిజనులు వాగులో దిగి గురువారం ఆందోళన చేపట్టారు. -
ఆరోగ్యకేంద్రం స్థలం ఆక్రమణకు యత్నం
[ 26-07-2024]
రెవెన్యూ అండ చూసుకుని ప్రైవేటు వ్యక్తులు పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థలాన్ని ఆక్రమించడానికి తెగించడం స్థానికులను విస్తుపోయేలా చేసింది. -
విస్సన్నపేట భూముల్లో అక్రమాలపై చర్యలేవి?
[ 26-07-2024]
విస్సన్నపేట భూములపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి నిబంధనలు అతిక్రమించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా, జనసేన నాయకులు గురువారం డిమాండ్ చేశారు. -
సింహాద్రి ఎన్టీపీసీకి రాజభాష గౌరవ్ సమ్మాన్ అవార్డు
[ 26-07-2024]
పరవాడలోని సింహాద్రి ఎన్టీపీసీకి 2023-24 సంవత్సరానికి గాను రాజభాష గౌరవ్ సమ్మాన్ ద్వితీయ అవార్డు వరించింది. -
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్కు అంతరాయం
[ 26-07-2024]
భారీ లోడ్తో వెళ్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోవడంతో గురువారం 16వ నంబరు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంగరంగ వైభవంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్ వేడుకలు
-
ఐడెంటిటీ మార్చుకోవాల్సి వస్తే: విజయ్ ఆంటోనీ సమాధానమేంటంటే?
-
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ