తొలిసారి బరి.. ఎంపీ పీఠంపై గురి
వరంగల్ లోక్సభ స్థానానికి భారాస అభ్యర్థిగా హనుమకొండ జడ్పీ ఛైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ను ఎంపిక చేయడంతో కొన్నాళ్ల నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
ఈనాడు, వరంగల్ న్యూస్టుడే, బాలసముద్రం
వరంగల్ లోక్సభ స్థానానికి భారాస అభ్యర్థిగా హనుమకొండ జడ్పీ ఛైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ను ఎంపిక చేయడంతో కొన్నాళ్ల నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇక మూడు ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు తొలిసారి ఎంపీగా పోటీ చేస్తుండటం గమనార్హం.. వరంగల్ నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీలకన్నా ముందు భారాసనే అభ్యర్థిగా కడియం శ్రీహరి తనయ కావ్యను ప్రకటించింది. తర్వాత ఆమె హస్తం గూటికి చేరడంతో జరిగిన పరిణామాలతో భారాసకు అభ్యరి ఎంపిక కత్తిమీద సాములా మారింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ తొలుత తాను భారాస నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ, పార్టీ అధిష్ఠానం టికెట్టు ఇచ్చే అవకాశం లేదనే సంకేతాలు రావడంతో అనూహ్యంగా భాజపాలోకి వెళ్లి బరిలో నిలిచారు. కాంగ్రెస్లో చేరిన కావ్యకు పోటీచేసే అవకాశం దక్కడంతో ఇక భారాస నుంచి ఎవరిని పోటీలో నిలుపుతారనేది వారం, పది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య మళ్లీ భారాసలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ఆచితూచి, అన్ని కోణాల్లో ఆలోచించిన గులాబీ అధినేత కేసీఆర్ చివరకు వివాదరహితుడిగా పేరున్న జడ్పీ ఛైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్ను పార్టీ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించారు. దీంతో వరంగల్ స్థానం నుంచి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైనట్లయింది.
ఇద్దరూ వైద్యులే...
వరంగల్ భారాస అభ్యర్థిగా ఖరారైన డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ ఆయుర్వేద వైద్యుడు.. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్ కడియం కావ్య సైతం వైద్యురాలే.. ఎంబీబీఎస్, ఎండీ పాథాలజీ పూర్తి చేసి కొన్నాళ్లు వర్ధన్నపేటలో అనంతరం హనుమకొండలోని ప్రతిమ రిలీఫ్ మెడికల్ కళాశాలలో వైద్యురాలిగా పనిచేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు.
నాడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు
హనుమకొండ జిల్లా పరిషత్తు ఛైర్మన్గా 2019లో ఎన్నికైన డాక్టర్ సుధీర్కుమార్ను అప్పటి భారాస వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అభినందిస్తున్న దృశ్యమిది.. ఇప్పుడు వీరిద్దరూ లోక్సభ ఎన్నికల్లో ప్రత్యర్థులు.. సుధీర్కుమార్ భారాస నుంచి పోటీ చేస్తుండగా, అరూరి భాజపా నుంచి బరిలో దిగారు. నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులయ్యారు. చిత్రంలో మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీశ్కుమార్ కూడా ఉన్నారు.
జడ్పీ ఛైర్మన్కు అవకాశం
భారాస నుంచి బరిలో ఉన్న సుధీర్కుమార్ జన్మస్థలం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామం. ఆయుర్వేద వైద్యుడిగా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో స్థిరపడి ఆసుపత్రి ఏర్పాటు చేసి సేవలందించారు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, కాకతీయ డిగ్రీ ప్రభుత్వ కళాశాల హనుమకొండలో డిగ్రీ పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఏఎంఎస్ చదివారు. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఎండీ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1995-2000 వరకు భీమదేవరపల్లి మండల పరిషత్ అధ్యక్షుడిగా పని చేశారు. 2001-2006 వరకు కరీంనగర్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు అనుచరుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టి కేసుల పాలయ్యారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లారు. బైండోవర్ కేసులు ఎదుర్కొన్నారు. 2019లో జరిగిన జిల్లా పరిషత్తు ఎన్నికల్లో ఎల్కతుర్తి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది హనుమకొండ జడ్పీ ఛైర్మన్గా అవకాశం దక్కించుకున్నారు.
గెలుపు ఎవరిదో..!
వరంగల్ నుంచి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు లోక్సభ బరిలో దిగడం ఇదే మొదటిసారి.. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. తండ్రి శ్రీహరికి శాసనసభ ఎన్నికల్లో మద్దతుగా నిలిచి ప్రచారం చేస్తూ ఆయన్ను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఇక భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు లోక్సభకు పోటీచేసేందుకు కమలం నుంచి అవకాశం దక్కించుకున్నారు. భారాస అభ్యర్థి పోటీ చేయడం ఇదే ప్రథమం.. ఇలా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు తొలిసారి బరిలో నిలుస్తూ ఎంపీ స్థానంపై గురి పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు - ఈటీవి ఆధ్వర్యంలో వన మహోత్సవం
[ 26-07-2024]
ఈనాడు-ఈటీవి ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
[ 26-07-2024]
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
[ 26-07-2024]
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
[ 26-07-2024]
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆకర్షక పద్దు
[ 26-07-2024]
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. వారికి అన్ని విధాలుగా మేలు చేసేలా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేటాయింపులు చేశారు. అభివృద్ధే అజెండాగా.. సంక్షేమం దండిగా ఉండేలా ఆర్థిక పద్దు రూపకల్పన జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం. -
పంచాయతీల్లో కానరాని పౌర సేవల పట్టికలు
[ 26-07-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పంచాయతీల్లో ప్రజలకు పౌర సేవలు అరకొరగానే అందుతున్నాయి. పంచాయతీలో ఏఏ సేవలు అందుబాటులో ఉంటాయో, వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో సూచిస్తూ పంచాయతీ కార్యాలయాల్లో విధిగా పౌరసేవల పట్టికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
విశ్వ క్రీడల కీర్తి.. ఓరుగల్లు పొందాలి స్ఫూర్తి
[ 26-07-2024]
ఒలింపిక్స్లో పతకాలు సాధించడం అంత సులువైన విషయం కాదు. అసాధ్యమూ అంతకన్నా కాదు. కావాల్సిందల్లా గట్టి సంకల్పం, పట్టుదల, కృషి. ఉమ్మడి వరంగల్లో క్రీడాకారుల ప్రతిభకు కొదువ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గొప్ప నైపుణ్యం ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారిని గుర్తించి సానబెడితే ఒలింపిక్స్కు మనవాళ్లు అర్హత సాధించడం పెద్ద సమస్యే కాదు. -
ఆయన లేని లోకంలో ఉండలేనని..
[ 26-07-2024]
ఎక్కడో పుట్టారు.. ఎక్కడో పెరిగారు.. వివాహబంధంతో ఒకటయ్యారు.. కష్టసుఖాలు పంచుకున్నారు.. పిల్లలను ప్రయోజకులను చేశారు.. అరవై ఏళ్లు తోడు-నీడగా ఉన్నారు.. మలి సంధ్యలోనూ నీకు నేను...నాకు నువ్వు అనుకుంటూ జీవిస్తున్నారు.. ఇంతలో భర్త హఠాన్మరణంతో ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలపించారు.. -
ఎక్సైజ్కాలనీ.. ఎక్కడ చూసినా సమస్యలే
[ 26-07-2024]
హనుకొండ నడిబొడ్డున ఉన్న ఎక్సైజ్కాలనీలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. అన్ని అనుమతులతో ఐదు దశాబ్దాల కిందట కాలనీ ఏర్పడింది. ఇప్పకీ కొన్ని వీధుల్లో డ్రైనేజీలు లేవు. రోడ్డు నెంబర్ 5సీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు రోడ్డుపై నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. -
సరిహద్దులో పేలిన తూటా!
[ 26-07-2024]
కొన్నాళ్లుగా తెలంగాణ-ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య పోరు సాగుతోంది. గురువారం ములుగు-భద్రాద్రి జిల్లాల సరిహద్దులోని గుండాల-తాడ్వాయి మండలాల పరిధిలోని దామెరతోగు, కరకగూడెం అటవీ ప్రాంతంలో తుపాకీ తూటాల మోతలు మోగాయి. -
ఠాణాల్లో భూ తగాదాలు.. సివిల్ పంచాయితీలు!
[ 26-07-2024]
జిల్లా పరిధిలోని కొన్ని పోలీసు సబ్ డివిజన్లలో సీఐలు, ఎస్సైల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఠాణాల్లో యథేచ్ఛగా భూ పంచాయితీలు, సివిల్ తగాదాల్లో పోలీసులు తలదూరుస్తూ అమ్యామ్యాయాలు పుచ్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనూ ఈ మాదిరిగానే వ్యవహరించగా జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. -
కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం
[ 26-07-2024]
శాంతిభద్రతల పరిరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్