logo

కృతుంగ, విక్టోరియా రెస్టరంట్లలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది తనిఖీలు

Eenadu icon
By Telangana Dist. Team Published : 07 Nov 2024 12:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ముసాపేట: అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగుతున్న రెండు రెస్టరంట్లలో జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భరత్‌నగర్‌లోని శ్రీరాములు థియేటర్‌ పక్కన విక్టోరియా, కృతుంగ రెస్టరంట్లు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పవన్ ఆధ్వర్యంలో సిబ్బంది రెండు హోటళ్లలో కిచెన్‌ గదులను పరిశీలించారు. వంటశాలలో బొద్దింకలు, ఎలుకలు కనిపించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజుల తరబడి నిల్వ ఉంచే ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న  హోటళ్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తామని ఇన్‌స్పెక్టర్‌ పవన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని