Vijayawada: విజయవాడ పార్లమెంటు ఓట్ల లెక్కింపునకు 98 టేబుళ్లు
ఇబ్రహీంపట్నం (జూపూడి)లోని నోవా, నిమ్రా కళాశాలల్లో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసి, సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే : ఇబ్రహీంపట్నం (జూపూడి)లోని నోవా, నిమ్రా కళాశాలల్లో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసి, సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘ డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, పోలీసు శాఖాధికారులతో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) ద్వారా బుధ]వారం సమీక్షించారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి కలెక్టర్ పాల్గొని.. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై వివరించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లకు ఒక్కొక్క దానికి 14 టేబుళ్ల చొప్పున 98 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం 132 రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నట్టు వెల్లడించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అన్ని వసతులు సమకూర్చినట్లు వివరించారు. ఈవీఎంలు, పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి గందరగోళ పరిస్థితులకు తావులేకుండా బారికేడింగ్, పార్కింగ్ కల్పించినట్లు వివరించారు.
వేగవంతమైన అంతర్జాలం: ఓట్ల లెక్కింపులో రౌండ్ల వారీ ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. మీడియా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కంప్యూటర్లు, వేగవంతమైన అంతర్జాలం, ఎన్కోర్లో డేటా ఎంట్రీకి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీసీలో జేసీ పి.సంపత్ కుమార్, వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్, విజయవాడ, తిరువూరు, నందిగామ ఆర్డీవోలు బి.హెచ్.భవానీ శంకర్, కె.మాధవి, ఎ.రవీంద్రరావు, జగ్గయ్యపేట, విజయవాడ పశ్చిమ ఆర్వోలు జి.వెంకటేశ్వర్లు, ఇ.కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల