పల్లెటూరి జీవనం.. జగమెరిగేలా!
ఒకప్పుడు సినిమా కథలు సింహభాగం పల్లెటూరు.. కుటుంబాలు.. అనుబంధాల చుట్టూనే తిరిగేవి. మారుతున్న కాలానికనుగుణంగా ఆధునిక కథల జోరు పెరిగింది.
కౌటాల గ్రామీణం(సిర్పూరు), న్యూస్టుడే: ఒకప్పుడు సినిమా కథలు సింహభాగం పల్లెటూరు.. కుటుంబాలు.. అనుబంధాల చుట్టూనే తిరిగేవి. మారుతున్న కాలానికనుగుణంగా ఆధునిక కథల జోరు పెరిగింది. మెట్రో జీవనశైలి, విదేశీ నేపథ్యాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శన నిర్మాతలు. అప్పుడప్పుడు పల్లెటూరి కథలు వచ్చి వెళ్లేవి. తాజాగా ఈ పోకడల్లో మార్పు కనిపిస్తోంది. మట్టి మనుషుల కథలు వెండితెరపై సందడి చేస్తున్నాయి. ఇటీవల విడుదలై బలగం సినిమా ఈ కోవకే వస్తుంది. ఇప్పుడు ఆదివాసీ గిరిజన జిల్లా అయిన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానెపల్లి మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన దిందా కేంద్రంగా ఓ చిత్రం ఇప్పుడు వెండితెరకు పరిచయం కానుంది. ఆ చిత్రమే ‘జగమెరిగిన సత్యం..’ ఇందులో దిందా గ్రామాన్నే ప్రధాన ఆయువుపట్టుగా తీసుకున్నట్లు దర్శకుడు తెలిపారు.
ఇక్కడి ప్రజల నేపథ్యం.. అమాయకత్వం.. వెనుకబడిన పరిస్థితులను ఆధారంగా తీసుకొని కౌటాల, చింతలమానెపల్లి, మహారాష్ట్రలోని అహేరీ, ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో ఈ సినిమా సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమా దర్శకుడు పాలె తిరుపతి సైతం పెంచికల్పేట్ మండలం చేడ్వాయి గ్రామానికి చెందినవాడు కావడంతో ఈ ప్రాంతంలో జరిగిన యదార్థ ఘటనలు వెండితెర ద్వారా బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది.
గ్రామీణ నేపథ్యం.. కళ్లకు కట్టినట్లుగా...
కుమురం భీం ఆసిఫాబాద్లోని మహారాష్ట్ర సరిహద్దులో 1994లో గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు, ఇప్పటికీ ఆచరణలో ఉన్న కొన్ని కట్టుబాట్లు.. ఆచారాలను ప్రధానంగా తీసుకొని ఈ చిత్రం రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. దిందా గ్రామ సమీపంలోని వాగు, గూడెం ప్రాణహిత నది వంతెన, పెంచికల్పేట్ పెద్దవాగు, కౌటాల బస్టాండు, మహారాష్ట్రలోని అహేరిలో ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రేమ సన్నివేశాలు, సంస్కృతి, సంగీతం, భావోద్వేగాల నడుమ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు పాలె తిరుపతి వివరించారు. ఈ చిత్రంలోని పలు సన్నివేశాల్లో నటించేందు(బ్యాక్గ్రౌండ్)కు దిందా గ్రామస్థులకు అవకాశం కల్పించారు. బతుకమ్మ పాటను గాయకురాలు మంగ్లీ పాడగా.. విరాటపర్వం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన బొబ్బిలి సురేష్ ఈ చిత్రానికి కూడా స్వరాలు అందించారు. హీరోగా రవితేజ మేనల్లుడు అవినాష్ వర్మ, హీరోయిన్గా ఆద్యారెడ్డిలను తొలిసారి పరిచయం కానున్నారు. తాను తీసిన మొదటి చిత్రం ఇదేనని ప్రేక్షకులు ఆశీర్వదించాలని దర్శకుడు తిరుపతి కోరుతున్నారు. మార్చి నెలాఖరులో ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఒడుదొడుకులను ఎదుర్కొని.. దర్శకుడిగా ఎదిగి
పాలె తిరుపతి స్వగ్రామం పెంచికల్పేట్ మండలం చేడ్వాయి. గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆయన మంచిర్యాలలో డిగ్రీ చదివాడు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. చిన్నప్పుడు తన తండ్రి పాలె ఆశన్నతో కలిసి భజన కార్యక్రమాలకు వెళ్లేవాడు. తండ్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో తనకు సినిమా రంగంపై ఆసక్తి పెరిగిందని చెబుతున్నాడు తిరుపతి. సినీరంగంపై ఆసక్తితో హైదరాబాద్కు వెళ్లిన ఆయనకు అందరిలాగే ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. అయినా పట్టువదలకుండా దర్శకత్వం విభాగంలో ఎనిమిదేళ్ల పాటు వివిధ స్థాయిల్లో పనిచేసిన ఆయన కొరియన్ శీర్షికన ‘అహేరి’ అనే లఘుచిత్రాన్ని రూపొందించాడు. ఈ లఘుచిత్రం విజయవంతం కావడంతో వెండితెర వైపు అవకాశం లభించింది. పూర్తి పల్లెటూరు నేపథ్యం కలిగిన ‘జగమెరిగిన సత్యం’ చిత్రంలో తన కలల ప్రయాణం ప్రారంభించారు. చిన్నతనంలో తన తండ్రి పాడిన ఓ పద్యాన్ని ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో చిత్రీకరించినట్లు చెబుతున్నారు తిరుపతి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
[ 27-07-2024]
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఓ వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది -
అన్నదాతకు సముచిత న్యాయం
[ 27-07-2024]
ఎదులాపురం: రాష్ట్ర బడ్జెట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలకు సముచిత న్యాయం చేసిందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం
[ 27-07-2024]
15 మంది విద్యార్థులు ఫైనల్ సెమిస్టర్ పరీక్ష రాసినప్పటికీ వారు గైర్హాజరు అయినట్లు ఫలితాలలో చూపిస్తుందని, దీంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రతినిధి తాజ్ అన్నారు. -
వెనుకబాటు.. తలసరిలోటు..
[ 27-07-2024]
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూనే.. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, విద్య, వైద్య తదితర రంగాలపై దృష్టి సారించింది. -
లేదు పొగ.. దోమల పాగా..
[ 27-07-2024]
వర్షాకాలం కావడంతో గ్రామాల్లో దోమలతో వచ్చే వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. -
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు
[ 27-07-2024]
తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతారు. పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మొత్తం వారి కోసం ధారపోయడం సర్వసాధారణం. -
ఫలించిన న్యాయపోరాటం
[ 27-07-2024]
వస్తుందనుకున్న ఉద్యోగం ఆమెకు రాలేదు. నిబంధనల మేరకు అర్హత ఉన్నా నియామక వేళ జరిగిన తప్పిదంతో ఆశలు గల్లంతు అయ్యాయి. -
గొలుసుకట్టు.. అంతా కనికట్టు
[ 27-07-2024]
వీసీకాఫిన్ యాప్ ఖాతాలో రూ.580 చెల్లించిన సభ్యుడికి వెంటనే రూ.110 బోనస్గా వస్తాయి. అనంతరం రోజూ రూ.26 చొప్పున 45 రోజుల్లో రూ.1174 యాప్ ఖాతాలో జమవుతాయి -
6 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధం
[ 27-07-2024]
ఆరురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు, మహారాష్టలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రాణహిత నది, పెద్దవాగులకు వరద పోటెత్తింది. -
కరకట్టలకు నిధులు.. బాధితుల్లో ఆశలు
[ 27-07-2024]
జలాశయం వెనుక జలాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట భూములు, నివాస గృహాలు ముంపునకు గురవుతున్నాయి. -
చాటుమాటు.. యువతకు చేటు
[ 27-07-2024]
‘స్థానిక ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాటి నుంచి బయటపడేస్తానని నమ్మించిన ఓ మహిళ ఆమెను వ్యభిచార కూపంలోకి దించి వ్యాపారాన్ని సాగిస్తోంది. -
బస్సులు లేక.. సమయానికి చేరుకోలేక..
[ 27-07-2024]
-
చేతి పంపు నీరు.. మహా పసందు
[ 27-07-2024]
నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామస్థులంతా ఆ ఒక్క చేతిపంపు నీరే తాగుతారు. అంటే ఇంకా చేతిపంపులు లేవా, మిషన్ భగీరథ నీరు అందడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అదేం కాదు -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు