GHMC: మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీల విలీనం షురూ
శివారు మున్సిపాలిటీల జాబితాలో ఉన్నవి..
పురపాలకశాఖ ఉద్యోగులుగా పంచాయతీ అధికారులు

ఈనాడు, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారులోని మున్సిపాలిటీల్లోకి అక్కడున్న సమీప గ్రామపంచాయతీలు విలీనమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ను బాహ్యవలయ రహదారి వరకూ విస్తరించే క్రమంలో శివారు మున్సిపాలిటీలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో శివారు మున్సిపాలిటీల్లో 51 గ్రామాలను కలిపేందుకు రెండునెలల క్రితం ఆర్డినెన్స్ జారీచేసింది. ఇందులోని అంశాలకు అనుగుణంగా మున్సిపాలిటీ అధికారులు కొద్దిరోజుల నుంచి చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీల రికార్డులు, భూములను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులను మున్సిపాలిటీల్లోని వార్డుల ఖాతాల్లోకి చేర్చారు. ఆస్తిపన్నులను వసూలు చేస్తున్నా.. ఆయా గ్రామ పంచాయతీల పేర్లను సాఫ్ట్వేర్లో నమోదు చేయకపోవడంతో ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు సాధ్యం కావడం లేదు. ఇక ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్నవారు మున్సిపాలిటీ వ్యవస్థలోకి వెళ్లడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు, ఉద్యోగులకు బాధ్యతలు
గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులుగా విధులు నిర్వహించిన వారిని నేరుగా పురపాలకశాఖ అధికారులుగా పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ వారు విధులు నిర్వహించిన సంవత్సరాలను సర్వీసుగా పరిగణించారు. గ్రామ పంచాయతీల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహించిన వారిని కూడా మున్సిపాలిటీ అధికారులు తీసుకున్నా... వార్డుల్లో పని విధానం, ఇతర కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని వీరికి ఉద్యోగం ఇస్తున్నారు. సర్వే లెక్కలు, గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ గ్రామాల్లో పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. వీరందరికీ పురపాలకశాఖ నుంచి జీతాలు వచ్చేవిధంగా చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీల పరిధి పెరిగిన దృష్ట్యా మరికొందరు కొత్తవారిని నియమించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని మున్సిపల్ కమిషనర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
మౌలిక వసతులపై నజర్
మున్సిపాలిటీల్లో విలీనమైన 51 గ్రామాల్లో మౌలిక వసతులపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించారు. చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని కొత్తగా విలీనమైన గ్రామాల బాధ్యతలు పర్యవేక్షిస్తున్న అధికారులను ఆదేశించారు. తాగునీటి సౌకర్యం లేని ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్లతో సరఫరా చేయాలని నిర్ణయించారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటి పరిమాణాన్ని తెలుసుకుని పంచాయతీ, గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారుల ద్వారా కొత్త పైప్లైన్లు, పైప్లైన్ల సామర్థ్యం పెంచేందుకు నివేదికలు అడుగుతున్నారు. ఆయా గ్రామాల్లో మురుగునీటి ప్రవాహాన్ని ఎక్కడికి పంపించాలన్న అంశంపై ప్రణాళికలను రూపొందించి మురుగునీటి వ్యర్థాల నిర్వహణను చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
[ 04-11-2025]
ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్కు తెలంగాణ ప్రభుత్వం శాఖలు కేటాయించింది. - 
                            
                                
                                ఉన్నత విద్యామండలి కార్యాలయ ముట్టడికి యత్నం
[ 04-11-2025]
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. - 
                            
                                
                                తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన
[ 04-11-2025]
అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. - 
                            
                                
                                ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు షెడ్యూల్ ఇచ్చిన స్పీకర్
[ 04-11-2025]
భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ షెడ్యూల్ ఇచ్చారు. - 
                            
                                
                                హైదరాబాద్లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
[ 04-11-2025]
నగరంలోని ఓ వైద్యుడి ఇంట్లో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. ముషీరాబాద్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న జాన్పాల్ అనే వైద్యుడు దిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. - 
                            
                                
                                గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
[ 04-11-2025]
గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ను అధికారులు పట్టుకున్నారు. 11 మందిని అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. - 
                            
                                
                                మీ చరవాణిలో ‘జీపే’ ఉందా..?
[ 04-11-2025]
‘మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు.. ఎంతమందికి ఓట్లు ఉన్నాయి.. ఇంటి పెద్ద ఫోన్నెంబరు ఇవ్వండి..’ - 
                            
                                
                                యమ‘కంకరు’డిలా
[ 04-11-2025]
కాలేజీకి వెళ్లే విద్యార్థులు.. విధులకు హాజరయ్యే ఉద్యోగులు.. బంధువుల ఇంటికి వచ్చి తిరిగివెళ్తున్న మహిళలు.. బిడ్డా.. వెళ్లగానే ఫోన్ చేయ్ అంటూ తల్లిదండ్రులు.. - 
                            
                                
                                క్యూఆర్ కోడ్ స్కాన్తో తితిదే సమాచారం
[ 04-11-2025]
భక్తులు ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సమాచారం తెలుసుకునేలా హిమాయత్నగర్ (లిబర్టీ)లోని తితిదే దేవాలయం వద్ద ‘క్యూఆర్ కోడ్’లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. - 
                            
                                
                                ఘటన దురదృష్టకరం.. బాధితులను ఆదుకుంటాం
[ 04-11-2025]
హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పలువురు ప్రముఖులు చేవెళ్ల ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. - 
                            
                                
                                అధికలోడు.. అతివేగం.. అదుపేది?
[ 04-11-2025]
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ అతివేగం.. పరిమితికి మించి కంకర రవాణా చేస్తుండటమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. - 
                            
                                
                                ప్రమాదాల కట్టడి సాంకేతికతపై అలసత్వం
[ 04-11-2025]
ప్రమాదాలను గుర్తించి అప్రమత్తం చేసే ‘అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్’ (ఏడీఏఎస్) ప్రవేశపెట్టిన ఆర్టీసీ.. ఆ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. - 
                            
                                
                                అనుమతులు లేకుండానే.. అడ్డగోలుగా కనెక్షన్లు
[ 04-11-2025]
నగరంలో విద్యుత్తు కనెక్షన్ కావాలంటే జీహెచ్ఎంసీ, శివార్లలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఇంటి నిర్మాణ అనుమతి పత్రం ఉండాలి. - 
                            
                                
                                గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్
[ 04-11-2025]
షాద్నగర్ పట్టణ శివారులోని నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.శైలజపై వేటు పడింది. - 
                            
                                
                                ఫ్యాబ్సిటీలో ఐటీ సంస్థలు.. పరిశ్రమలు
[ 04-11-2025]
బాహ్యవలయ రహదారికి సమీపంలోని తుక్కుగూడ ఫ్యాబ్సిటీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. - 
                            
                                
                                పార్కు సిద్ధం.. ప్రవేశం నిషిద్ధం!
[ 04-11-2025]
మహానగరంలో హిమాయత్సాగర్ చెంత హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఏకోపార్కు ప్రారంభానికి ఎదురు చూస్తోంది. - 
                            
                                
                                వ్యాపార విస్తరణకు చేయూత
[ 04-11-2025]
వీధి విక్రయదారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. అధిక వడ్డీల భారం నుంచి వీరిని గట్టెక్కించి స్వశక్తితో నిలదొక్కుకునేలా చేయడం దీని ఉద్దేశం. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 


