సుఖీభవ!
దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోంది.. అయినా మహిళలపై అనాగరిక, ఆటవిక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆమెను గృహ హింస, అక్రమ రవాణా, వరకట్న వేధింపులు తదితర ఎన్నో సమస్యలు పట్టిపీడిస్తున్నాయి.
బాధిత మహిళలకు భరోసా
సఖి.. మహిళలకు అండగా ఉంటోంది. ఆపదలో రక్షణ కల్పిస్తోంది.. అవసరమైన వైద్య సేవలు అందిస్తోంది.. న్యాయసలహాలు ఇప్పిస్తోంది.. సమస్యలు పరిష్కరిస్తోంది.. జీవితాల్లో వెలుగులు నింపుతోంది.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలను తొలగిస్తోంది..సుఖిభవ అని దీవిస్తోంది..
వరంగల్క్రైం, జులైవాడ, న్యూస్టుడే: దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోంది.. అయినా మహిళలపై అనాగరిక, ఆటవిక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆమెను గృహ హింస, అక్రమ రవాణా, వరకట్న వేధింపులు తదితర ఎన్నో సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. వివిధ రకాల హింసల నుంచి తక్షణమే రక్షణ కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థ సహకారంతో హనుమకొండలో సఖి కేంద్రాన్ని 2017 డిసెంబరులో ఏర్పాటు చేశారు. 24 గంటలు పని చేసే ఈ కేంద్రంలో 14 మంది మహిళా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా వేధింపులు, దాడులకు గురైతే ధైర్యంగా ఈ కేంద్రంలో ఫిర్యాదు చేయవచ్చు. ఇందులో పోలీసు, వైద్య సేవలతో పాటు న్యాయ సహాయం అందిస్తారు. భార్యాభర్తల విషయంలో కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. 181 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు. వెంటనే కేంద్రం నిర్వాహకులు స్పందించి బాధిత మహిళలకు సహాయం అందిస్తున్నారు.
పోలీసు ప్రాసిక్యూషన్ సర్వీసు
బాధిత మహిళలకు పోలీసు అధికారులు రక్షణ ఇవ్వడంతో పాటు వారికి కేసుకు అవసరమైన సలహాలు ఇస్తారు. సంబంధిత ఠాణాల్లో కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటారు. అవసరమైన సాక్షులను కోర్టులో ప్రవేశపెడతారు. బాధిత కుటుంబానికి పూర్తి అండగా ఉంటూ కేసు పూర్తయ్యే వరకు సహకారం అందిస్తారు.
వైద్య సదుపాయం
సఖి కేంద్రం ఆవరణలోనే వైద్యం అందించేందుకు ప్రత్యేక గది ఉంటుంది. ఆపద నుంచి బయటపడి ఇక్కడికి వచ్చిన వారికి ప్రాథమికంగా వైద్యం చేస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్తారు.
కౌన్సెలింగ్
కౌన్సెలింగ్ ఇస్తున్న ప్రాజెక్టు డైరెక్టర్ దామోదర్
బాధితుల్లో మానసిక ధైర్యం నింపి వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తారు. ఇందుకోసం అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తారు. మానసిక వైద్య నిపుణులు అందుబాటులో ఉండి పూర్తి సహాయం అందిస్తారు.
తక్షణ న్యాయం, సలహాలు
సఖి/వన్స్టాప్లో ఉచితంగా న్యాయసలహాలు ఇస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా న్యాయనిపుణులు ఉంటారు. నిందితులకు శిక్ష పడేలా ప్రయత్నిస్తారు. అవసరమైన సాక్ష్యాల పరిశీలన, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని సత్వరం నాయ్యం అందేలా చూస్తారు. తక్షణ న్యాయం జరిగేలా విచారణ ఉంటుంది. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు రాకుండానే బాధితులతో మాట్లాడిస్తారు. వారు చెప్పే అంశాలను కోర్టులో నమోదు చేస్తారు. దీని వల్ల త్వరితగతిన న్యాయం జరుగుతుంది.
పునరావాస కేంద్రం
సఖి పునరావాస కేంద్రం గా ఉపయోగపడుతోంది. ఇందులో ఉండే వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు వివిధ రకలైన కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.
* వరంగల్ ములుగు రోడ్డుకు చెందిన యువతికి ఎల్బీనగర్కు చెందిన యువకుడితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. పిల్లలు లేకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆమె సఖి కేంద్రాన్ని సంప్రదించారు. నిర్వాహకులు కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఇద్దరు ఒక్కటయ్యారు.
* హనుమకొండలోని ఉద్యోగి కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. బాధితురాలు సఖి కేంద్రానికి తన సమస్యను వివరించారు. అతన్ని పిలిచి వరకట్న వేధింపుల చట్టం గురించి వివరించారు. కౌన్సెలింగ్ ఇవ్వడంతో భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు.
* వరంగల్లోని ఓ ఉద్యోగి తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. భార్యను వేధిస్తున్నాడు. ఆమె సఖి కేంద్రాన్ని ఆశ్రయించగా, కౌన్సెలింగ్ ఇచ్చి భర్తలో మార్పు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
- సబిత, జిల్లా సంక్షేమ అధికారి
సమాజంలో వివక్షకు గురైన మహిళలకు సఖి కేంద్రం ద్వారా చేయూత ఇస్తున్నాం. బాధితులకు ఐదు రోజుల పాటు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరిస్తున్నాం. నేరుగా బాధితులు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. లేదా 181 ద్వారా సమాచారం ఇస్తే సహాయం అందిస్తాం. సఖి కేంద్రం గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు - ఈటీవి ఆధ్వర్యంలో వన మహోత్సవం
[ 26-07-2024]
ఈనాడు-ఈటీవి ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
[ 26-07-2024]
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
[ 26-07-2024]
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
[ 26-07-2024]
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆకర్షక పద్దు
[ 26-07-2024]
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. వారికి అన్ని విధాలుగా మేలు చేసేలా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేటాయింపులు చేశారు. అభివృద్ధే అజెండాగా.. సంక్షేమం దండిగా ఉండేలా ఆర్థిక పద్దు రూపకల్పన జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం. -
పంచాయతీల్లో కానరాని పౌర సేవల పట్టికలు
[ 26-07-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పంచాయతీల్లో ప్రజలకు పౌర సేవలు అరకొరగానే అందుతున్నాయి. పంచాయతీలో ఏఏ సేవలు అందుబాటులో ఉంటాయో, వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో సూచిస్తూ పంచాయతీ కార్యాలయాల్లో విధిగా పౌరసేవల పట్టికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
విశ్వ క్రీడల కీర్తి.. ఓరుగల్లు పొందాలి స్ఫూర్తి
[ 26-07-2024]
ఒలింపిక్స్లో పతకాలు సాధించడం అంత సులువైన విషయం కాదు. అసాధ్యమూ అంతకన్నా కాదు. కావాల్సిందల్లా గట్టి సంకల్పం, పట్టుదల, కృషి. ఉమ్మడి వరంగల్లో క్రీడాకారుల ప్రతిభకు కొదువ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గొప్ప నైపుణ్యం ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారిని గుర్తించి సానబెడితే ఒలింపిక్స్కు మనవాళ్లు అర్హత సాధించడం పెద్ద సమస్యే కాదు. -
ఆయన లేని లోకంలో ఉండలేనని..
[ 26-07-2024]
ఎక్కడో పుట్టారు.. ఎక్కడో పెరిగారు.. వివాహబంధంతో ఒకటయ్యారు.. కష్టసుఖాలు పంచుకున్నారు.. పిల్లలను ప్రయోజకులను చేశారు.. అరవై ఏళ్లు తోడు-నీడగా ఉన్నారు.. మలి సంధ్యలోనూ నీకు నేను...నాకు నువ్వు అనుకుంటూ జీవిస్తున్నారు.. ఇంతలో భర్త హఠాన్మరణంతో ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలపించారు.. -
ఎక్సైజ్కాలనీ.. ఎక్కడ చూసినా సమస్యలే
[ 26-07-2024]
హనుకొండ నడిబొడ్డున ఉన్న ఎక్సైజ్కాలనీలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. అన్ని అనుమతులతో ఐదు దశాబ్దాల కిందట కాలనీ ఏర్పడింది. ఇప్పకీ కొన్ని వీధుల్లో డ్రైనేజీలు లేవు. రోడ్డు నెంబర్ 5సీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు రోడ్డుపై నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. -
సరిహద్దులో పేలిన తూటా!
[ 26-07-2024]
కొన్నాళ్లుగా తెలంగాణ-ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య పోరు సాగుతోంది. గురువారం ములుగు-భద్రాద్రి జిల్లాల సరిహద్దులోని గుండాల-తాడ్వాయి మండలాల పరిధిలోని దామెరతోగు, కరకగూడెం అటవీ ప్రాంతంలో తుపాకీ తూటాల మోతలు మోగాయి. -
ఠాణాల్లో భూ తగాదాలు.. సివిల్ పంచాయితీలు!
[ 26-07-2024]
జిల్లా పరిధిలోని కొన్ని పోలీసు సబ్ డివిజన్లలో సీఐలు, ఎస్సైల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఠాణాల్లో యథేచ్ఛగా భూ పంచాయితీలు, సివిల్ తగాదాల్లో పోలీసులు తలదూరుస్తూ అమ్యామ్యాయాలు పుచ్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనూ ఈ మాదిరిగానే వ్యవహరించగా జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. -
కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం
[ 26-07-2024]
శాంతిభద్రతల పరిరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి