kadapa: కొండలు మింగిన అనకొండలు.. గ్రావెల్ తవ్వకాల్లో గుత్తాధిపత్యం
సీఎం జగన్ ఇలాకా పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో ప్రకృతి సహజసిద్ధంగా వెలసిన కొండలను అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలతో మింగేశారు. కొందరు అధికారపార్టీకి చెందినవారు ఈ తవ్వకాల్లో గుత్తాధిపత్యం చేపట్టి యథేచ్ఛగా కొండలమట్టిని తవ్వి
ప్రభుత్వ ఖజానాకు గండి
గ్రావెల్ తవ్వకాలతో గోతులుగా మారిన వేంపల్లె మైనార్టీ గురుకుల పాఠశాల వెనుకవైపు ఉన్న కొండ
వేంపల్లె, న్యూస్టుడే: సీఎం జగన్ ఇలాకా పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో ప్రకృతి సహజసిద్ధంగా వెలసిన కొండలను అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలతో మింగేశారు. కొందరు అధికారపార్టీకి చెందినవారు ఈ తవ్వకాల్లో గుత్తాధిపత్యం చేపట్టి యథేచ్ఛగా కొండలమట్టిని తవ్వి ఇతరులకు విక్రయించి రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. లీజులు లేకున్నా ప్రభుత్వానికి డబ్బులు చెల్లించామంటూ అధికారులు, పాలకులను నమ్మించి కొందరు మట్టిని అమ్ముకుంటూ అర్జిస్తున్నారు. వేంపల్లెలో మట్టిమాఫీయా కొందరి కనుసన్నల్లో ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తూ ఇతరులను అడ్డుకోవడమే కాకుండా మైనింగ్ శాఖాధికారులకు మట్టిని తవ్వే యంత్రాలు, ట్రాక్టర్లను సీజు చేయిస్తున్నారని వేంపల్లె ఎన్డీఏ నేతలు ఇటీవల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా గ్రావెల్ తరలింపు విషయమై బుధవారం వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు భారతి, వైకాపా కార్యకర్త కొమ్మద్ది ఓబులేసు మధ్య జరిగిన వాగ్వాదం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఇక్కడ మట్టిమాఫీయా ఆగడాలు, ప్రభుత్వానికి పైసా డబ్బులు కట్టకుండా రేయింబవళ్లు మట్టిని తరలిస్తున్న అంశం వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చుట్టుపక్కల కొండలున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు గ్రావెల్ తరలింపునకు లీజుకు ప్రభుత్వానికి డబ్బులు చెల్లించామని చెబుతూ ఒకరు రంగంలోకి దిగారు. ఇక్కడి పులివెందుల రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ కేంద్రంగా మట్టి మాఫీయా తమ కార్యకలాపాలకు తెరలేపారు. సీఎం నియోజకవర్గం కావడంతో ఇక్కడ స్థలాలు, పొలాలకు మంచి గిరాకీ ఉంది. దీనికి తోడు ఇబ్బడిముబ్బడిగా మండలంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.కోట్లు విడుదల చేసింది. స్థిరాస్తి వ్యాపారులకు, గ్రావెల్, సీమెంట్రోడ్లు, ఇతరత్రా పనులకు గ్రావెల్ అవసరం. దీన్ని ఆసరాగా తీసుకున్న ఒకరిద్దరు ప్రభుత్వానికి ఎలాంటి డబ్బులు చెల్లించకుండా అనుమతుల్లేకుండా స్థానిక ఏపీమైనార్టీ గురుకులం, రాజీవ్నగర్కాలనీల వెనుకవైపు, పాములూరుగుట్ట, నందిపల్లెగుట్ట ఇలా ఎక్కడపడితే అక్కడ కొండలను యంత్రాలతో తవ్వి ట్రాక్టర్లు, ట్రిప్పర్లతో యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులను తమ పలుకుబడితో సదరు వ్యక్తులపై దాడులు చేయించడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. తమను కాదని మట్టి తీసుకెళుతుంటే సదరు నిర్మాణాలను, వ్యక్తులను ఈ మాఫీయా అడ్డుకుంటోంది. ఇదెక్కడి న్యాయమంటూ ఎన్నో పర్యాయాలు స్థానికులే మాఫీయాకు ఎదురుతిరిగిన దాఖలాలున్నాయి.
లీజులు ఒకచోట.. మట్టితవ్వకాలు ఇంకోచోట
వేంపల్లెలో కొందరికి మట్టితవ్వకాలకు ప్రభుత్వం లీజులిస్తే వారు మరోచోట మట్టి తవ్వి తరలిస్తున్నారు. ఒకరిద్దరిదే గుత్తాధిపత్యం కావడం వారిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేకపోవడంతో మట్టిమాఫీయాది ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. ఇటీవలే ఒకరిద్దరికి మట్టితవ్వకాల కోసం 15ఎకరాలకు లీజు, టెండర్లు రాగా వేంపల్లెలో ఉన్న కొండల్లో ఉన్న మట్టి తరలింపును చూస్తే ఏమేర అక్రమాలు జరిగాయో అర్థమవుతోంది. అక్రమార్కుల మట్టి తవ్వకాలకు అండగా నిలిచే ఆయా శాఖాధికారులకు సదరు మాఫీయా నెలనెలా కప్పం చెల్లిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండల కేంద్రంలో చోరీ
[ 16-06-2024]
మండల కేంద్రంలోని జి. వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. -
అక్రమాలపై ‘రామ’బాణం సంధించాలి!
[ 16-06-2024]
వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల పరిధిలో చేపట్టిన కాలేటివాగు ప్రాజెక్టుతోపాటు కురబలకోట మండలం ముదివేడు జలాశయం నిర్మాణపనుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాల్సి ఉంది. -
కడపలో నటి నిధి అగర్వాల్ సందడి
[ 16-06-2024]
కడప నగరంలో శనివారం సినీనటి నిధి అగర్వాల్ సందడి చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఏర్పాటు చేసిన జోస్ ఆలుక్కాస్ బంగారు ఆభరణాల షోరూంను ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవితో కలిసి ప్రారంభించారు. -
సరఫరా... అరకొర!
[ 16-06-2024]
వేసవి సెలవుల అనంతరం ఈ నెల 13న బడి గంట మోగింది. అదే రోజు విద్యార్థులకు విద్యాసామగ్రిని అందజేస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు. -
కబ్జాలపై ఉక్కుపాదం మోపండి!
[ 16-06-2024]
వైకాపా విధ్వంసకర పాలనకు చరమగీతం పాడిన తెదేపా, జనసేన, భాజపా కూటమిపై జిల్లా ప్రజానీకం.. ప్రత్యేకించి జగన్ సర్కారు బాధితులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొంతమంది వైకాపా నేతలు ఊరూవాడ భూములను కాజేశారు. -
ఇసుక తరలింపుపై వైకాపా నాయకుల గొడవ... దాడికి యత్నం
[ 16-06-2024]
ఇసుక తరలింపుపై ప్రొద్దుటూరులో వైకాపా ముఖ్య నేతల అనుచరులు పెన్నా నదిలో దాడులకు పాల్పడుతున్నారు. తమ ఏరియాలో తాము మాత్రమే ఇసుకను తరలించాలని ఇతరులు వస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. -
మంత్రి మండిపల్లి రాకతో పులకించిన రాయచోటి
[ 16-06-2024]
రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్రెడ్డి రవాణా, యువజన, క్రీడలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా శనివారం రాయచోటికి వచ్చారు. -
పీలేరు... అక్రమాల జోరు!
[ 16-06-2024]
నియోజకవర్గ కేంద్రం పీలేరు విద్య, వ్యాపార రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతోంది. అందుకు తగ్గట్టుగానే పంచాయతీకి ఆదాయం సమకూరుతోంది. అధికారం తమదేనని, అడిగేవారు లేరని గత వైకాపా ప్రభుత్వ హయాంలో పాలక వర్గాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేటీఎం - జొమాటో రూ.1,500 కోట్ల డీల్?
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
కొత్తదనం, ప్రయోగాలకు రామోజీరావు చిరునామా.. బెంగళూరులో జర్నలిస్టుల ఘన నివాళి
-
సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.31 కోట్లు.. బాధితులకు అందజేసిన అధికారులు
-
శ్రీలీల ‘డ్రిప్పిన్’ కల్చర్.. రోజీ చీరలో మంజిమా..
-
కౌంటింగ్ వేళ ఈవీఎం అన్లాక్ ఘటన..ఎంపీ బంధువు అరెస్ట్