చంద్రబాబుతోనే సంక్షేమం, అభివృద్ధి
‘ఇకపై మంగళగిరే నా సొంత ఊరు. మా కుటుంబంపై ప్రజల అభిమానం అపురూపం. ఇక్కడి వాతావరణం కుమారుడు దేవాన్ష్కు కూడా బాగా నచ్చింది. మంగళగిరిలో లోకేశ్ విజయం తథ్యం. ఎంత మెజార్టీ సాధిస్తారన్నదే మిగిలింది.’ అని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు.
మంగళగిరి నా సొంత ఊరు.. లోకేశ్ గెలుపు తథ్యం: బ్రాహ్మణి
ప్రచార రథం పైనుంచి అభివాదం చేస్తూ..
మంగళగిరి, తాడేపల్లి, న్యూస్టుడే: ‘ఇకపై మంగళగిరే నా సొంత ఊరు. మా కుటుంబంపై ప్రజల అభిమానం అపురూపం. ఇక్కడి వాతావరణం కుమారుడు దేవాన్ష్కు కూడా బాగా నచ్చింది. మంగళగిరిలో లోకేశ్ విజయం తథ్యం. ఎంత మెజార్టీ సాధిస్తారన్నదే మిగిలింది.’ అని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. మంగళగిరిలో శనివారం రోడ్ షో అనంతరం ఆమె నరసింహస్వామి ఆలయ సవమీపంలోని టిఫిన్ బండి వద్ద అల్పాహారం తీసుకన్నారు. బండి నిర్వాహకుడు శేఖర్ను ప్రశంసించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని, రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన వారికి ఆయన అండగా ఉంటారన్నారు. లోకేశ్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇక్కడి వారిని కుటుంబ సభ్యుల్లా భావించి సొంత నిధులతో సేవలందిస్తున్నారని, ప్రత్యేక విజన్తో మంగళగిరి అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారన్నారు. రోడ్షోలో వెల్లువెత్తిన అభిమానం చూస్తోంటే చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలంతా చంద్రబాబును సీఎంని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక్కడి చేనేత ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు లోకేశ్ సంకల్పించారని, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అండగా నిలుస్తారన్నారు. ప్రజాప్రభుత్వం రాగానే మంగళగిరి రూపురేఖలు మారుస్తామని భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలుగు మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
టిఫిన్ బండి వద్ద అల్పాహారం తీసుకుంటూ..
రోడ్షోకు బ్రహ్మరథం.. తెదేపా యువనేత, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి బ్రాహ్మణి శనివారం మంగళగిరి పట్టణంలో రోడ్షో నిర్వహించారు. ఆమెకు మంగళగిరి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారిపొడవునా పూలవర్షం కురిపిస్తూ మహిళలు హారతులు పట్టారు. ‘జై లోకేశ్ అన్నా’ అంటూ నినాదాలు చేశారు. గౌతమ బుద్ధా రోడ్డు నుంచి పాదయాత్రగా కాలినడకన బయలుదేరిన ఆమె మిద్ది సెంటర్ నుంచి ప్రధాన వీధికి చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనంపై అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భవనాలపై నుంచి పూలు చల్లుతూ మహిళలు, యువతులు అభిమానం చాటుకున్నారు. రైతులు రెండెడ్ల బళ్లతో నడవగా.. యువత నృత్యాలు, డీజే సౌండ్లతో సందడి చేశారు. తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, ఆరుద్ర భూలక్ష్మీ, ఊట్ల దుర్గామల్లేశ్వరి, తెదేపా మంగళగిరి పట్టణ, గ్రామీణ అధ్యక్షులు దామర్ల రాజు, తోటా పార్థసారథిÅ, బాలాజీ గుప్తా, గోవాడ దుర్గారావు పాల్గొన్నారు.
ర్యాలీలో జనసందోహం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రత కట్టుదిట్టం..!
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. -
జీఎంసీ స్థలంలో ప్రహరీ నిర్మాణంపై వివాదం
[ 02-06-2024]
నగరపాలక సంస్థకు చెందిన ట్యాంక్ పోరంబోకు స్థలంలో ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రహరీ నిర్మాణం చేపట్టగా.. -
పనులు పూర్తి చేయండి... లేదంటే సొమ్ములిచ్చేయండి
[ 02-06-2024]
పాఠశాల ప్రధానోపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బడి ఖాతాలో డబ్బులు ఉంటే వాటిని వినియోగించి పాఠశాలల్లో ఉన్న అసంపూర్తి పనులు పూర్తి చేసుకోండి. -
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం: కలెక్టర్
[ 02-06-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 4న జిల్లాలోని ఏడు అసెంబ్లీ, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాలకు నిర్వహించే ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి చెప్పారు. -
‘ఎన్డీయే కూటమిదే విజయం’
[ 02-06-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు సూచిస్తున్నాయని రాజధాని రైతులు తెలిపారు. -
కాసులు రాల్చక.. కాలువలు కానక..
[ 02-06-2024]
కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 5.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాలువల మరమ్మతులపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
ప్రత్యర్థుల హత్య.. శవాలు మాయం
[ 02-06-2024]
గురజాల మండలం దైదలో 1997లో జరిగిన హత్యలో హతుడు తగుళ్ల పిచ్చయ్యను ముక్కలుగా నరికి కృష్ణానదిలో వేసిన వైనం అప్పట్లో సంచలనం కలిగించింది.