చూశాం పోలిక ఇక చాలు పాలకా!
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది.
విద్యావ్యవస్థను పట్టించుకోని వైకాపా ప్రభుత్వం
‘నాడు-నేడు’పనులే తార్కాణం
భారీగా కడుతున్నామంటూ జగన్ సర్కార్ గొప్పలు
నిధులు లేక ఎక్కడ చూసినా అసంపూర్తి నిర్మాణాలే
ఈనాడు, విశాఖపట్నం
పిల్లల భవిష్యత్తు బాగుండాలని మేనమామగా అనేక విద్యా కార్యక్రమాలు అమలు చేస్తున్నా. ‘నాడు-నేడు’ ద్వారా పూర్తిస్థాయిలో పాఠశాలలను అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నాం.
- 2021లో నాడు-నేడు రెండో విడత పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా సీఎం జగన్
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. పనులు పూర్తి కాకుండానే పాఠశాలల రూపురేఖలు మారిపోయాయంటూ ప్రచారం చేస్తున్నారు. మూడు విడతల్లో పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పారు. కానీ, రెండో విడత పనులు సైతం చాలా చోట్ల మధ్యలోనే నిలిచిపోయాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే.. తామే అంతా చేస్తున్నామంటూ వైకాపా నాయకులు హడావుడి చేస్తున్నారు. నాలుగేళ్లుగా పనులు జరుగుతుండటంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. వేసవి సెలవుల్లో చేయాల్సిన పనులు పనిదినాల్లో చేపట్టడంతో చదువులపై దృష్టి పెట్టలేకపోయారు.
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే అని చెప్పిన సీఎం.. వైకాపా పాలనలో విద్యార్థుల బోధనకు ఆటంకాలు ఎదురవుతున్నా పట్టించుకోలేదు.
రూ.కోట్లతో పాఠశాలలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుస్తామంటూ సీఎం ఊదరగొట్టారు. చివరికి పిల్లలు కూర్చునేందుకు కనీసం భవనాలు లేకుండా చేసిన ఘనత మూటగట్టుకున్నారు.భవనాలకు పార్టీ జెండాలను పోలిన రంగులు వేయించడంపై పెట్టిన శ్రద్ధ.. విద్యాశాఖపై పెట్టలేదు.
నిధుల కొరతతో..
‘నాడు-నేడు మన బడి’ పథకం పనులకు సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్నాయి. పలుచోట్ల పాత తరగతి గదులు కూల్చేసి వాటి స్థానంలో అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. పాత భవనాలను నేలకూల్చి.. వాటిలోని సామగ్రిని మరో గదిలో భద్రపరిచారు. అదనంగా మూడు గదుల నిర్మాణానికి పనులు ప్రారంభించినా.. నిధుల కొరతతో మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రతి పాఠశాలలో తొలి విడత నిధులతో అదనపు గదుల నిర్మాణాలు ప్రారంభించారు. ఆ తర్వాత నిధుల్లేక పోవడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు. సరిపడా తరగతి గదులు లేకపోవడం, కొత్త భవనాలు పూర్తికాకపోవడంతో చాలా చోట్ల విద్యార్థులు ఆరుబయట కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో ఒకే గదిలో రెండు, మూడు తరగతులు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల అదనపు గదుల నిర్మాణం పునాది దశ దాటడం లేదు.
పునాదుల దశలోనే అధికం..
తొలి దశలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని 165 పాఠశాలల్లో 9 రకాల పనులకు రూ.52.38 కోట్లు కేటాయించారు. రెండో దశలో విశాఖ జిల్లాలోని 314 పాఠశాలల్లో అదనపు తరగతులతోపాటు అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు రూ.133.41 కోట్లు కేటాయించారు. తర్వాత మళ్లీ కొన్ని పాఠశాలల్లో అదనపు గదులు అవసరం లేదని తేల్చారు. అప్పటికే ఆయా చోట్ల పనులు ప్రారంభించేశారు. వాటి గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రెండో దశలో 309 పాఠశాలల్లో రూ.114.81 కోట్లతో ప్రహరీ, అదనపు తరగతి గదులు నిర్మాణం జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటివరకు దాదాపు రూ.70 కోట్లు మాత్రమే విడుదల చేశారు. చాలా చోట్ల భవనాలు పునాదుల దశలోనే ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశ్వక్రీడా వేడుక కోటి ఆశల్లో విశాఖ
[ 26-07-2024]
ప్రపంచమంతా పారిస్లో శుక్రవారం ఆరంభమయ్యే క్రీడా సంగ్రామం ‘ఒలింపిక్స్’ వైపు చూస్తోంది. -
కోణార్క్ ఎక్స్ప్రెస్కు అదనపు జనరల్ బోగీలు
[ 26-07-2024]
ప్రయాణికుల సౌకర్యార్థం భువనేశ్వర్-ముంబయి-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్కు అదనపు జనరల్ బోగీలను జత చేయనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
చేతికి ఎముకే లేనట్టు.. అంతా కనికట్టు!!
[ 26-07-2024]
విశాఖలో గత వైకాపా ప్రభుత్వ పాలనలో ఇష్టా రాజ్యంగా టీడీఆర్లు జారీ చేశారు. అనుకున్నదే తడవుగా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేసి.. వైకాపా నేతలకు బాండ్లు కట్టబెట్టారు. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
[ 26-07-2024]
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
చురుగ్గా భారత్-యూఎస్ నేవీ విన్యాసాలు
[ 26-07-2024]
భారత్, యూఎస్ నౌకాదళాల మధ్య సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘రింపాక్-2024’ విన్యాసాలు సానుకూలంగా దోహదపడతాయని యూఎస్ కమాండర్, వైస్అడ్మిరల్ జాన్ ఎఫ్జీ వాడె అన్నారు. -
బాలికపై అత్యాచారం కేసులో 20ఏళ్ల జైలు
[ 26-07-2024]
బాలికను బలవంతంగా ఎత్తుకుపోయి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పునిచ్చారు. -
వాహన సామర్థ్యం తనిఖీ ఇక ఆటోమేటిక్..
[ 26-07-2024]
వాహన సామర్థ్యాన్ని గుర్తించే ఆటోమేటెడ్ ఫిట్నెస్ కేంద్రం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. -
వీఎంఆర్డీఏ.. ప్రక్షాళన జరిగేనా!
[ 26-07-2024]
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నగరాభివృద్ధిని మెట్రోపాలిటన్ స్థాయికి పరుగులు పెట్టించాల్సిన బాధ్యత విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ)పై ఉంది. -
వంట.. తంటా!
[ 26-07-2024]
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. -
వంతెన నిర్మించాలంటూ జలదీక్ష
[ 26-07-2024]
సరియా గెడ్డపై వంతెన నిర్మించాలని డిమాండు చేస్తూ వాలాబు పంచాయతీ బొర్రచింత గిరిజనులు వాగులో దిగి గురువారం ఆందోళన చేపట్టారు. -
ఆరోగ్యకేంద్రం స్థలం ఆక్రమణకు యత్నం
[ 26-07-2024]
రెవెన్యూ అండ చూసుకుని ప్రైవేటు వ్యక్తులు పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థలాన్ని ఆక్రమించడానికి తెగించడం స్థానికులను విస్తుపోయేలా చేసింది. -
విస్సన్నపేట భూముల్లో అక్రమాలపై చర్యలేవి?
[ 26-07-2024]
విస్సన్నపేట భూములపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి నిబంధనలు అతిక్రమించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా, జనసేన నాయకులు గురువారం డిమాండ్ చేశారు. -
సింహాద్రి ఎన్టీపీసీకి రాజభాష గౌరవ్ సమ్మాన్ అవార్డు
[ 26-07-2024]
పరవాడలోని సింహాద్రి ఎన్టీపీసీకి 2023-24 సంవత్సరానికి గాను రాజభాష గౌరవ్ సమ్మాన్ ద్వితీయ అవార్డు వరించింది. -
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్కు అంతరాయం
[ 26-07-2024]
భారీ లోడ్తో వెళ్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోవడంతో గురువారం 16వ నంబరు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి