తియ్యని పండు.. చేదు నిజం
ఫల రాజుగా పేరొందిన మామిడి కొందరు వ్యాపారుల అత్యాశ కారణంగా విషతుల్యంగా మారుతోంది. గతంలో పండ్లను సహజ సిద్ధంగా పండించి మార్కెట్కు తరలించేవారు.
మామిడిని కృత్రిమంగా మాగబెడుతున్న వ్యాపారులు
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
అమ్మకానికి సిద్ధంగా ఉంచిన మామిడి పండ్లు
ఫల రాజుగా పేరొందిన మామిడి కొందరు వ్యాపారుల అత్యాశ కారణంగా విషతుల్యంగా మారుతోంది. గతంలో పండ్లను సహజ సిద్ధంగా పండించి మార్కెట్కు తరలించేవారు. ప్రస్తుతం కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలను వ్యాపారులు వినియోగిస్తున్నారు. వీటి వినియోగంతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏలూరు జిల్లాలో 52 వేల ఎకరాల్లో, నూజివీడు డివిజన్లో 40 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు.
ఆగిరిపల్లి, న్యూస్టుడే
తప్పని ముప్పు..
-
రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తింటే ఆరోగ్య సమస్యలు బారినపడే ప్రమాదముంది. దీర్ఘకాలికంగా ఇలాంటి పండ్లను తీసుకోవడం ద్వారా క్యాన్సర్, అల్సర్, కాలేయం, మూత్రపిండం, జీర్ణ సంబంధిత వ్యాధులు, కాళ్లు, చేతులు తిమ్మిర్లు, నరాల బలహీనతలకు గురయ్యే అవకాశముంది.
- కాల్షియం కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలిన్ వాయువు నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపి తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, శక్తిని కోల్పోయే ప్రమాదముంది. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి.
- గర్భిణుల్లో హార్మోన్లు దారి తప్పుతాయి. సహజమైన పద్ధతిలో పండిన పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
దాడులు చేసిన దాఖలాలు లేవు..
ఆహార సురక్ష ప్రమాణాల చట్టం-2006 ప్రకారం కాల్షియం కార్బైడ్తో మామిడి పండ్లను మాగించకూడదు. కార్బైడ్ వాడిన పండ్లను తినడంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్తో మాగబెట్టిన వారికి, అమ్మేవారికి ఏడాది జైలు శిక్ష రూ.3 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. ఉమ్మడి పశ్చిగోదావరి జిల్లాలో గత కొన్నేళ్లుగా దాడులు చేసిన దాఖలాలు లేవు. జరిమానా విధించే ధైర్యం లేదు. ఇక జైలు శిక్ష విధించడం సాధ్యమేనా? వ్యాపారుల వద్దకెళ్లి ఎలా మాగిస్తున్నారో కనీసం పరిశీలన చేసే సాహసం సైతం అధికారులు చేయడం లేదు.
పట్టింపులేని నిబంధనలు..
- 2011 ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనల ప్రకారం ప్రభుత్వం కార్బైడ్, ఎసిటిలిన్ రసాయనాలను నిషేధించింది
- సహజంగా పండించే ఇథిలిన్ను మాత్రమే 100 పీపీఎం వరకు వినియోగించేందుకు అనుమతిచ్చింది
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం సుమారు 20 కిలోల పండ్లకు 5 గ్రాముల ఇథిలిన్ను వినియోగించాల్సి ఉంటుంది. ఇంతకు మించి వినియోగిస్తే పండ్లు పై భాగం విషతుల్యమవుతుంది
- కాయలను కొనుగోలు చేసిన వ్యాపారులు మేలిమి పండులా కనిపించేందుకు కార్బైడ్ను వినియోగిస్తున్నారు. ఆమోదించిన ఇథిలిన్తో పోలిస్తే కార్బైడ్, ఇతర రసాయనాలు మార్కెట్లో చౌకగా లభిస్తుండటంతో వీటిని వ్యాపారులు యథేచ్ఛగా వాడుతున్నారు.
తినే ముందు ఉప్పు నీటిలో కడగాలి..
కృత్రిమంగా పండించిన పండ్లను తిన్నవారికి వాంతులు, విరోచనాలు, దాహం ఎక్కువ అవడం, కడుపులో తిప్పడం వంటి సమస్యలు వస్తాయి. కాల్షియం కార్బైడ్ కారణంగా ఆర్సీనిక్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. మామిడి పండ్లను తినే ముందు ఉప్పు నీటిలో ఉంచి కడగాలి. కృత్రిమంగా పండించిన పండ్లను సాధ్యమైనంత వరకు తినకపోవడం మంచిది
డా.జె.జగన్మోహనరావు, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో, నూజివీడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాల సముదాయాలు!
[ 26-07-2024]
పట్టణ పరిధిలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా మున్సిపాలిటీ అనుమతులు తప్పనిసరి. -
ప్రజలకు చేరువగా పోలీసు కార్యాలయం?
[ 26-07-2024]
జిల్లా పోలీసు కార్యాలయాన్ని భీమవరం పట్టణ సమీపానికి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారం రోజులుగా ఈ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. -
ఉలిక్కిపడిన యంత్రాంగం
[ 26-07-2024]
భీమవరం ఒకటో పట్టణ పరిధి తాడేరు రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మంటలు ఎగసిపడ్డాయి. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత దుకాణంలోంచి మంటలు ఒక్కసారిగా రావడంతో దుకాణ కాపలాదారులు సంబంధిత అధికారులకు -
ఇసుక గుట్టు రట్టవుతోంది
[ 26-07-2024]
కుక్కునూరు మండలంలో చోటు చేసుకున్న ఇసుక కుంభకోణం గుట్టు రట్టవుతోంది. ఆయా నిల్వలతో సంబంధమున్న ఉద్యోగులకు గురువారం అధికారులు తాకీదులు జారీ చేశారు. -
నరసాపురం రైల్వేలైనుకు మహర్దశ
[ 26-07-2024]
నరసాపురం రైల్వేలైన్కు మహర్దశ పట్టనుంది. తీర ప్రాంతంలో నరసాపురం - కోటిపల్లి రైల్వే లైనుకు రూ.300 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కేవీకే వేదిక.. ఉపాధి వీచిక
[ 26-07-2024]
మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా పురుషులతో సమానంగా కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా నిలవడానికి ముందుకొస్తున్నారు. -
పాడి పరిశ్రమకు జీవం!
[ 26-07-2024]
వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పాడి రైతుల పథకాలను ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం తిరిగి గాడినపెట్టే పనిలో పడింది. -
వైకాపా హయాంలో దళితుల అణచివేత
[ 26-07-2024]
‘జగన్ ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు, హత్యలు జరిగాయి. మాదిగ జాతి ఉనికిని కాపాడుకోవడం కష్టమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
ఎరువులకు ప్రైవేటే దిక్కు!
[ 26-07-2024]
రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. -
తగ్గినట్టే తగ్గి..
[ 26-07-2024]
గోదావరి వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఈ నెల 23న 51.6 అడుగుల గరిష్ఠ స్థాయి చేరింది. అనంతరం తగ్గుముఖం పట్టి బుధవారం 45 అడుగులకు చేరుకుంది. గురువారం ఉదయం నుంచి వరద పెరుగుతోంది. -
కిట్లలో నాణ్యత లేకుంటే వెనక్కి ఇవ్వొచ్చు
[ 26-07-2024]
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు అందజేసిన కిట్లలో నాణ్యత లేకుంటే వెనక్కి ఇవ్వొచ్చని, వాటి స్థానంలో కొత్తవి అందజేస్తామని జిల్లా విద్యా శాఖాధికారి ఎస్.అబ్రహం తెలిపారు. -
ఊళ్లన్నారు.. ఊదరగొట్టారు!
[ 26-07-2024]
ఏలూరు నగరంలోని పేదలకు సెంటు స్థలాల్లో ఇళ్లు నిర్మిస్తామన్న వైకాపా ప్రభుత్వం వాటిని పూర్తిగా గాలికొదిలేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ