బిక్కుబిక్కుమంటున్న పాల్వాయి గేటు.. పిన్నెల్లి తీరుపై సర్వత్రా ఆగ్రహం
గడప గడపకు కార్యక్రమం ద్వారా ఊర్లోకి వచ్చిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి గ్రామస్థులు పూలతో స్వాగతం పలికారు.
పోలింగ్రోజున జరిగిన ఘటనలతో గ్రామం విడిచిన పురుషులు
మహిళలను బూతులతో దూషించిన ఎమ్మెల్యే పిన్నెల్లి
ఈనాడు డిజిటల్, నరసరావుపేట, న్యూస్టుడే, రెంటచింతల, గురజాల
మహిళలను బెదిరిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి
గడప గడపకు కార్యక్రమం ద్వారా ఊర్లోకి వచ్చిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి గ్రామస్థులు పూలతో స్వాగతం పలికారు. కానీ నేడు అదే ఎమ్మెల్యే మహిళలని చూడకుండా ఓ ప్రజాప్రతినిధినని మరిచి వేలు చూపిస్తూ అసభ్య పదజాలంతో బెదిరించాడు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీరుపై పాల్వాయిగేటు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్రోజున గ్రామస్థులపై దాడులు చేయడంతో ప్రస్తుతం ఊర్లో పురుషులెవ్వరూ లేరు. వైకాపా అల్లరిమూకలు దాడులకు పాల్పడతాయని తలోచోట తలదాచుకుంటున్నారు. కుటుంబపెద్ద ఎక్కడో దూరంగా ఉండడంతో స్థానిక మహిళలు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇలా ఎంతకాలం భయపడుతూ గడపాలో అంటూ ఆవేదన చెందుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పాల్వాయిగేటు గ్రామం పోలీసు పహారాలోకి వెళ్లింది. ఏ క్షణాన ఎటు వైపు నుంచి ఎవరు దాడి చేస్తారేమోనని మహిళలంతా భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. చిన్న గ్రామం కావటం.. గుంటూరు-మాచర్ల ప్రధాన రహదారిలో ఉండటం.. ఇళ్ల వెనుకభాగంలో ఎటువంటి రక్షణ లేకపోవడంతో భయం మరింత పెరిగింది. భారీ వాహనాలతో ప్రత్యర్థులు వచ్చి ఒక్కసారిగా గ్రామంపై పడతారనో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 13న పోలింగ్ జరగడం, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలకొట్టడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలింగ్ ముగిసిన తర్వాత రోజు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి పరామర్శల నెపంతో కారంపూడిలో బీభత్సం సృష్టించారు. అనంతరం పాల్వాయిగేటుపై దాడులు చేసే అవకాశం ఉందని గ్రహించి తెదేపా నాయకులు గ్రామం విడిచి వెళ్లారు. ఆరోజు నుంచి ఈ రోజు వరకూ మహిళలు భయంతో జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో పోలీసు పికెట్ కొనసాగుతున్నా వీరిలో ధైర్యం రావడంలేదు. మండల పరిధిలోని ఘటనలు గుర్తు చేసుకుంటూ తమ గ్రామం వారిపై కూడా దాడులకు పాల్పడతారేమోనని భయపడుతున్నారు. పాల్వాయిగేటు గ్రామాన్ని అంతం చేస్తానంటూ రామకృష్ణారెడ్డి చేసిన బెదిరింపులు తమ చెవుల్లో వినిపిస్తూన్నే ఉన్నాయని ప్రాణభయంతో గడుపుతున్నామని మహిళలు ఆవేదన వెలిబుచ్చారు.
పెద్ద సంఖ్యలో రెండు పార్టీలకు చెందిన నేతలు రహస్య ప్రదేశాలకు తరలివెళ్లారు. దీంతో ఎవరికి ఎటువంటి ఆపద పొంచి ఉందోనని ఆందోళనలో ఉన్న వృద్ధులు టీవీల ముందు పడిగాపులు కాస్తున్నారు. నిరంతరం మాచర్ల వార్తలు చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఎప్పటికప్పుడు తమకుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో? ఏమైనా అరెస్టు చేశారా? లాంటి సమాచారం తెలుసుకుంటున్నారు. పొలం పనులకు వెళ్లటం, గేదెలకు మేత తేవటానికి కూడా జంకుతున్నారు.
తెదేపాకు ఓట్లు పడుతున్నాయనే అసహనంతో..
పాల్వాయిగేటులో రెండుసార్లు వైకాపా సర్పంచి, ఎంపీటీసీ సభ్యులు గెలుపొందారు. దీంతో వైకాపా మద్దతు గ్రామంగా ప్రతి ఒక్క వైకాపా నేత భావించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్వాయిగేటుకు ఎమ్మెల్యే పిన్నెల్లి వస్తే మహిళలు పూలతో స్వాగతం పలికారు. కాని పోలింగ్నాడు తెదేపాకే అధికసంఖ్యలో ఓట్లు పడుతున్నాయని వైకాపా నేతల సమాచారంతో ఎమ్మెల్యే స్వయంగా ఈవీఎంలు ధ్వంసం చేయడం, అతని వర్గీయులు బూత్ల వద్ద దాడులకు పాల్పడటం మహిళలను అసభ్యపదజాలంతో దూషించి వేలెత్తి బెదిరించటంతో గ్రామస్థులు కొత్త వ్యక్తులతో మాట్లాడేందుకే ఆసక్తి చూపటంలేదని గ్రామస్థుడు అర్జునరావు వెల్లడించారు.
ఎన్నికల రోజు ఈవీఎం ధ్వంసం ఘటనలో వైకాపా, తెదేపా నేతలు గ్రామం విడిచారు. ప్రస్తుతం దూరప్రాంతాల్లో తలదాచుకున్నారు. కారంపూడి ఘటన రోజు రక్షణగా ఇతర గ్రామాల మిత్రులు, పార్టీ నేతలు గ్రామంలో నిద్రించారు. అయినా భయం వీడకపోవటంతో ఎన్నికల రోజుల్లో హుషారుగా పనిచేసిన రెండు పార్టీల నేతలందరూ నేడు గ్రామంలో కనిపించని పరిస్థితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల