Neal Katyal: ట్రంప్ టారిఫ్లకు ‘నీల్’ చెక్ పెట్టేనా..! ఎవరీ భారత సంతతి లాయర్..?

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా చరిత్రలోనే అత్యంత కీలకమైన న్యాయవిచారణకు అగ్రరాజ్య సుప్రీంకోర్టు సిద్ధమవుతోంది. టారిఫ్ల పేరుతో ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం (Trump Trade War) సాగిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాలను నిర్ణయించే అంశంపై న్యాయస్థానం బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) విచారణ జరపనుంది. ఈ కేసులో ట్రంప్నకు వ్యతిరేకంగా భారత సంతతి అటార్నీ నీల్ కత్యాల్ (Neal Katyal) వాదనలు వినిపించనున్నారు. దీంతో ఆయన పేరు ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో మార్మోగుతోంది. ఇంతకీ ఎవరాయన?
54 ఏళ్ల నీల్ కత్యాల్ షికాగోలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి వచ్చిన వలసదారులు. యేల్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నీల్.. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో యూఎస్ సొలిసిటర్ జనరల్గా వ్యవహరించారు. ఇప్పటివరకు అమెరికా సుప్రీంకోర్టులో 50కి పైగా కేసులను వాదించారు.
ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ..
గతంలో పలుమార్లు ట్రంప్ (Donald Trump) విధానాలకు వ్యతిరేకంగా నీల్ న్యాయస్థానాల్లో వాదించిన సందర్భాలున్నాయి. 2017లో ట్రంప్ తొలిసారి అధికారంలో కొన్ని దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలకు వ్యతిరేకంగా నమోదైన కేసులను నీల్ వాదించారు. ‘ఇంపీచ్: ది కేస్ అగైనెస్ట్ డొనాల్డ్ ట్రంప్’ అనే పుస్తకాన్ని కూడా రచించారు. తాజాగా ట్రంప్ టారిఫ్లను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన చిన్న వ్యాపారులు, డెమోక్రాట్ పాలిత రాష్ట్రాల కూటమి తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.
రెండోసారి అధికారంలోకి రాగానే ట్రంప్ మిత్ర, శత్రు భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై సుంకాలతో (Trump Tariffs) విరుచుకుపడిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికార చట్టాన్ని ఉపయోగించి ట్రంప్ ఈ సుంకాలు విధించారని అమెరికా సర్కారు తెలిపింది. అయితే, ఈ చట్టాన్ని వినియోగించే క్రమంలో అధ్యక్షుడు ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ట్రంప్ నిర్ణయాన్ని కొన్ని న్యాయస్థానాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై బుధవారం విచారణ జరగనుంది.
విచారణకు ట్రంప్ దూరం..
ఈ కేసు విచారణకు ట్రంప్ ప్రత్యక్షంగా హాజరుకావాలని తొలుత భావించారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నారు. ప్రభుత్వం తరఫున ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ హాజరుకానున్నారు. ఈ కేసు విచారణపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘‘ఇందులో మేం గెలిస్తే.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న, సురక్షితమైన దేశంగా అమెరికా నిలుస్తుంది. ఒకవేళ ఓడిపోతే పేద దేశంగా మారుతుంది. అలా జరగొద్దని భగవంతున్ని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
ఇస్లాం ఛాందసవాదుల ఒత్తిడికి తలొగ్గుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ దేశంలోని పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. - 
                                    
                                        

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
Indian student visa: కెనడాలో భారత విద్యార్థి వీసాలు భారీగా తిరస్కరణకు గురయ్యాయి. - 
                                    
                                        

ఆయనను భారత్కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
Subramanyam Vedam: భారత సంతతికి చెందిన వేదం సుబ్రహ్మణ్యంను అమెరికా నుంచి పంపించకుండా అక్కడి న్యాయస్థానాలు ఆదేశాలిచ్చాయి. - 
                                    
                                        

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
పాక్ సైన్యం డాలర్లు, ఇతర లాభాల కోసం అమ్ముడుపోతుందని పాక్ జేఎస్ఎంఎం గ్రూపు ఛైర్మన్ షఫీ బుర్ఫాత్ ఆరోపించారు. - 
                                    
                                        

ఇజ్రాయెల్కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
ఇజ్రాయెల్ పాలనకు మద్దతు ఇవ్వడం ఆపేవరకు అమెరికాకు తాము సహకరించమని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పేర్కొన్నారు. - 
                                    
                                        

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
షట్డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. - 
                                    
                                        

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉషా మతం గురించి చేసిన వ్యాఖ్యలను భారతీయ- అమెరికన్ అయిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. - 
                                    
                                        

అఫ్గాన్లో భారీ భూకంపం.. 20 మంది మృతి
ఉత్తర అఫ్గానిస్థాన్లో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా కనీసం 20 మంది మృతిచెందారని, 640 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. - 
                                    
                                        

పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది
పాకిస్థాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎవరికీ చెప్పరు. - 
                                    
                                        

తొలగని అమెరికా ప్రభుత్వ ప్రతిష్టంభన
అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫెడరల్ ప్రభుత్వ సేవలు మూతబడి 33 రోజులైంది. దీన్ని ప్రభుత్వ మూత అంటున్నారు. - 
                                    
                                        

ఏకాగ్రతను తిరిగి తెచ్చే మెదడు తరంగాలు
మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ భాగంలో సుడుల్లా తిరిగే ఒక మెదడు ప్రక్రియ ఏకాగ్రతకు సాయపడుతుందని తాజా అధ్యయనం తెలిపింది. చేస్తున్న పని నుంచి ఒక్కోసారి ధ్యాస పక్కకు మళ్లుతుంటుంది. - 
                                    
                                        

నైజీరియాపై సైనిక చర్యకు ప్రణాళిక
పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళికను రూపొందించాలని పెంటగాన్ను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. - 
                                    
                                        

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
భారత్ తమకు కష్టకాలంలో అండగా నిలిచిందని మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయూమ్ ప్రశంసించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను సహించం: మంత్రి అనిత
 - 
                        
                            

అమెరికాలో హైర్ బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే: కాంగ్రెస్
 - 
                        
                            

తెదేపా క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
 - 
                        
                            

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
 - 
                        
                            

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
 - 
                        
                            

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
 


