చూశాం పోలిక ఇక చాలు పాలకా!
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది.
విద్యావ్యవస్థను పట్టించుకోని వైకాపా ప్రభుత్వం
‘నాడు-నేడు’పనులే తార్కాణం
భారీగా కడుతున్నామంటూ జగన్ సర్కార్ గొప్పలు
నిధులు లేక ఎక్కడ చూసినా అసంపూర్తి నిర్మాణాలే
ఈనాడు, విశాఖపట్నం
పిల్లల భవిష్యత్తు బాగుండాలని మేనమామగా అనేక విద్యా కార్యక్రమాలు అమలు చేస్తున్నా. ‘నాడు-నేడు’ ద్వారా పూర్తిస్థాయిలో పాఠశాలలను అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నాం.
- 2021లో నాడు-నేడు రెండో విడత పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా సీఎం జగన్
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. పనులు పూర్తి కాకుండానే పాఠశాలల రూపురేఖలు మారిపోయాయంటూ ప్రచారం చేస్తున్నారు. మూడు విడతల్లో పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పారు. కానీ, రెండో విడత పనులు సైతం చాలా చోట్ల మధ్యలోనే నిలిచిపోయాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే.. తామే అంతా చేస్తున్నామంటూ వైకాపా నాయకులు హడావుడి చేస్తున్నారు. నాలుగేళ్లుగా పనులు జరుగుతుండటంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. వేసవి సెలవుల్లో చేయాల్సిన పనులు పనిదినాల్లో చేపట్టడంతో చదువులపై దృష్టి పెట్టలేకపోయారు.
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే అని చెప్పిన సీఎం.. వైకాపా పాలనలో విద్యార్థుల బోధనకు ఆటంకాలు ఎదురవుతున్నా పట్టించుకోలేదు.
రూ.కోట్లతో పాఠశాలలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుస్తామంటూ సీఎం ఊదరగొట్టారు. చివరికి పిల్లలు కూర్చునేందుకు కనీసం భవనాలు లేకుండా చేసిన ఘనత మూటగట్టుకున్నారు.భవనాలకు పార్టీ జెండాలను పోలిన రంగులు వేయించడంపై పెట్టిన శ్రద్ధ.. విద్యాశాఖపై పెట్టలేదు.
నిధుల కొరతతో..
‘నాడు-నేడు మన బడి’ పథకం పనులకు సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్నాయి. పలుచోట్ల పాత తరగతి గదులు కూల్చేసి వాటి స్థానంలో అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. పాత భవనాలను నేలకూల్చి.. వాటిలోని సామగ్రిని మరో గదిలో భద్రపరిచారు. అదనంగా మూడు గదుల నిర్మాణానికి పనులు ప్రారంభించినా.. నిధుల కొరతతో మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రతి పాఠశాలలో తొలి విడత నిధులతో అదనపు గదుల నిర్మాణాలు ప్రారంభించారు. ఆ తర్వాత నిధుల్లేక పోవడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు. సరిపడా తరగతి గదులు లేకపోవడం, కొత్త భవనాలు పూర్తికాకపోవడంతో చాలా చోట్ల విద్యార్థులు ఆరుబయట కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో ఒకే గదిలో రెండు, మూడు తరగతులు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల అదనపు గదుల నిర్మాణం పునాది దశ దాటడం లేదు.
పునాదుల దశలోనే అధికం..
తొలి దశలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని 165 పాఠశాలల్లో 9 రకాల పనులకు రూ.52.38 కోట్లు కేటాయించారు. రెండో దశలో విశాఖ జిల్లాలోని 314 పాఠశాలల్లో అదనపు తరగతులతోపాటు అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు రూ.133.41 కోట్లు కేటాయించారు. తర్వాత మళ్లీ కొన్ని పాఠశాలల్లో అదనపు గదులు అవసరం లేదని తేల్చారు. అప్పటికే ఆయా చోట్ల పనులు ప్రారంభించేశారు. వాటి గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రెండో దశలో 309 పాఠశాలల్లో రూ.114.81 కోట్లతో ప్రహరీ, అదనపు తరగతి గదులు నిర్మాణం జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటివరకు దాదాపు రూ.70 కోట్లు మాత్రమే విడుదల చేశారు. చాలా చోట్ల భవనాలు పునాదుల దశలోనే ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ కుట్ర లోతు.. బంగాళా‘ఖాత’మంత!!
[ 01-05-2024]
ప్రభుత్వ యంత్రాంగం తగినంత ఉంది. పేదల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేయొచ్చు. అయినా లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెట్టే యోచనపై సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది. -
సింహాచలం కొండపై.. ‘భూ’చోళ్లు
[ 01-05-2024]
ఎన్నికల వేళ గుట్టుచప్పుడు కాకుండా సింహాచల దేవస్థాన భూముల ఆక్రమణకు పావులు కదిలాయి. వైకాపా పెద్దలు కొందరు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే సర్వే పేరుతో హడావుడి చేస్తున్నారు. -
నేడు పెందుర్తిలో పవన్కల్యాణ్ బహిరంగ సభ
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ బుధవారం పెందుర్తిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని జీవీఎంసీ తెదేపా ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. -
రెండో విడతలో 12,626 మందికి పోలింగ్ విధులు
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయింది. సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ, గాజువాక, విశాఖ పశ్చిమ, ఎస్.కోట నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు... -
ఎన్నికల పండక్కి.. విశాఖకు రండి!
[ 01-05-2024]
వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించింది. యువత ఉపాధి అవకాశాలకు గండిపడింది. జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ దగా చేసిన తీరు తేటతెల్లమయింది. అనేక ప్రాజెక్టులు ముందుకు కదల్లేదు. -
మాటలకెన్నో అర్థాలు.. నోటినిండా అబద్ధాలు
[ 01-05-2024]
నా బీసీలంటూ.. తరచూ వల్లించే జగన్ వారిని కోలుకోని దెబ్బ తీశారు. ‘బీసీలంటే వెన్నెముక వర్గాలని’ చెప్పి.. అయిదేళ్లలో వారిని మరింత వెనక్కి నెట్టేశారు. జిల్లా జనాభాలో 50 శాతానికి పైగా వెనకబడిన వర్గాల ప్రజలే ఉన్నారు. -
గుర్తుందా.. జగన్ ఏలేరు పైపులైను..!
[ 01-05-2024]
విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తాం.. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు జగన్.. వైకాపా పాలన ఐదేళ్లు పూర్తయింది. ఇప్పుడు చూస్తే నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. -
రాష్ట్రంలో తుగ్లక్ పాలనకు ఇవే చివరి ఎన్నికలు
[ 01-05-2024]
ఆంధ్రప్రదేశ్లో తుగ్లక్ పరిపాలనకు ఇవే చివరి ఎన్నికలు అని సినీనటుడు, జనసేన ప్రచారకుడు పృథ్విరాజ్ అన్నారు. ఎంవీపీకాలనీ విశాఖ పార్లమెంటు కూటమి అభ్యర్థి శ్రీభరత్ ఎన్నికల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
అప్పన్న సన్నిధిలో పూసపాటి కుటుంబం
[ 01-05-2024]
సింహాచలం దేవస్థానం దివంగత అనువంశిక ధర్మకర్త పి.వి.జి.రాజు శత జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు, ప్రస్తుత అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. -
సూపర్ సిక్స్... బంపర్ హిట్ : గణబాబు
[ 01-05-2024]
తెదేపా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు బంపర్ హిట్ అని, వైకాపా మ్యానిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అభిప్రాయపడ్డారు. -
‘కాగితం’పైనే డిప్యుటేషన్ల రద్దు!
[ 01-05-2024]
వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దుకు సంబంధించి అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీజనల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి గతంలో ఇచ్చిన డిప్యుటేషన్లంటినీ రద్దు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ గత నెల 7న ఆదేశించారు. -
లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యం
[ 01-05-2024]
ఎన్డీఏ కూటమి ప్రకటనలో భాగంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో లక్ష మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
కార్మికులపై కరకు మనసు!!
[ 01-05-2024]
‘మాట్లాడితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ’ అని చెబుతుంటారు సీఎం జగన్. మరి అదే పేదలు కంపెనీల్లో ఒళ్లు గుల్ల చేసుకుని పని చేస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నా వారిపై కనీస కనికరం కూడా చూపడం లేదు ఆయన. -
ఉపాధి నిధులు మింగేస్తున్నారు..
[ 01-05-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే ఉపాధి నిధులను వైకాపా నాయకులు స్వాహా చేస్తున్నారని అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆరోపించారు. అచ్యుతాపురం మండలం లంకధర్మవరం, మడుతూరు గ్రామాల్లో ఉపాధి కూలీలతో ఆయన మంగళవారం మాట్లాడారు. -
పేదల స్థలాలు కబ్జా
[ 01-05-2024]
కాయకష్టం చేసి సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి కొనుగోలు చేసిన ఇంటి స్థలాలను వైకాపాకు చెందిన నాయకుడు కబ్జా చేశాడు. ఐదేళ్ల కితం కొనుగోలు చేసిన ఈ స్థలాలను ఆ నేత పొక్లెయిన్తో చదును చేయించడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. -
విపక్షాలపై పగ.. పండుటాకులకు సెగ
[ 01-05-2024]
సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఉన్నతాధికారుల తీరు అంతా జగన్నాటకంగానే కనిపిస్తోంది. గత నెలలో మండుటెండలో పింఛన్లు అందుకోవడానికి సచివాలయానికి వెళ్లి పదుల సంఖ్యలో వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. -
రాష్ట్ర భవిష్యత్తుకు తెదేపా కూటమిని గెలిపించాలి
[ 01-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని, రాష్ట్ర భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని భాజాపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు, సినీనటి ఖుష్బూ తెలిపారు. -
వైకాపా పాలన అంతమే కూటమి లక్ష్యం
[ 01-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లగా సాగుతున్న వైకాపా రాక్షస పాలన అంతమే లక్ష్యంగా ప్రజల కోసం కూటమి ఏర్పడిందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
బాలుడి నుంచి 16 కిలోల గంజాయి స్వాధీనం
[ 01-05-2024]
విశాఖ మీదుగా గంజాయిని అక్రమంగా రవాణా చేసేందుకు యత్నించిన ఓ బాలుడ్ని విశాఖ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జీఆర్పీ సీఐ ధనుంజయనాయుడు తెలిపారు. -
పలు రైళ్ల దారి మళ్లింపు
[ 01-05-2024]
సదరన్ రైల్వే సేలం డివిజన్ వంజిపాల్యం స్టేషన్లో యార్డు ఆధునికీకరణ పనుల కారణంగా మే 10న డిబ్రూఘర్-కన్యాకుమారీ (22504) రైలు, మే 7, 9, 13 తేదీల్లో ఎర్నాకుళం-టాటానగర్(18190) ఎక్స్ప్రెస్ వయా ఇరుగుర్, పొదనూర్, సూరత్కల్ స్టేషన్ల మీదుగా దారి మళ్లించి నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర