logo

GHMC: ఇంటింటి సర్వే కోసం పర్యవేక్షణ అధికారులను నియమించిన ప్రభుత్వం

Eenadu icon
By Telangana Dist. Team Updated : 09 Nov 2024 17:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) పరిధిలో ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో కచ్చితత్వంతోపాటు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీతోపాటు జోనల్ స్థాయిలోనూ ఈ సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు క్షేత్ర స్థాయిలో సిబ్బందితో సమన్వయం కోసం పర్యవేక్షణ అధికారులను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో పర్యవేక్షణ అధికారిగా హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సికింద్రాబాద్, చార్మినార్ జోన్లకు హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్ శ్రీవత్సను నియమించారు. ఎల్బీనగర్‌, ఖైరతాబాద్ జోన్లకు పురపాలక శాఖ ఉప కార్యదర్శి ప్రియాంక, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి జోన్లకు జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ పర్యవేక్షించనున్నారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఝార్ఖండ్ ఎన్నికల అధికారిగా వెళ్లారు. అక్కడి నుంచే సర్వే తీరును ఆయన పరిశీలిస్తున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా సర్వే పర్యవేక్షణ బాధ్యతలను సర్పరాజ్‌కు అప్పగించారు. జోనల్ కమిషనర్లు, పర్యవేక్షణ అధికారులను సమన్వయం చేసుకుంటూ గ్రేటర్‌లో నిర్దేశించిన గడువులోగా సర్వేను పూర్తి చేయాలని, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సర్పరాజ్ సహకారం అందించాలని ప్రభుత్వం సూచించింది.

Tags :
Published : 09 Nov 2024 17:20 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని